స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని దివ్యాంగుల స్థానిక సంస్థల ప్రాతినిధ్య కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దివ్యాంగులకు టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దివ్యాంగులు చట్టసభల్లో ఉంటే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.