నారాయణఖేడ్‌లో మైనార్టీ ఖబ్రస్థాన్‌కు 5 ఎకరాల భూమి కేటాయింపు

మైనార్టీ ఖబ్రస్థాన్ కు 5 ఎకరాల భూమి కేటాయింపు, భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నూతన మైనార్టీ ఖబ్రస్థాన్ ఏర్పాటుకు 5 ఎకరాల భూమిని కేటాయించి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, మైనార్టీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఖబ్రస్థాన్ అభివృద్ధిలో భాగంగా పహరి గోడ నిర్మాణానికి రూ.10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మైనార్టీ సమాజానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగింది,

“మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు”

మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన పలువురు నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, మాజీ క్రికెట్ లెజెండ్ మహ్మద్ అజారుద్దీన్ను హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆదివారం కలవడం జరి గింది. హుగ్గేల్లీలోని మహేంద్ర ప్యారడైస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా. సిద్దం ఉజ్వల్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ను కలిసిన హుగ్గేల్లీ కాంగ్రెస్ నాయకులు పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. మంత్రి అజా రుద్దీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం తన శాఖ నిరంతరం కృషి చేస్తుం దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పట్లోళ్ళ నర్సింహా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి రాజు, సీనియర్ నాయకులు నర్సింహులు, తుక్కా రెడ్డి, నరేష్, నాగిరెడ్డి తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.

మండల మైనార్టీ నాయకులు అజారుద్దీన్ ను మంత్రి పదవి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు..

మండల మైనార్టీ నాయకులు అజారుద్దీన్ ను మంత్రి పదవి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

గత నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోం శాఖ కోసం అజా రుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ పోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది,ఝరాసంగం మండల మైనారిటీ డైనమిక్ లీడర్ మొహమ్మద్ ఫక్రుద్దీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు మొదటిసారి మంత్రి పదవి కేటాయించాలని హర్షం వ్యక్తం చేశారు

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి…

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version