రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థిని
మహాదేవపూర్ జులై 5( నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇటీవల భూపాలపల్లిలో అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో జరగబోయే సబ్ జూనియర్ అండర్ 14 ట్రై అత్లాన్ విభాగంలో పాల్గొంటుందని,ఆ పాఠశాలపిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO ప్రకాష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సరిత మాట్లాడుతూ విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయలు మడక మధు,సుధారాణి,సరితా దేవి,హోలీ పాషా, శ్రీనివాస్,వసుదప్రియ,వీరేశం,సమ్మయ్య,లీలారాణి,రజిత,సాహెదా బేగం,ప్రసూన, దీపిక,ఆంజనేయులు, అజ్మత్ పాషా లు విద్యార్థినిఅభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version