బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ..
Congress
ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ సందర్బంగా ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ నిజానిజాలపై మండల కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధమే ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం వెనకడుగు వేయం బి.ఆర్.యస్ పార్టీ అహంకారంతో నిరంకుశ వైఖరితో పాలనను కొనసాగించి దోపిడి దౌర్జన్యం ఇంటిపేరుగా మార్చుకున్న బిఆర్ఎస్ నాయకులు నీతులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని అన్నారు అంతే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గత పది సంవత్సరాల పాలనలో ఇసుక దొంగలు ఎవరో తెలుసు,భూ దొంగలు ఎవరో తెలుసు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కమిషన్లు తీసుకున్నవారు తెలుసు. రైతులను వేధించింది ఎవరో తెలుసు సామాన్యులను దోచుకుందువరో తెలుసు,దళితులను,గిరిజనులను,బీసీ,మైనారిటీలను అవమానించిన వారు ఎవరో తెలుసు. అన్ని నీచ పనులు చేసి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు అని తెలిపారు.
రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
Ra Channa Patel
ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్
హన్మకొండ, నేటిధాత్రి:
సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు… కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.
చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు. 1947లోనే బోధన్ లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్ ప్రకటించి మూసివేసారన్నారు. దీంతో సుమారు 15 వేల ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మగారాలను అర్థంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు, వారి పిల్లల సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట చక్కర కర్మగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో రైతులతో కలిసి పార్టీలకతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్మాగారం మూతపడడంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించిన ఘనత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దక్కుతుందన్నారు. ఒకటి కోరుట్ల నియోజకవర్గంలో, మరొకటి జక్రాన్ పల్లిలో మంజూరు చేయించామని. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చక్కర కర్మగారాన్ని తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ధర్నా కార్యక్రమ కన్వీనర్, రాష్ట్ర నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, నరేష్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేపీ నాయకులు, రైతు సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, పంచిరి విజయ్, రాజ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బింగి వెంకటేష్, దొనికెల నవీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బొడ్ల నరేష్, గుగ్గిళ్ళ తుకారం గౌడ్, బొడ్ల ఆనంద్, పన్నాల రాఘవరెడ్డి, బొడ్ల గౌతమ్, జక్కుల జగదీష్, సదాశివ్, మహేష్, బొమ్మెల శంకర్, జుంగల ఆనంద్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, సుంచు రణధీర్, రాజారెడ్డి, కొయ్యల లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, చెట్లపల్లి సాగర్, కలాల సాయిచందు, ఇట్యాల నవీన్, కుడుకల రఘు, కలిగోట శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నోటిని అదుపులో పెట్టుకో – మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం – కేకే సిరిసిల్ల వాసి – గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు
సిరిసిల్ల:(నేటి ధాత్రి)
బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్ల మధు నువ్వు నిన్న మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని, భేషరతుగా కెకె మహేందర్ రెడ్డి అన్నకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అర్హతకు, ( పరిధికి ) మించి మాట్లాడొద్దని అన్నారు. పెద్దవారిని విమర్శిస్తే పెద్దొనివైతవని భ్రమలో మాట్లాడుతున్నావని అన్నారు. కెకె మహేందర్ రెడ్డి పుణ్యమే సిరిసిల్ల నియోజకవర్గం, కెకె మహేందర్ ప్రతి ఇంటి,ఇంటికి గులాబి జెండాని, తెలంగాణ నినాదాన్ని పరిచయం చేసిందని అన్నారు. నీకు తెల్వకపోతే కేటీఆర్, కేసీఆర్ లను అడుగని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో మల్కపేట రిజర్వాయర్ లో నీళ్ళు నింపలేని చాతగాని మనుషులు ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు. కెకె మహేందర్ రెడ్డి ని విమర్శిస్తే కెకె మహేందర్ రెడ్డి అభిమానులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం
కోట్లాది రూపాయల ధన ప్రవాహంతోనే బిజెపి గెలుపు
కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్ర మోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం పదకోండు ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే యాభై ఐదువేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.
