విద్యార్థులకు నాసా కిట్టు అందజేత
మందమర్రి నేటి ధాత్రి
శ్రీ చైతన్య మందమర్రి బ్రాంచ్ ఈ రోజు నాసా ప్రోగ్రాములో పాల్గొన్న విద్యార్థులకు నాసా కిట్టు అందజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మందమర్రి ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ గారు పాల్గొన్నారు నాసాలో పాల్గొన్న విద్యార్థుల “అందరికీ “నాసా కిట్టును అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు శ్రీ చైతన్య పాఠశాలలో విద్యతో పాటు విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినంధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏ.జి.యం అరవింద్ రెడ్డి గారు, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎం. రమేష్ గారు, అకాడమిక్ డీన్ కె.రవికుమార్ గారు, ప్రైమరి ఇంచార్జ్ ఎన్. సునితగారు, ప్రైమరీ ఇంచార్జ్ ఎ. తిరుమలగారు, నాసా ఇంచార్జ్ అదితి గార్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
