బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు…

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు

వీణవంక, నేటి ధాత్రి:

 

వీణవంక మండల పరిధిలోని చల్లూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని వారోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమారా చారి మాట్లాడుతూ, అమ్మ ఫౌండేషన్ వారు మా పాఠశాలలో ప్రతినిత్యం పిల్లలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ
వారి మాట, పాటలతో పిల్లలను చైతన్య పరుస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి, గాయకులు గోనెల సమ్మన్న , ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు గాయకడు దరిపెల్లి మురళి, సభ్యులు గంధం సుమన్, గాయకుడు పొట్టాల శివ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున టి_ సాట్(T-SAT), తెలంగాణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతు విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన, ఆసక్తిని కలిగించడానికి , ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించామని, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పింపించడం జరుగుతుందన్నారు. గెలుపోందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.
వ్యాసరచనలో లతిక శ్రీ ఉన్నత పాఠశాల లింగంపేట(ప్రథమ), భవిష్య ఉన్నత పాఠశాల (ద్వితీయ) శ్రీవిన్ ఉన్నత పాఠశాల జోగాపూర్( తృతియ),
ఉపన్యాస పోటిలో రిషిక ఉన్నత పాఠశాల మాల్యాల(ప్రథమ), అశ్విత ఉన్నత పాఠశాల నర్సింగాపూర్(ద్వితీయ), హర్షిని ఉన్నత పాఠశాల చందుర్తి(తృతీయ),
క్విజ్ పోటిలో కీర్తన ఉన్నత పాఠశాల మల్యాల(ప్రథమ), శ్రీ చరిత ఉన్నత పాఠశాల మూడపల్లి ( ద్వితీయ) , మహి దీక్షిత ఉన్నత పాఠశాల మల్యాల (తృతీయ) బహుమతులు
గెలుపొందారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు , ప్రతిభ పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య, అంబటి శంకర్, అగ్రవ చారి,అమర్ నాద్, కార్తీక్ , సుధారాణి, ప్రకాశ్ వ్యవహరించారు.

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు…

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు

రామడుగు, నేటిధాత్రి:

 

టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్టేషన్ హైస్కూల్ లో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు..

స్టేషన్ హైస్కూల్ లో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

చిన్ననాటి నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

 

ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల కు డ్రాయింగ్, వ్యాస రచన, 50 మంది తెలంగాణ కవుల చిత్ర పటాలను ప్రదర్శించి వారి రచనలు విద్యార్థుల చే పరిచయం,చేయడం జరిగింది. ఇంకా క్విజ్, ఉపన్యాసం, పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసను ఈసాడించుకోవడం జరిగింది, ఇలాంటి సందర్భంలో కాళోజి లాంటి మహనీయులు మన తెలంగాణ యాస భాష లను, మన మాండలికాలను కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాగొడవ లాంటి రచన లతో ఉత్తేజ పరచడం జరిగింది. అలాగే మనం కూడా ప్రస్తుత సమాజం లో మన భాషా యాస లను గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పారు.
మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ భావి పౌరులు అయినా మీరు చిన్నపటి నుండే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం లో తెలుగు ఉపాధ్యాయులు అగుర్తి సురేష్, సంపంగి లక్ష్మికుమారి, చారాల సత్యనారాయణ, ఉపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, ముదిగిరి సదయ్య, నర్సింహ రెడ్డి, కుమారస్వామి, కృష్ణవేణి, మధు, యాదగిరి, మదన్మోహన్, శ్రీనివాసులు, చందర్, భద్రాసింగ్, శ్రీవిద్య, శ్రీనివాస్, రాజేందర్, జ్యోతి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం…

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version