-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్ఎస్ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్ దక్కకపోవచ్చు. కాంగ్రెస్లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్నుంచి బిఆర్ఎస్లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్ఎస్కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్ఎస్ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్ఎస్ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్ఎస్ను అణచివేయొచ్చు. బిఆర్ఎస్ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్ఎస్ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్ఎస్ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్ఎస్ ఛీప్తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్, హరీష్రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ టికెట్ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్ఎస్ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.
బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాణాల ఇందిరా భర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాల రాంబాబు గుండెపోటుతో మరణించగా రాంబాబు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు.రాంబాబు భార్య మాజీ కౌన్సిలర్ ఇందిరతో పాటు కుటుంబాన్ని ఓదార్చారు.అనంతరం స్థానిక నాయకులతో కలిసి పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ఉపాధ్యక్షులు, పట్టణ పార్టీ ప్రచార కార్యదర్శి,వార్డు అధ్యక్షులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీల్లు లేక అరిగోస పడుతున్నారని తెలిపారు. ఎండుతున్న వరిపోలాన్ని చూడలేక పశువులను మేతకు వదులుతున్న దుస్థితి నెలకొన్నదని అన్నారు. వెంటనే మిడ్ మేనేర్ నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆడుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ , పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ ,కొండ రమేష్ గౌడ్ ,నాయకులు నమిలికొండ శ్రీనివాస్, గూగులోత్ పెంటయ్య, అజ్మీర రాజు నాయక్,అజ్మీర తిరుపతి నాయక్, భూక్య ప్రభు, ధరావత్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్న రైతులు
రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంను, అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారు. * మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.*
వరంగల్, ఎనుమాముల నేటిధాత్రి
BRS leaders
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సంఘీభవంగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లు కలిసి ఏనుమముల మార్కెట్ ను సందర్శించి రైతన్నల కష్టాలను మద్దతు ధర లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతు.. రైతన్నలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతన్నలు రోడ్డున పడి ఆగమవుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతన్నల పొట్టగొడుతున్నారు అని, ఇలా రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తొందరలోనే అదే రైతన్నలు భూస్థాపితం చేస్తారు అని చెప్పారు. రైతన్నలకు మద్దతు ధర ఇవ్వడంలో కాని, ఎరువుల సప్లై లో కాని, రైతు బీమాలో కాని రైతన్నను కేసీఆర్ చూసుకున్నట్లు ఎవరు చూడట్లేదని, ఆయనను మించిన నాయకుడు ఈ దేశలోనే లేడు అని అన్నారు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ ఈ ఏనుమముల మార్కెట్ లో మద్దతు ధర కాని రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మరియు గుమస్తాలు, దడవాయిలు, హమాలీ కార్మికులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అని అన్నారు. ఇలా మద్దతు ధర ఇవ్వకుండా రైతన్నలను నానా గోసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు రైతన్న పక్షాన కొట్లాడటానికి మా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తూర్పు కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి
కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకట రమణారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక భూపాల్ పల్లిలో నిన్న జరిగిన రాజలింగ మూర్తి హత్య విషయంలో రాజకీయం చేసి కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ మ్యారేజ్ విషయంలో ఉన్న కోర్టు కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అన వసరమైన ఆరోపణలు చేయ డం సరికాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి హత్య రాజకీయాలు మా ప్రభుత్వంలో గాని, గండ్ర రమణారెడ్డి ఇప్పటివరకు చేయలేదని హత్యా రాజకీ యాలు కాంగ్రెస్ పార్టీ నాయకు లకు కొత్తేమి కాదని ఇరువ ర్గాల మధ్య భూ వివాదంమే ప్రధాన కారణమని అందరూ చెపుతున్నారని,హత్య జరిగిందని దానిని బీఆర్ ఎస్ నాయకులకు రుద్దడం సిగ్గు చేటని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకొని ప్రజా పాలన చేయాలని హత్య రాజకీయాలు మీరు చేస్తారు మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి గడిపే విజయ్ బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ యూత్ మండలాధ్యక్షుడు మారేపల్లి మోహన్ కరణ్ బాబు మస్కే భాస్కర్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు వెంకట్ ఉన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప
సిరిసిల్ల(నేటి ధాత్రి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని తిట్టడం తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 222 కొట్ల బతుకమ్మ చీరల బకాయిలను ఉంచిపోగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 202 కోట్ల బకాయిలను చెల్లించి, పోచంపల్లిలో ఉన్న స్టాక్ ను కూడా కొనుగోలు చేసేలా కార్మికులను, వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పందులతో అపరిశుభ్రతతో ఉందనడము సబబు కాదని టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పందులు ఉండేవని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారింది కాబట్టి జిల్లా కేంద్రానికి కావలసిన వసతులను సమకూరుస్తూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజ్ వంటి పనులు అవసరం కనుక అభివృద్ధి పనుల్లో భాగంగా సిరిసిల్ల అభివృద్ధి చెందింది తప్ప ప్రత్యేకంగా మీరు చేసింది ఏమీ లేదని అన్నారు. కేవలం మీరు మీ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారని, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు. బాపు కేసీఆర్ అభివృద్ధి చేశాడని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం చేసిన అప్పులకు బాధ్యత వహించి మీరు కడతారా అన్నారు. ఆనాడు ఉద్యమంలో కెసిఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు చేస్తూ ఉద్యమం నడిపించారు అందులో మేమందరం కూడా ఆ నినాదాలకు కట్టుబడే ఉద్యమంలో పాల్గొన్నాము కాబట్టే అందులో భాగంగానే ప్రాజెక్టు లు కట్టాడని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి ఆనాడు ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీకి ఎంతగానో పనిచేసే ప్రజా ప్రతినిధులను గెలిపించుకుని పార్టీని విస్తరించాడు ఈనాడు విమర్శలు చేస్తున్నరన్నారు. ఆనాడు ఏ పార్టీలో ఉండేవారు ఏ స్థాయిలో ఉండేవారు మర్చిపోవద్దని అన్నారు. ఈనాడు అనవసరపు విమర్శలు చేస్తున్నవారు కేకే మహేందర్ వెంట తిరిగిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. కేకే మహేందర్ వేంట తిరిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను వెన్నుపోటు పొడిచి డైరెక్ట్ గా కేటీఆర్ ను తీసుకువచ్చి కేవలం 170 ఓట్లతో గెలిపించుకున్నారని అన్నారు. ఇది వెన్నుపోటు కాదా అని అన్నారు. లేకుంటే ఏనాడో కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ వంటి పదవులు చేపట్టేవారని అన్నారు. ఆయన గెలిచే టైంలో నోటికాడబుక్కను గుంజుకున్నట్టు చేసింది మీరు కాదా, అలాంటి మీరు కేకే మహేందర్ రెడ్డిని పదేపదే ఓడిపోతున్నాడని విమర్శించడం సరికాదని అన్నారు.. ఇక్కడ వనరులను దోచుకుంది మీరు, ఏ హోదా ఉందని ఎవర్ని భయపెట్టాలని గన్ మెన్ లని పెట్టుకున్నారని అన్నారు. భూకబ్జాలు చేసింది మీరు కాదా అని అన్నారు.. ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకులూరి బాలరాజు, తిరుపతి రెడ్డి,నలిని కాంత్,కోడం అమర్నాథ్, కొడిక్యాల రవి, బొద్దుల శీను, ఇసుక మధు, వేముల రవి,వంగరి దత్తు తదితరులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్
– బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ
– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గలలో జరుగుతున్న ఎన్నికని అన్నారు.గ్రామాల్లో ఉన్న పట్టభద్రులకు 50 మందికి ఒకరిని ఇంచార్జి గా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ వేస్తే మళ్ళీ ప్రజా ప్రభుత్వంలో డీఎస్సీ వేయడం జరిగిందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల లో ఇచ్చిన ఉద్యోగాలను మనం పది నెలల్లో ఇవ్వడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో లేకుండా బీజేపీ తో ఒక లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఆనాడు రాష్టప్రతి ఎన్నికల్లో, నల్ల చట్టాల అమలు సమయంలో బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు ఇచ్చారని అన్నారు. బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ అన్న విధంగా ఉందని అన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు రావడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ అన్నారు. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడితే మీకు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతాయని అన్నారు. మండలాల వారిగా గ్రామాల వారిగా ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు. బూతుకు ఒక ఇంచార్జి పెట్టీ ఎన్నికలో ముందుకు పోవాలని అన్నారు. ఎన్నికల రోజు బూతు ఇంచార్జిలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు వచ్చి ఓటు వేసేలా చూడాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ వివరించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టి నేడు పోటీలో లేదని అన్నారు. బల్మూరి వెంకట్ ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక అక్రమ కేసులను పెట్టారని అన్నారు. నేడు ప్రజా ప్రభుత్వంలో టిఆర్ఎస్ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. ఆనాడు కేటీఆర్ సిరిసిల్ల కి వస్తె నేరేళ్లలో ముళ్ళ కంచెలు వేసేవారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు.
ప్రమాదవశాత్తూ మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పార్టీ ప్రమాద బీమా కింద రూ.1 లక్ష చెక్కులను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తిమ్మాజీపేట గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కదిరే పాండు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, అమ్మపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సంక బాలరాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, బిజినేపల్లి మండలంలోని కార్కొండ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బొట్క భీముడు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మరణించడంతో వారికి పార్టీ ప్రమాద బీమా పథకం కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షల చెక్కులను అందజేశామన్నారు. పార్టీల మనుగడ పార్టీ కార్యకర్తల మీద ఆధార పడి ఉంటుందని, ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కెసిఆర్ పార్టీ కార్యకర్తలకు మిగతా ఏ పార్టీలకు లేని విధంగా భీమా సదుపాయం కల్పించారన్నారు. వారి ప్రీమియంను కూడా పార్టీ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. పార్టీ కోసం పని చేసే వారికీ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన తంగళ్ళపల్లి మండల మాజీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్.అధ్యక్షులు నిన్న రాత్రి 8:30కు పరమపదించినా రు ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు వారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీలో 2009 నుంచి పార్టీలో పని చేస్తూ పని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మండలంలోని ఎన్నో పదవులు చేసిన రఘువర్మ ఈరోజు మాలో లేకపోవడం చాలా దురదృష్టకరమనితెలియజేస్తూ పార్టీపరంగా ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పార్టీలో పెద్దలతో మాట్లాడి ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా చనిపోయిన రఘు వర్మ కుటుంబాన్ని అన్ని అన్ని విధాలుగాఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,
vaddiraju ravichandra
రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి భాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.
పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ‘గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.
గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మం జిల్లా నెలవు కావడం మనందరికి కూడా గర్వకారణమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇక్కడ లభించే గ్రానైట్ చాలా నాణ్యతతో కూడుకున్నదని, దీనికి దేశవిదేశాలలో కూడా మంచి గుర్తింపు ఉందన్నారు.
ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ 2024-26 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఖమ్మంలోని ఏస్ ఆర్ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ
వద్దిరాజు మాట్లాడుతూ, ఢిల్లీలోని పోలీస్ అకాడమీకి 380టన్నులు, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఈ జిల్లాకు చెందిన గ్రానైట్ నే ఉపయోగించిన విషయాన్ని గుర్తు చేశారు.ఇది మనకెంతో గర్వ కారణమన్నారు.గ్రానైట్ ఇండస్ట్రీ కారణంగా ఎటువంటి వాతావరణ కాలుష్యం ఉత్పన్నం కాదని,మరిన్ని రాయితీలు కల్పించి దీనిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులను నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు యుగంధర్, ప్రధాన కార్యదర్శి గోపాల రావు, కోశాధికారి పరమేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ రియాజ్, రాంమూర్తిలు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకట రమణ,శ్వేధన్, అనిల్ కుమార్, లాల్ ప్రతాప్, రవికుమార్, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి గాను చెన్నై బయలుదేరారు
బీఆర్ఎస్ అధ్యక్షులు కే.చంద్రశేఖరరావు మార్గనిర్దేశనం, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు
చెన్నైలో గురు, శుక్రవారం రెండు రోజులు జరిపే ఈ అధ్యయన యాత్రకు బయలుదేరి వెళ్లిన వారిలో ఎంపీ రవిచంద్రతో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,కోరుకంటి చందర్,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితర ప్రముఖులు ఉన్నారు
`బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలుసు.
`బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలకు అలుసు.
`బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు!
`పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు?
`తెలంగాణలో బిసిల అభ్యున్నతి అంటే బిస్కట్లు వేయడమా?
`అధికారంలో వున్నప్పుడు దామాషా లేదు.
`ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు.
`మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి.
`లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి.
`యాచించడం కాదు, శాసించడం కావాలి.
`బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మారుమ్రోగించండి.
`ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయండి.
`అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయండి.
`బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోండి.
`బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో చూడండి!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో బిసి మబ్బులు కమ్ముకున్నాయి. బిసిల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా బిసి నినాదం ఊపందుకున్నది. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి జపం చేయని తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో బిసి గణన అనేది రాజకీయ అంశంగా మారి చాలా కాలమైంది. పార్లమెంటు ఎన్నికలలో బిజేపికి అదే ఆశనిపాతమైంది. అయినా ఆ వేడి తెలంగాణ దాక అప్పటి వరకు రాలేదు. దేశ వ్యాప్తంగా కుల గణన డిమాండ్ ఈపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో బిసిల ఐక్యతా రాగం జోరందుకున్నది. అటు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిసి లెక్కలు తేలాల్సిందే అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గళం విప్పారు. ఇది ఆయన స్వయంగా ఎంచుకున్న అంశమా? లేక పార్టీ వెనకుండి నడిపిస్తున్న విషయమా! అన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు తీన్మార్ మల్లన్న ఉచ్చులో పడిపోయాయన్నది వాస్తవం. ఇప్పుడు ముందుకు తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేకుండా చేయడంలో మల్లన్న మొదటి విజయం అందుకున్నారు. