రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మొహమ్మద్ యూనుస్…

రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మొహమ్మద్ యూనుస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, ఎంపీ ఎమ్మెల్యేలకు లేని పిల్లల నిబంధన కేవలం లోకల్ బాడీలో అమలు చేయడం వల్ల ఎంతోమంది నాయకులు పోటీకి దూరం అయ్యరని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారికి కూడా పోటీ చేసే అవకాశం దక్కిందని, దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన న్యాల్కల్ మండల అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్.

జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మహాదేవపూర్ పోలీస్

జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మహాదేవపూర్ పోలీస్
* పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ పవన్ కుమార్
మహాదేవపూర్ అక్టోబర్ 24 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ ను మహాదేవపూర్ పోలీసులు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భం గా ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో రెండో ఎస్సై సాయి శశాంక్ తో కలిసి జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించి దానిలో భాగంగా పోలీస్ స్టేషన్లో పిటిషన్ మేనేజ్మెంట్, ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్, డయల్ హండ్రెడ్, రికార్డ్ మేనేజ్మెంట్, సైబర్ క్రైమ్ తో పాటు పలు అంశాలపై సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాపకేతర బృంద, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్…

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం ఎస్ఐ రేఖ అశోక్ విద్యార్థులతో పోలీస్ స్టేషన్ నందు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించడం అయినది ఇందులో ప్రధానంగా పిటిషన్ మేనేజ్మెంట్ గురించి ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్ గురించి డైల్ 100 గురించి, డ్రగ్స్ నిర్మూలన గురించి సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అయినది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నందు ఉన్న సెట్ ఏ విధంగా పనిచేస్తుందో అనేది వారికి ప్రాక్టికల్ గా చూపించడమైనది

బంగారు పతకాలతో మెరిసిన మొగుళ్లపల్లి విద్యార్థులు.

బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు  విజయ పాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ  ఎయిర్ ఫోర్స్   వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది  ఎన్.సి .సి క్యాడేట్స్  పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో  వాలీబాల్,  టాగ్ ఆఫ్ వార్, ఆటలలో  గోల్డ్  మెడల్ సాధించగా,  మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి  జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు  మీ ఊరికి  రాష్ట్రానికి , దేశానికి  మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు  ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున  మంచి చదువుతోపాటు  ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను  అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శ్రీమతి భాగ్యశ్రీ,   ,  శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి,  జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు,  శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి  వై. శ్రీకళ  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version