సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను శుక్రవారం రోజు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ  సూచించారు.

సమావేశమైన జిల్లా SP మహేష్.బి.గితే IPS.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..!

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..

ఏ ఎస్ పి, శ్రీ శివ ఉపాధ్యాయ
ఐ పి యస్…

నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి )
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లో

గురువారం నాడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఏటూరు నాగారం ఏ ఎస్ పి శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్,వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని మరియు వాజేడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంకటాపురం మండల సిబ్బందికి. వాజేడు మండల సిబ్బందికి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించలని ఉపాధ్యాయులంతా క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం వాజేడు,సిఐ శ్రీ బండారి కుమార్, వాజేడు మండల ఎస్సైరాజ్ కుమార్,,వెంకటాపురం మండల ఎస్సై కే.తిరుపతిరావు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version