బిహార్ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
నవంబర్ 14వ తేదీ తర్వాత బిహార్ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆర్జేడీ (RJD) నేత, మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తెలిపారు. బిహార్ను అట్టడుగు స్థాయిలోకి ఎన్డీయే నెట్టేసిందని, పోలింగ్కు ముందు ఎన్నికల అధికారులను కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే జరుగనుండటంతో సోమవారంనాడు మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
నవంబర్ 14 తర్వాత బిహార్ను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తాం. ఆహార ఆధారిత యూనిట్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఇరిగేషన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ సిటీలు, ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క బిహారీ కూడా ఇతర సిటీలకు వెళ్లాల్సిన పని లేదు’ అని తేజస్వి తెలిపారు. ఈసారి చాలా స్పష్టంగా బిహార్లో మార్పు కనిపిస్తోందని, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు బలంగా తీర్మానించుకున్నారని, ప్రజలు చరిత్ర సృష్టించనున్నారని చెప్పారు.
