రాష్ట్ర క్విజ్‌లో పులి కీర్తనకు ప్రథమ బహుమతి…

టీ-సాట్, టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో మల్యాల విద్యార్థినికి పులి కీర్తన కు ప్రథమ బహుమతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

తెలంగాణ స్కిల్స్ అకడమిక్ అండ్ ట్రైనింగ్ (T-SAT) మరియు తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీ-సాట్ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో రాజన్న జోన్ జట్టు ప్రథమ స్థానాన్ని పొందింది.
రాజన్న జోన్ జట్టుకు చందుర్తి మండలం మల్యాల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పులి కీర్తన ప్రాతినిథ్యం వహించినారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మెమెంటో, అభినందన పత్రం మరియు క్యాష్ ప్రైస్ అందజేసినారు.
రాష్ట్రస్థాయి క్విజ్ పార్టీలో ప్రతిమ స్థానం పొందిన పులి కీర్తనను సిరిసిల్ల జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు జోగినపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్, చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్, మల్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర మరియు గ్రామస్తులు అభినందించినారు.

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున టి_ సాట్(T-SAT), తెలంగాణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతు విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన, ఆసక్తిని కలిగించడానికి , ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించామని, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పింపించడం జరుగుతుందన్నారు. గెలుపోందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.
వ్యాసరచనలో లతిక శ్రీ ఉన్నత పాఠశాల లింగంపేట(ప్రథమ), భవిష్య ఉన్నత పాఠశాల (ద్వితీయ) శ్రీవిన్ ఉన్నత పాఠశాల జోగాపూర్( తృతియ),
ఉపన్యాస పోటిలో రిషిక ఉన్నత పాఠశాల మాల్యాల(ప్రథమ), అశ్విత ఉన్నత పాఠశాల నర్సింగాపూర్(ద్వితీయ), హర్షిని ఉన్నత పాఠశాల చందుర్తి(తృతీయ),
క్విజ్ పోటిలో కీర్తన ఉన్నత పాఠశాల మల్యాల(ప్రథమ), శ్రీ చరిత ఉన్నత పాఠశాల మూడపల్లి ( ద్వితీయ) , మహి దీక్షిత ఉన్నత పాఠశాల మల్యాల (తృతీయ) బహుమతులు
గెలుపొందారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు , ప్రతిభ పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య, అంబటి శంకర్, అగ్రవ చారి,అమర్ నాద్, కార్తీక్ , సుధారాణి, ప్రకాశ్ వ్యవహరించారు.

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు…

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు

రామడుగు, నేటిధాత్రి:

 

టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version