బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం…

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నెపల్లి లోని బాలాజీ టెక్నో స్కూల్ లో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు.ముఖ్య అతిథిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. భారతరత్న అవార్డు గ్రహీత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్. బిథాయ్ చంద్రరాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు దేశాలలో ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఆరోగ్య సమాజం లక్ష్యంగా ఎంచుకొని అంకిత భావంతో నిస్వార్ధంగా రోగులకు సేవ చేయడమే వైద్యుల గురుతర బాధ్యత. ఆ దిశగా విద్యార్థులు బాగా చదివి, వైద్య వృత్తిలో స్థిరపడి, బడుగు, పేద ,వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని గుర్తుచేశారు. విద్యార్థులు వైద్యుల వేషధారణతో వచ్చి భవిష్యత్తు లక్ష్యానికి అనుగుణంగా చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ప్రదర్శనలు చేశారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వైద్య రంగంలో రాణిస్తూ దేశానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్, ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి, రాజేష్, రాజు , ప్రీతి, అనిత,పూర్ణిమ,రాజ్ కుమార్, సునీత, ప్రద్యుమ్న విద్యార్థులు పాల్గొన్నవారు.

నర్సంపేట పట్టణంలో జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు..

బాలాజీ విద్యాసంస్థలలో ఒక్కటైన అక్షర ద స్కూల్, ద్వారకపేటలోని గల బాలాజీ
ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్స్ డే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ వేషధారణలతో అందరిని అలరించారు.ఈ కార్యాక్రమానికి బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, టెజరర్
డాక్టర్ వనజ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ,బాలాజీ
ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ ,అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version