ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు..

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్ఎంసీ

నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్. యూనివర్సిటీగా మారాయి. ఫాదర్ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

లంచం కేసు ప్రభావమే..?

వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్ఎంసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీ నిబంధనల మేరకు కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకపోయినా.. తమ కళాశాలలకు అనుకూలంగా నివేదికలివ్వాలని మధ్యవర్తుల ద్వారా వాటి యాజమాన్యాలు ఎన్ఎంసీ అధికారులకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పాయి. దానిపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసింది.

అందులో తెలంగాణకు చెందిన పలు కళాశాలల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాల కూడా ఉంది. కళాశాల ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు విడుతల్లో 20లక్షల చొప్పున మొత్తం 46లక్షల రూపాయలు లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్ఎఆర్ లో పేర్కొంది. ఆ కేసు ప్రభావంతోనే కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ లో 36 మంది పేర్లుండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజనీరెడ్డి పేరును కూడా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి,పీడీఎస్యు, జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని,గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్,పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు రవి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్,నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి.

జూలై 23న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి-వామపక్ష విద్యార్థి సంఘాలు

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో బంద్ జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డిఈవో పోస్టులను భర్తీ చెయ్యాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలి. ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతానికి విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈసమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, ఎఐఎఫ్డిఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, పిడిఎస్యూ జిల్లా నాయకులు ముల్కాల మారుతి, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేశబోయిన రాము యాదవ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అసంపెల్లి వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష సంఘాల పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు. ప్రవీణ్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ ఈ నెల జులై 23వ తేదీనా రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు.విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్ ని
ప్రభుత్వ, ప్రెవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు తల్లిదండ్రులు బందులో పాల్గొని మద్దతు తెలియజేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పొంగంటి రాజేష్ వికాస్ అతుకూరి తిరుపతి ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.a

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=1

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

నాలుగున్నర దశాబ్దాలకు మోక్షం..

నాలుగున్నర దశాబ్దాలకు మోక్షం

◆:- మిర్జాపూర్ (బి) పీజీ కళాశాలలో కో-ఎడ్యుకేషన్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-48.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

నాలుగు దశాబ్దాలుగా మెన్స్ పీజీగా కొనసాగిన న్యాల్ కల్ మండలం మిర్జా పూర్(బి) ఓయూ (ఉస్మానియా అనుబంధ) పీజీ కళాశాల కో-ఎడ్యుకేషన్ గా మారనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి పీజీ కళాశాలగా పేరొందిన ఈ కళాశాలలో ఇకపై మహిళలకు ప్రవేశాలు దక్కను న్నాయి. ఏళ్లుగా చేస్తున్న ప్రతిపాదనలకు కార్యరూపమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కోర్సులు మంజూరైతే కళాశాల పూర్వ వైభవం సంతరించు కోనుంది.జహీరాబాద్ ప్రాంతంలో చక్కెర, అనుబంధ రసాయన కోర్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంగ్లా మీర్జాపూర్ గ్రామంలో 1980 అక్టోబరు 30న ఈ పీజీ కళాశాలను ప్రారంభించారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై గల మిర్జాపూర్(బి) గ్రామానికి స్వర్గీయ మాజీ మంత్రి, మాజీ ఎంపి మొగిలిగుండ్ల బాగారెడ్డి కృషి వల్ల ప్రభుత్వం పీజీ కళాశాలను ప్రత్యేకించి మంజూరు చేసింది. మిర్జాపూర్(బి)లో ఓయూ పీజీ కళాశాలఏర్పాటు చేసింది. అవసరమైన భూమి లభ్యత, కూత వేటు దూరంలో కొత్తూర్ (బి) చక్కెర కర్మాగారం, నీటికి నారింజ ప్రాజెక్టు అనువుగా ఉండటంతో మాజీ ఎంపీ బాగారెడ్డి పట్టుబట్టి పీజీ కళాశాల ఏర్పాటు చేయించారు.ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కొత్త కోర్సులకు ఏటా చేస్తున్న విజ్ఞప్తులకు ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ నుంచి సానుకూల స్పందన లభించింది. కో-ఎడ్యుకేషన్ కు ఆమోదం కూడా లభించగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆదరణ ఉన్న ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కోర్సుల ప్రతిపాదనలకు మోక్షం దక్కనుంది. పీజీ కళాశాల పూర్వ విద్యార్థి ప్రిన్సిపల్ శివశంకర్ దృష్టిసారించి కోర్సులుసాధించేలా కృషి చేస్తున్నారు. ఇవి సుంజూరైతే డే కమ్, రెసిడెన్షియల్ తరగతులు కొనసాగే అవకాశాలున్నాయి.

Co-education in Mirzapur (B) PG College.

ప్రతిపాదనలు పంపించాం:

శివశంకర్, ప్రిన్సిపల్ పీజీ కళాశాల మిర్జాపూర్(బి)
కళాశాలకు కో-ఎడ్యుకేషన్ మంజూరైంది. ఇక కొత్త కోర్సుల కోసం ఉస్మానియా విశ్వ విద్యాలయం సహా సంబంధిత ఉన్నతాదికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆగస్టు, సెప్టెంబరులో సీపీ గేట్ ప్రవేశ అర్హత పరీక్ష ఫలితాల తర్వాత కొత్త కోర్సులు దాదాపుగా మంజూరు కానున్నాయి.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆ బస్సుకు ఓనర్ లను చేసిన ఘనత కాంగ్రెస్ ది .

పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-37.wav?_=3

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో భూపాలపల్లి నియోజకవర్గ ఇందిర మహిళా శక్తి సంబరాలు సెర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షుతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్టిసి బస్సులు ఇస్తూ పెట్రోల్ బంకులు ఇస్తూ సోలార్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను చైతన్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మహిళలకు జీవిత బీమా కల్పిస్తూ మహిళా సంఘంలో ఉంటూ ఆ సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం అందిస్తున్నామని అలాగే 15 సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పిస్తున్నామని అన్నారు అలాగే ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తూ ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు యూనిఫామ్లను కుట్టిచ్చి ఇచ్చే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని దీని ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాది స్తున్నారని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకె కాక రైతులకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేసి వారికి పెట్టుబడి సహాయం అందిస్తూ దేశంలోనే రైతు సంక్షేమం కోరిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే సీతక్క సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది , భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న తెగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని అడగగా వెంటనే హాని ఇవ్వడం జరిగిందని అన్నారు, అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకే చెక్కులు, జీవిత బీమా చెక్కులు, టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాలకు ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య లకు మంత్రి సితక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి, సర్ప్ డైరెక్టర్ రజిని మరియు డి ఆర్ డి ఎ పి డి బాలకృష్ణ జిల్లా సెర్ప్ అధికారులు, ఎంపీడీవో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, మధు వంశీ కృష్ణ 6 మండలాల సెర్ప్ అధికారులు ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-26.wav?_=4

న్యాల్కల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు చూసి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-22.wav?_=5

న్యాల్ కల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో ఐదుగురికి విద్యార్థులు అస్వస్థతకు గురి . విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు . విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విద్యార్థులకి మళ్లీ అస్వస్థత గురి కావడం చర్చనీ అంశం . వర్షాకాలం పరిశుభ్రత లోపించిందా ఆహారం లోపమా తెలియాల్సిందే. జిల్లా అధికారులు పర్యవేక్షణ లోపించింది .

Nyalkal KGBV hostel.

వెంటనే తహసిల్దార్ ప్రభులు మండల గిర్ధవర్ శ్యామ్ రావు హాస్టల్ లో పరిస్థితులను పరిశీలించారు.

హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.!

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

అవోపా కల్వకుర్తి యూనిట్ అధ్యక్షుడు పాపిశెట్టి సతీష్ గుప్తా ఆధ్వర్యంలో యు.పి.ఎస్ పంజుగుల విద్యార్థులకు యు.పి.ఎస్ పంజుగుల హెచ్ఎం ఎల్లయ్య గౌడ్ అధ్యక్షతన 70 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ , ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవోప జనరల్ సెక్రెటరీ యాద శోభన్ బాబు , సీనియర్ అవోపా సభ్యులు గాదె కుమారస్వామి , గాదె ఉమాదేవి , పోల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయ బృందము తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి
-విద్యార్థులకు బ్యాగ్స్,పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ
-ఆధార్ స్వచ్ఛంద సంస్థ అభినందనీయం
-కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-15.wav?_=6

