గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు….

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు!

ఎవరి వ్యూహాలు వారివే!

శాయంపేట నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడినెలకొంది ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమ వుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు పార్టీ లకు అతీతంగా జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను గెలుచు కుని జెడ్పి,ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

చేసింది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారెంటీలతో రూపొం దించిన పథకంలో భాగంగా రైతు భరోసా,సన్నబియ్యం, బోనస్,మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి,చేయూత ప్రభు త్వం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది ఎమ్మెల్యే పార్టీ నేతలకు మార్గదర్శకాలు చేయనున్నారు.

సాధ్యమైనన్ని గెలవాలి భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తుంది పార్టీ పెద్ద నేతలు దిశానిర్దేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని చూస్తున్నారు.

వైఫల్యాలను ఎండగట్టా లని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు

టిఆర్ఎస్ నేతలు అభ్యర్థుల గెలుపునకు ప్రణాళికలు రచిస్తున్నారు మండల గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయతమవుతున్నారు మండల గ్రామ స్థాయిలో సమస్యలపై ప్రభావం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

సైబర్ నేరాల గురించి అవగాహన…

సైబర్ నేరాల గురించి అవగాహన
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగులపల్లి మండలంలోని వేములపల్లి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి మండల రైతులకు మొగుళ్ళపల్లి ఎస్ ఐ బి అశోక్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ గురించి మరియు ఏ విధంగా సైబర్ నేరస్తులు ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొని అమాయకులకు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా ఇలా సైబర్ నేరస్తులు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మకండి వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి మరియు ముఖ్యంగా మీ యొక్క బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సంబంధించిన ఓటీపీలు ముఖ్యంగా రైతుబంధు రైతు బీమా రైతు భరోసా వంటి పథకాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటూ వచ్చే అపరిచిత కాల్స్ ను నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చారు

ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు సాధించిన వీరేశం..

తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు విజేత..

ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇరుకుల్ల వీరేశం

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి వివిధ్ ఫోటోగ్రఫీ పోటీలకు పంపించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు.
2022 లో ఎన్ ప్రింట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ప్రింట్ అండ్ డిజిటల్) వారు అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించగా ఇందులో 27 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం తరపున ఈ పోటీలో ఆన్ లైన్ లో పాల్గొన్న ఇరుకుల్ల వీరేశం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో ప్రింట్ కలర్ విభాగంలో 8 అవార్డులను సాధించారు. 2016 సంవత్సరం నుండి ప్రతి ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక అవార్డును సాధించారు.
ఫోటోగ్రఫీని ప్రాణంగా భావించే వీరేశం, గిరిజనుల అందాలను చిత్రీకరించడానికి అరకులోయ, ఒడిస్సా, వినాయక నిమజ్జనం దృశ్యాల కోసం మహారాష్ట్ర, హిమాలయాల సౌందర్యం ఒడిసి పట్టడానికి జమ్మూ కాశ్మీర్ లాంటి వైవిద్య భరితమైన ఎన్నో ప్రాంతాలను సొంత డబ్బులు వెచ్చించి అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి పర్యటించారు. అక్కడి అందాలను తన కెమెరాల్లో బంధించి ఎన్నో విలువైన ఛాయాచిత్రాలను ఆవిష్కరించారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశం కు కేటగిరి రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి మరియు కేటగిరి రైతు భరోసా లో కన్సోలేషన్ బహుమతి లభింఛాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాల పైన తీసిన ఛాయా చిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో రాజీవ్ యువ వికాసం ఫోటోకు తృథియ బహుమతి & రైతు భరోసా ఫోటోలు ఎంపిక చేశారు.
ఈ బహుమతిని మంగళవారం హైదరాబాదులోని గ్రీన్లాండ్స్ గ్రీన్ పార్క్ హోటల్ లో సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సిహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు.
గ్రామీణ నేపథ్యం కలిగిన వీరేశం.. సునిశిత దృష్టితో ప్రకృతి అందాలు, గిరిజన జీవితాలు, సంస్కృతి సంప్రదాయాలు పరిశీలించి తన కెమెరాలతో బంధించి చూపర్లను సమ్మోహిత పరుస్తున్నాడు.అతని ప్రతిభకు లభిస్తున్న పురస్కారాల పట్ల ఫోటోగ్రఫీ అభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ

1,10,322 మంది జిల్లా రైతులకు లబ్ది

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని అన్నదాతలకు రైతు భరోసా కింద మూడు రోజుల్లో రూ. 99.5 కోట్లకు పైగా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ వర్ష కాలం సీజన్ సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రోజు వరకు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 1,10,322 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906= 00 డబ్బులు జమ అయ్యాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version