కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా
వనపర్తి నేటిదాత్రి .
డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు
