వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.

*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది

బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు

వికసిత్ భారత్ లక్ష్యం

 

 

Former BJP

 

 

ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

 

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి:

 

 

 

 

మండల చెందిన.కాంగ్రెస్ పార్టీ.సీనియర్ నాయకులు గత కొన్ని రోజులు బాధపడుతున్న నర్రా బాల్రెడ్డిని.ఆయనను తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పరామర్శించి మనోధైర్యం ఇచ్చి అన్ని రకాలగా ఆదుకుంటామని పెద్దలదృష్టికి తీసుకెళ్లి సహాయ అందిస్తామని.ఆయనకు హామీ ఇవ్వడంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింగం.గౌడ్ డైరెక్టర్ బాలు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆచారి బాల్రాజ్ మనోజ్ ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. పేద ప్రజల ప్రభుత్వం అని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ నైజం అని ఇందిరమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండడానికి అనేక పథకాలు తీసుకొచ్చామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామం జిల్లాల గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని. జిల్లాలలో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఇందిరమ్మ కాలనీ జిల్లాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిభూమి పూజలో పాల్గొనడం జరిగిందని. అలాగే రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని. రాష్ట్రాన్ని గత పాలకులు ఎంతో అప్పుల్లో కూర్చున కూడా దాన్ని అధిగమిస్తూ. రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని. అలాంటిది లేనిపోని అబండాలు వేసి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దయచేసి అభివృద్ధి పథంలో భాగ్యస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంత కష్టమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గo గౌడ్. డైరెక్టర్ బాలు. శ్రీనివాస్ రెడ్డి. గడ్డం మధుకర్. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఆసరి బాలరాజు. మనోజ్. ఉమేష్. తిరుపతి గౌడ్. నరసయ్య. సలీం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్, బొల్లారం రత్నం , మాజి సర్పంచ్ సంజీవ్,కళాకారుడు సునీల్,నాయకులు జూబీర్,అమీర్,జగన్ తదితరులు .

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగసుధ మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే వరద నీరుమొత్తం కాలనీలోకి చేరి ఇండ్లు బురద మయంగా మారుతున్నాయని ,దీంతో విష సర్పాలు ఇళ్లలోకి చేరి కాలనీ వాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లె అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు కాలనీవాసులు అందరు కూడా అర్హులేనని,వారందరికీ వెంటనే ఇల్లు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అనర్హులకు కాకుండా అర్హులకు వర్తించేలా చూడాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ యు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , స్థానిక నాయకులు గజవెల్లి జగపతి , గణిపాక బిందు ఎండి ఆరిఫ్ , జను జమున , చొప్పరి పద్మ గుజ్జుల శివ , క్రొర్ర మాలమ్మ బైరవైన నరసయ్య ,ఎస్.కె సద్దాం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి -బయ్యారం :-

 

 

 

 

అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి,ప్రజానాయకుడు, మనసున్న మారాజు,అవినీతి లేని నాయకుడు, గిరిజన ముద్దుబిడ్డ,మాజీ కేంద్రమంత్రి కోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బయ్యారం పట్టణ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మహిళ కమిటీ మండల అధ్యక్షురాలు తగిరా నిర్మల రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెప్పించి బయ్యారం ఏజెన్సీ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి మల్లయ్య, తగిరి సత్తి రెడ్డి, భూక్యా రవి నాయక్, చెరుకుపల్లి నాగమణి, దాసరి శ్రీధర్, చల్ల గోవర్ధన్, సరోజ, సుజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల.

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నాపూర్ గ్రామానికి చెందిన గుడిసె ఆకాశ్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-మంజూరైన LOC మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు ,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,నాయకులు అందజేశారు.
ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మొత్తం 24 మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ రామచంద్రయ్య తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన.

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజల కొరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఝరాసంగం మండలం లో గల కొల్లూరు,కక్కరవాడ,జోనవాడ,ప్యారవరం మరియూ లో గల వివిధ గ్రామాలలో ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల అధికారి MPDO సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ గారు,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, నందు పాటిల్, యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, లక్ష్మారెడ్డి,ఆలయ ఛైర్మన్ రాజేందర్, వీరన్న పాటిల్,నర్సింలు, విజయ్ కుమార్, ఎం విష్ణు, సి సుబాకర్, సి ప్రకాష్, సతీష్ గౌడ్,మాజీ సర్పంచ్ సిద్ధిరాములు, శ్రీశైలం,రమేష్, దేవదాస్, నర్సింలు మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మరియు వివిధ పార్టీల మండల నాయకులు,సంఘనాయకులు, వివిధ గ్రామల ప్రజలు పాల్గోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చెయ్యడం జరిగింది.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు

పెద్దమ్మతల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముది రాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి,దేవాలయంలో ప్రతిష్టిం చే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం లక్ష రూపాయ లు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్ర తిష్ట కార్యక్రమం నిర్వహించ నున్నారు. తన వయసుకు మించి గ్రామం కోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూ ర్వకంగా అభినందించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి:

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆర్డీవో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చి అవకాశం వినియోగించుకోవాలని సూచించారు రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 5/06/2025 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడిపాడు వేములపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుందని ఆ గ్రామాలలో ఉన్న రైతుల భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతులుఅవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దారు కోరారు కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

25 కేజీల బియ్యం వితరణ.