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల కదిలేలా చేశారు. బిసిల అంశంలో అన్ని పార్టీల బిసి నేతలను ఒకే వేధిక మీదకు తెస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు జేఏసి గూటికి చేరాయి. కాలం గడుస్తున్న కొద్దీ జారిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురౌతుందా! లేక బిసిల దామాషా ప్రకారం అందాల్సిన సీట్లు అన్ని పార్టీలు ప్రకటించే దాక పోరు జరుగుతుందా! వేచి చూడాలి. అయితే అన్ని పార్టీలు బిసి నినాదం ఎజెండాగా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని ప్రయత్నం చేస్తాయా? లేదా అన్నది కూడా తేలిపోతుంది. బిజేపి గత ఎన్నికల ముందే బిసి. ముఖ్యమంత్రి స్లోగన్ వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటిస్తే బిజేపి సీట్ల గెలుపు మరో రకంగా వుండేది. జాతీయ పార్టీలు ముందుగా సిఎం. అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని తప్పించుకున్నారు. గెలవాల్సిన చోట ఓటమి మూటగట్టుకున్నారు. చే జేతులా ఎన్నికల ముందు చేతులు ఎత్తేసి చెయ్యి పార్టీకి మార్గం సుగమం చేశారు. తర్వాత తప్పు చేశామని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లు బిసిల అంశాన్ని ముట్టుకోలేదు. అసలు బిసిలకు రావాల్సిన సీట్లు కూడా కేటాయించ లేదు. ఇప్పుడు తెలంగాణలో బిసి విదానం అమలు చేసే పార్టీకే నూకలుంటాయని బిసిలు బలంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం వుంది. తాజాగా బిఆర్ఎస్ బిసి అంశం ఎక్కడ కాంగ్రెస్, బిజేపిలు ఎత్తుకొని మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిని చేస్తాయో అని ఉలిక్కిపడిరది. బిసి నేతలంతా కలిసి రాజకీయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ పార్టీ నాయకులు సమావేశమై ఎజెండా రూపకల్పన చేశారు. కానీ వాళ్ల ఎజెండా ఎన్నికల నాటికి కేసిఆర్ అమలు చేస్తాడా? అన్నది మాత్రం అనుమానమే. అధికారంలో వున్న పదేళ్ళలో బిఆర్ఎస్ బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమి లేదు. మంత్రి వర్గంలో తగిన స్థానం కల్పించింది లేదు. సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కేసిఆర్ పట్టించుకున్నది లేదు. పదేళ్ల కాలంలో ఎంతో మంది ఓసి నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. కానీ బిసి అయిన ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి తరిమేశాడు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి దించేశాడు. బిసి.బిడ్డ కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. ఇలా బిసిలకు అనేక రకాలుగా కేసిఆర్ అన్యాయం చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి వేధిక మీద దళితుడే ముఖ్యమంత్రి అని వందల సార్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే మాట మార్చాడు. మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించలేదు. అలాంటి కేసిఆర్ ఇప్పుడు బిసి నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. స్వయంగా కేసిఆరే బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ ప్రకటించినా ప్రజలు నమ్ముతారనే నమ్మకం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఎలాగైనా అధికారంలో వస్తామనే కలలు కేసిఆర్ కంటున్నారు. అందుకే తెలంగాణ ఏం జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదు. కేసిఆర్ ను ఓడిరచి తప్పు చేశామన్న భావనలో ప్రజలు పశ్చాత్తపపడాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ కేసిఆరే రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాడు. కాకపోతే ప్రజల్లో నాయకులు వుండాలన్న ఆలోచనతో బిసి నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేమ్ మొదలుపెట్టారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తానే ముఖ్యమంత్రిగా వుండాలనుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో ఇతరులను ముఖ్యమంత్రులను చేయడం జరగదు. బిఆర్ఎస్ లో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయినా బిసి విధానం ప్రకటించాలనుకుంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బిసిల వాదం వినిపించాలనుకున్నప్పుడు కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే బిసి ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మించిన బిసి నాయకుడు లేడు. కాంగ్రెస్ కు చిత్త శుద్ధి వుంటే మంత్రి పేరు ప్రకటించాలి. అలాగే బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణలో బిజేపి బలపడడానికి ప్రధాన కారణం ఎవరు? అని ఏ ఒక్కరినీ ప్రశ్నించినా బండి సంజయ్ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా ముగ్గురు నాయకులు మూడు పార్టీలలో వున్నారు. ఈ ముగ్గురిని సిఎం అభ్యర్థులుగా ఆయా పార్టీలు చేయగలవా? ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! అందుకు అవసరమైన విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పగలరా? నిక్కచ్చిగా ఇదే మా నిర్ణయం అని పార్టీలు ప్రకటిస్తాయా! రాజకీయ అవసరాల కోసం బిసి నాయకులను ముందు పెట్టి బిసి వాదం అనగానే సరిపోదు! మన పార్టీ ఎక్కడ వెనుకబడి పోతుందో అన్న ఆందోళనతో నాయకులను ముందుకు తోయొద్దు. ఒకవేళ పార్టీల ఆదేశాలు లేకుండా రాజకీయ పార్టీలలో వుంటే బిసి నాయకులు తమ విధానం ఇదీ అని ప్రకటించగలరా? ఒక అడుగు ముందుకేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడే బిసి నేతలకు ఎన్నికల నాడు ఆ పార్టీలు టిక్కెట్లు ఇస్తాయా? తెలంగాణలో బిసి విధానంతో పార్టీలు నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! రాజకీయంగా ప్రజల్లో వెనకబడిపోతున్నామని గ్రహించి బిసిలను ముందుపెట్టకండి. ఈ విషయాన్ని ఆ పార్టీలలో వున్న నాయకులు బాగా ఆలోచించి ముందుకు రావాలి. తర్వాత బిసిలను కూరలో కరివేపాకులు చేయాలనే అన్ని పార్టీలు చూస్తాయి. దేశంలో మూడు సార్లు, నాలుగు సార్లు, వరుసగా ముఖ్యమంత్రులు అయిన వాళ్లు ఎంతో మంది నాయకులున్నారు. కానీ కేసిఆర్ ను రెండో సారికే ఎందుకు దించేశారో ఇప్పటికీ మధనం జరుపుకోవడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం అర్రులు చాచలేదు. కేసిఆర్ ను దించేయాలనుకున్నారు. ఆ స్పష్టత కనిపిస్తున్నా కేసిఆర్ అతి విశ్వాసానికి పోయారు. దెబ్బ తిన్నారు. పార్లమెంటు ఎన్నికలలో అందుకే మరింత ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ప్రజల్లో లేని నాయకుడు ఎప్పుడూ ప్రజా సేవకు పనికి రాడు. సరిగ్గా ఏపిలో కూడా అదే తీర్పు ఇచ్చారు. అయినా కేసిఆర్ ప్రజల కోసం బైటకు రాలేదు. ఒకవేళ ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చినా ఆయన జనం ముఖం చూడరు. పైగా అన్ని వర్గాలకు మేలు చేశానన్న భ్రమలో వున్నాడు. ఇతర వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేశాడు. వాళ్లు ముందుకొస్తే తన సీటుకు ఎసరొస్తుందనుకున్నాడు. అందుకే ప్రజలు కేసిఆర్ ను పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కేసిఆర్ ను నమ్ముతారనుకోవడం వృధా ప్రయాస. తనకు ఉద్యమ సమయంలో ఎంతో అండగా వున్న ఎంతో మంది బిసి నేతలను తర్వాత వారి ఉనికి ప్రశ్నార్థకం చేశాడు. ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటుగా మారింది. ఈసారి ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే! పాడాల్సిన సమయం వచ్చింది. ఏ పార్టీ అయితే బిసి ముఖ్యమంత్రిని ప్రకటిస్తుందో ఆ పార్టీకే మనుగడ కనిపిస్తోంది. అందుకే బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి. పార్టీల వేధికగా అన్ని పార్టీల అధినేతలు తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి. బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలు వంచించడం చూడంది కాదు. బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు! ఆ దిశగా అడుగులు వేయరెందుకు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగితం వుండాలి. బిసిల జనాభాను బట్టి సీట్లు కేటాయిస్తామని చెప్పడానికి అధ్యయనాలు అవసరమా? కాలయాపన, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ జరగదు. బిసిలు అంత అమాకులు కాదు. ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి. లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి. పార్టీలకు హెచ్చరికలు జారీ చేయాలి. యాచించడం కాదు, శాసించడం బిసిలు అలవర్చుకోవాలి. బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మోత మోగించాలి. బిసి సభలు, సదస్సులు, అడుగడుగునా నిరంతరం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బిసి ఉద్యమాలు రావాలి. ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయాలి. అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలి. బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోవాలి. బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో తేల్చుకోవాలి. సై అంటే సై అంటే తప్ప బిసిలు అధికారంలోకి రారు. బిసిలకు రాజ్యాధికారం దక్కదు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.