ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం టేకుమట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, పెన్సిళ్లను గోనె వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గోనె వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అలాగే ప్రాథమిక పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు నేర్పించే విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, వేణుమాధవ్,గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్,ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్,వార్డ్ మెంబర్లు అశోక్,తరుణ్,కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
