బాధిత కుటుంబాలను పరామర్శించిన..!

పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన రాజా రమేష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గడ్డం రాజు_ విజయలక్ష్మి ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. వారి తల్లి భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, నాయకులు బొమ్మ భూమయ్య గౌడ్, జక్కన బోయిన కుమార్, నందిపేట సదానందం, రామిడి లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, చంద్రమౌళి, పైథార్ ఓదెలు, కొండ కుమార్ ,మణి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version