ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన జిల్లా దివ్యాంగ.సమితి నాయకులు దొంతనేని.చందర్రావు . మాట్లాడుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా చందర్రావు మాట్లాడుతూ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ.పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేసి. నిరాశ మిగిలించిందని తెలియజేస్తూ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని. దివ్యాంగుల కోసం 6,000 పింఛను మంజూరు చేయాలని తెలియజేస్తూ. గతంలో ఇచ్చిన హామీలను నెరవేస్తారని రాష్ట్రంలో దివ్యాంగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారని. కానీ ప్రభుత్వం దివ్యాంగులకు ఎటువంటి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బడ్జెట్ కేటాయించడం చాలా దురదృష్టకరమని. గత ప్రభుత్వం దివ్యాంగులకు 4000 రూపాయలు .పింఛన్ ఇచ్చిన మాట నిలుపుకున్న ఆనాటి ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6000 .పింఛన్ ఇస్తామని .మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వం చెల్లించడం లేదని వెంటనే దివ్యాంగుల సంక్షేమానికి సరిపడా బడ్జెట్ కేటాయించాలని ఇచ్చిన మాట ప్రకారం 6000. రూపాయల. పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో వచ్చే మాసంలో తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసనలు కార్యక్రమాలు చేపడతామని. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల సమితిల ఆధ్వర్యంలో జిల్లా నాయకులు దొంతినేని చందర్రావు డిమాండ్ చేశారు

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి…

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి

రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో తల్లి దివ్యాంగులకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిం చాలని రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఫణిచంద్ర కు వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న దివ్యాంగులు నిరుపేదలైన ఫిజికల్ కోటలో వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో
అరికిల్లసాంబయ్య దివ్యాం గుడు పల్లెబోయిన సారయ్య ఎంపిటిసి మాజీ అబ్బు రఘు పతి రెడ్డి శంకర్ లింగం గడిపే ప్రభాకర్ కటికే అశోక్రాజోజు రజిత దివ్యాంగురాలు,సామల శంకర్ లింగం దివ్యాంగుడు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని దివ్యాంగుల స్థానిక సంస్థల ప్రాతినిధ్య కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దివ్యాంగులకు టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దివ్యాంగులు చట్టసభల్లో ఉంటే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు….

వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు కోసం గ్రామ కార్యాలయాలు ముట్టడి

◆:- వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ ఎల్గోయి గ్రామాలలో ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగులు గ్రామపంచాయతీ కార్యాలయాలు ముట్టడిచ్చి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకురాలు శోభ రాణి మండల నాయకురాలు బిస్మిల్లా వికలాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version