మున్సిపల్‌లో బీజేపీ జెండా ఎగరాలి – డాక్టర్ రఘు

మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
మెట్ పల్లి జనవరి 10 నేటి దాత్రి

 

ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరేయాలని, ఇందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సుమారుగా 49 శాతానికి పైగా బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం శుభ పరిణామం అన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. వార్డుల్లో పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించుకోవడానికి సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా కృషి చేస్తే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేట విజయ్, కుడుకల రఘు, అన్ని వార్డుల బీజేపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే…

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే
ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే

ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి
జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version