బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్…

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులలో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశాలలో రహస్య బాలెట్ ద్వారా తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే సుస్థిరపాలన అందుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి .రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చాగంటి క్రాంతి కుమార్ పోలింగ్ ఆఫీసర్ గా ఎం.డి రియాజుద్దీన్ పోలింగ్ సిబ్బంది గా ఉపాధ్యాయులు ఆర్లయ్య , అనిల్ , శంకర్ బాబు , సంగీత, సతీష్, కవిత పాల్గొన్నారు. ఎన్.సి.సి క్యాడేట్లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించారు.అనంతరం తెలంగాణ వన మహోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా బాలాజీ టెక్నో స్కూల్ లో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి మొక్కలు నాటారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపెల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ్ దివస్ ను ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాల స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ మే, 1999 న పాకిస్తాన్ చొరబాటుదారులు దొంగ చాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగాన్ని ఆక్రమించారని అలాగే శ్రీనగర్, లేహ్ ను కలిపే కీలకమైన జాతీయ రహదారి 1-ఏ ను విడదీయడం వారి దుష్ట లక్ష్యంగాచేసుకొని భారత సైన్యంపై దాడి జరిపారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే భారత సైన్యం కళ్ళలో జాతీయ జెండాను,గుండెల్లో దేశభక్తిని కలిగి శత్రుతూటాలకు ఎదురొడ్డి తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో గెలిచిన రోజు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేశ్, రామ్మూర్తి ,విజయ్, గౌతమ్, కనకయ్య , రామ్ కిషోర్, ఓదేలు, కనకరాజు, అనిత,వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చందు, పార్వతి, ఎన్.సి.సి క్యాడేట్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version