కాంగ్రెస్ – బిఆర్ఎస్ దొందు దొందే
బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టిరామకృష్ణ మాట్లా డుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుక, భూ భకసురులేనని నియోజక వర్గంలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ అక్రమం గా ఇసుక రవాణా చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకున్నారు. మండ లంలో కాంగ్రెస్ బిఆర్ ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు భూమి కబ్జాఆరోపణ చేసుకుం టున్నా రని ఈ రెండు పార్టీల చరిత్ర అవినీతి దోపిడేనని ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని అక్రమం దోపిడీ వాళ్ల లక్ష్య మని,మండలంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ పబ్బంగడుపుతున్నారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మండలంలో ఉన్న యూరియా సమస్య, ఆరు గ్యారెంటీలో భాగంగా మహాల క్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వక పోవడం విడ్డూ రం.వీళ్ళ ప్రవర్తన ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకులమొగిలి జిల్లా ఉపాధ్యక్షురాలు కోడెపాక స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి జిల్లా నాయకులు ఉప్పురాజు, కొత్తపెళ్లి శ్రీకాంత్, మంద సురే ష్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్ మండల కోశాధికారి కుక్కల మహేష్ పాల్గొన్నారు.