బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది..

బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది?

సబ్ ప్లాన్ కేటాయింపులు ఫుల్..ఖర్చులు నిల్

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన 2026- 27సం. 53 47,315 కోట్లబడ్జెట్ ప్రవేశ పెట్టింది. దేశంలో 20 శాతం ఉన్న దళితులకు సబ్ ప్లాన్ కింద 1,96,400 కోట్ల రూపాయల కేటాయించింది. కేటాయింపులు పెంచడం ద్వారా దళితులకు ఒరిగేదేముందని వాటి ని ఖర్చు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల దళితులకు మరింత అన్యాయం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్
అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటాయించింది.102 శాఖల ద్వారా కేటాయింపులు చేసిందని,ప్రధానంగా 2025 26 బడ్జెట్ను పోలిస్తే చూస్తే బడ్జెట్ 13,611 కోట్లు కాగా, సబ్ ప్లాన్ కింద 1,68,478 కోట్లు, అంబరిల్లా బడ్జెట్ 9540 కోట్లు కేటాయించారని చెప్పారు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ అవి ఒకచోట పెట్టి ఫూల్ చేసి నోడల్ ఆఫీసర్ కేటాయించి ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు వివిధ శాఖల ద్వారా ఖర్చుపెట్టినప్పటికీ ప్రత్యేకంగా దళితులకు ఖర్చు చేయకపోవడంతో వారి సంక్షేమం కుంటుపడుతుందన్నారు దళితులలో 70శాతం కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు 60 శాతం మంది దళితులు సరైన దుస్తులు పౌష్టికాహారం కు నోచుకోవడం లేదన్నారు దళితుల జనాభా 20 నుంచి 25 శాతానికి పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ మాత్రం 16% దగ్గరే ఆగిందన్నారు.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపులు లేవ న్నారు గ్రామీణ ప్రాంతాలలో వలసలు పెరిగి పట్టణాలకు వలసలు
వస్తున్న అత్యధికులలో దళితులు ఉన్నారని చెప్పారు పట్టణాలలో వారికి సరైన నివాసం లేదన్నారు. ఆర్థికంగా అత్యంత బలహీనంగా సామాజికంగా అణిచివేతకు గురవుతున్న దాడులపై బిజెపి 12 ఏళ్ల పాలనలో దళితులపై మరిన్ని దాడులు పెరిగాయన్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ విబిజీ రాంజీ బిల్లు తీసుకురావడం ద్వారా దళితుల నోటికాడబుక్క లాగేసిందాన్నారు గతంలో 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించే దాని స్థానంలో ఇప్పుడు రాష్ట్రాల మీదికి వదిలేసి 60 శాతానికి కేంద్రం తగ్గించుకొని 40 శాతం రాష్ట్రాల పైన భారంమోపుతుందన్నారు 125 రోజుల పని దినాలు పెంచుతామన్న ప్రభుత్వం సుమారు 1.50 000 కోట్ల రూపాయల కేటాయించాలన్నారు.
ఆ చట్టం ప్రారంభ దినాలలో 1,18 000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నేడు దానిని తగ్గించిందన్నారు
బడ్జెట్ కేటాయింపులలో పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు మూడు విభాగాల ద్వారా దళితులకు కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద కేంద్రమే ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేసి 102 శాఖల ద్వారా విడివిడిగా కాకుండా ఒకేచోట ఫూల్ చేసి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు అయ్యే విధంగా ప్రత్యేక కృషి కొనసాగించాలన్నారు ప్రధానమంత్రి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి మూడు నెలలకోసారి ఈ బడ్జెట్ పై సమీక్ష చేయాలన్నారు అంకెల్లో పెంచడం తప్ప ఆచరణలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితులకు ఒరిగేది ఏమి ఉండదు అన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

 

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

 కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో (Central Budget) తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి పౌర్ణమి తెలంగాణకు వెలుగులు తెస్తుందా..? , చీకటి ఇస్తుందా..? చూడాలని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

తెలంగాణకు న్యాయం చేయాలి..

కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకత ఉందన్నారు. రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్రానికి, బీజేపీకి చివరిసారిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాసంస్థల స్థాపనకు మోదీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తే తాము గౌరవంగా కలుస్తున్నామని ప్రస్తావించారు. పక్క రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే తాము తప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అప్పాయిపల్లి గ్రామం అభివృద్ధి లో ముందంజ…

అప్పాయిపల్లి గ్రామం అభివృద్ధి లో ముందంజ

ఎమ్మెల్యే మెగారెడ్డి సహకారముతో

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి నియోజకవర్గం అప్పాయిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి సహకారంతో 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని అప్పాయిపల్లి మాజి ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ రావ్ నేటిదాత్రి దినపత్రిక విలేకరితో చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఇండ్లు పూర్తి కావడానికి నిర్మాణ దిశలో ఉన్నాయని ఆనంద్ రావు చెప్పారు ఒక ఇందిరమ్మ ఇల్లు వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తెలుగు లక్ష్మి కి చెందిన నూతన గృహప్రవేశం చేశారని ఆయన పేర్కొన్నారు అప్పాయిపల్లి గ్రామంలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఒంటరి మహిళలకు వితంతువులకు పింఛన్లు ఇప్పిచ్చామని ఆయన తెలిపారు గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది కొరకు అప్లై చేసుకున్న లబ్దిదారులకు ఎల్ ఓ సి చెక్కులు ఎమ్మెల్యే మెగారెడ్డి ద్వారా ఇప్పించామని ఆయన పేర్కొన్నారు గ్రామంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరాని కి కృషి చేస్తానని ఆయన తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో అప్పయ్యపల్లి శివారులో ప్రభుత్వం ద్వారా రవాణా కార్యలయం కార్యాలయానికి స్థలం కేటాయించారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వపరంగా బడ్జెట్ 9 కోట్ల 50 లక్షలు మంజూరు ఆయన పేర్కొన్నారు ఈమేరకు మాజి ఉప సర్పంచ్ ఆనంద్ రావు అప్పాయిపల్లి గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఎంపీ మల్లు రవికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.

ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.

పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:

జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version