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు ఉజ్వల భవిష్యత్తు అందించాలని కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు అన్నారు.
గురువారం ‘గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు’తోలెం రమేష్ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని గొల్లగూడెం,కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్స్,నోటు పుస్తకాలు,ఆట వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై పివిఎన్ రావు మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో అనుభవిజ్ఞాన ఉపాధ్యాయులు అభ్యసించడం వలన విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటున్నారు.విద్యార్థులు మంచి మార్గంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని పేర్కొన్నారు.విద్యార్థుల కోసం ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసిన సేవ అభినందనీయమని ప్రసంసించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఎస్సై గారు సంస్థ నిర్వహకులు రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటర్లు విజయ్,సురేష్,ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరావు,రాధ,శ్రీను,సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,ఇర్ప కుశేలుడు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-6-1.wav?_=7

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో హై స్కూల్ రోడ్డు రామాటాకీస్ దగ్గర మురికి కాలువ నిండిపోయినదని ఈ విషయం 15 వవార్డు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తీసుకుపోవడంతో ఆయన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి స్పందించి కార్మికులను పంపి మురికి కాలువ ను పూడిక తీయించారని మాజి కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ఈ మేరకు వార్డు ప్రజల తరఫున మున్సిపల్ అధికారులకు ఒక కృతజ్ఞతలు తెలిపారు

నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం.

నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించరు.పాఠశాల విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు హాజరయ్యారు. చైతన్య రావు మాట్లాడుతూ విద్యార్థులకు చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ కవిత మాదిశెట్టి వనమహోత్సవం యొక్క ఉద్దేశాన్ని వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి పర్యావరణానికి సంబంధించిన వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ అనలిస్ట్ రాజేందర్,ఏవో సంజీవ్,వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆక్టివేట్ ఇంచార్జ్ జ్యోతి గోపతి ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో సౌకర్యాల కొరత.

పాఠశాలల్లో సౌకర్యాల కొరత

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి టిఎల్ రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆయన పాఠశాలల్లో సర్వే చేశారు. బుధవారం గుర్తించిన సమస్యలను స్థానిక ఆర్డీవో రామ్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.

కేంద్రంలో స్థానిక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

మండల కేంద్రంలో స్థానిక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

మిస్ చార్జీలు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ

మంగపేట:- నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సర్వేలు చేయడం జరిగింది విద్యారంగ సమస్యలపై ఈ సర్వేలో భాగంగా జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ఎం ఆర్ ఓ ఆఫీస్ వరకు ర్యాలీ మండల కమిటీ మండల ఉపాధ్యక్షులు చందు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ హాజరైన మాట్లాడుతూ జాయింట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వినతి పత్రం అందజేసి అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మండల వ్యాప్తంగా ప్రభుత్వ బడులలో పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ టీచర్, లేనటువంటి పరిస్థితి నెలకొంది అదేవిధంగా హాస్టల్లో మిస్ చార్జీలు విడుదల కాక విద్యార్థులకు పౌష్టికాహారం అందలేక బలహీన అవుతున్నారని పూర్తిస్థాయిలో తరగతి గదిలో ఫ్యాన్లు బెంచీలు కాంపౌండ్ వాల్ త్రాగునీరు సమస్య అదే విధంగా మెనూ ప్రకారంగా భోజనం హాస్టల్లో పెట్టడం లేదని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఇలా అయితే విద్యార్థులకు విష జ్వరాలు గజ్జి తామర లాంటివి అచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , రాష్ట్రవ్యాప్తంగా 9000 కోట్ల స్కాలర్షిప్ విడుదల కాక పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని పూర్తిస్థాయిలో విద్య చదవలేక పోతున్నారు అదే క్రమంలో స్కూలు విద్యార్థులు కళాశాల విద్యార్థులు వారి యొక్క గ్రామం నుంచి వచ్చే క్రమంలో ఇసుక లారీలు ఇబ్బందికరంగా రోడ్లపై ఉన్నాయని దీనిపై అధికారులు విచారణ జరపాలి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు కళాశాల విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోకిల బాలిశ్వర్, సహకారదర్శి మధులత, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, కిరణ్

వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు

మొక్కలు నాటిన మండల విద్యాధికారి.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

FLN ద్వారా విద్యార్థులకు బోధించాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలంలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా భోజనం చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతగా వండించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో
విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version