25 కేజీల బియ్యం వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి జంగేడు 14వ వార్డులో అట్కాపురం కోటి వల్ల అమ్మమ్మ చనిపోయి 6వ రోజున కాంగ్రెస్ జిల్లా నాయకులు దుర్గం అశోక్ &టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ కూనమళ్ళ రాజా కొండముచ్చుల నాగరాజు గారు, మరియు యాత్ నాయకులు ఆకుల సాయి చరణ్, దొంగల అనిల్,బొద్దుల వినయ్,కటకం చందు, దుర్గం అనిల్, దుర్గం సాగర్ పాల్గొన్నారు,

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి.

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి.

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

 

వ్యవసాయ సీజన్ ఒక నెల ముందు ప్రారంభం కావడంతో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు నాణ్యమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచే రైతులను ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు కారేపల్లి మండలం టేకులగూడెంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ మహాసభలో ముఖ్యఅతిగా పాల్గొని ప్రారంభిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు పొద్దున లేస్తే రైతు గురించి రైతు సంక్షేమం గురించే మాట్లాడుతున్నారని రైతు సంక్షేమం గురించి పాలకులు ఉన్న ఈ దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతును వేధించటం సరికాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా లాంటి తదితర పథకాలను 100% అమలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు లక్షలాదిమంది ఆదివాసి గిరిజనులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న వేల ఎకరాలకు ఈనాటి కోడి భూములకు పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉందని ఆయన అన్నారు అనంతరం అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవల వెంకటేశ్వరావు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు వీలుగా అన్ని మండలాలలో గిడ్డంగులు నిర్మించాలని చెప్పి వారు కోరారు మోడీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ విధానం మొత్తం ప్రైవేటు వారి చేతుల్లోకి వెళుతుందని దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముందు రైతు సంఘం జెండాను జిల్లా కార్యదర్శి ఆవులు వెంకటేశ్వర్లు ఎగరవేయగా అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ సభలో రైతు సంఘం నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు కేలోతు లక్ష్మణ్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ ఝాన్సీ ప్రసంగించగా ఈ మహాసభకు గుగులోత్ తేజ నాయక్ అధ్యక్షత వర్గంగా వ్యవహరించగా నాయకులు రాకేష్ గుమ్మడి సందీప్ బిక్కసాని భాస్కర్ సత్తిరెడ్డి లక్పతి వీరబాబు మదర్ సాహెబ్ సక్రు నాగయ్య పాపారావు సరోజిని అనసూర్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ఖమ్మం డివిజన్ నూతన కమిటీని 17 మందితో ఎన్నుకోగా డివిజన్ అధ్యక్షులుగా ధరావత్ లక్ష్మణ్ కార్యదర్శిగా తేజ నాయక్ ఉపాధ్యక్షులుగా సత్తిరెడ్డి భాస్కర్ పుప్పాల రామారావు వీరబాబు లతో కూడిన 17 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్యాలారం బసవరాజ్ ఝరాసంగం పట్టణంలోని నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బసవరాజ్ గారికి గృహప్రవేశం శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వాడితోపాటు కాంగ్రెస్ నాయకులు కుతుబుద్దీన్ సత్తార్ భాయ్ ఎజాస్ బాబా బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.

పేదింటికల సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి.

పేదింటికల సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. గ్రామంలో లబ్ధిదారులకు. ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గడ్డం మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనలో పేద ప్రజలకు ఇండ్లు లేని లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని సంకల్పంతో ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రజా పరిపాలనలో ప్రజలు అందరూ. మంచిగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా. ప్రజా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.పొన్నం ప్రభాకర్ రెడ్డికి. వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం రచన. కొంపల్లి శ్యాం. కొండ రాజు. పొన్నం కనకయ్య. అడి గొప్పల రాము. యమునా. ముంతాటి శారద. జ్యోతి. మౌనిక. సంపతి శ్యామల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్.

వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్లో షీలా రమేష్ గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొని అక్షంతలు వేసి నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుచ్చుబుద్దీన్ బిజీ సందీప్ రేవనప్ప శంకర్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.

బిజెపి మండల కమిటీ ఎన్నిక.

బిజెపి మండల కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీని మండల అధ్యక్షుడు నర హరిశెట్టి రామకృష్ణ ప్రకటిం చడం జరిగింది.ఈ కమిటీలో ప్రకటించిన వారు మండల ఉపాధ్యక్షులుగా పోల్ మహేందర్, రేణుకుంట్ల చిరంజీవి, కోమటి రాజశేఖర్, లావుడియా జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శులుగా మామిడి విజయ్, భూతం తిరుపతి, కార్యదర్శులుగా మేకల సుమన్, కొంగర భారతి, వంగరి శివశంకర్, జున్నుతుల జీవన్ రెడ్డి, కోశాధికారిగా కుక్కల మహేష్ బిజెపి మండల కమిటీని ఎన్ను కున్నారు ఎన్నుకున్న మాట్లాడుతూ కమిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని మండలంలో విస్తరింప చేస్తా రని రానున్న రోజుల్లో భారతీ య జనతా పార్టీ గెలుపు కొర కు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్య క్షులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

మెట్ పల్లి జూన్ 4 నేటి దాత్రి

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో పట్టణానికి చెందిన 33 వార్డుల ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం కేవలం ఎన్నికల్లో ఓట్లు దండు పోవడం కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఊసే లేకుండా పోయిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నెలల వ్యవధిలోనే 6 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది వేసిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు ఆఫీసర్ల కృషి అభినందనీయమన్నారు ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 500 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా పట్టణంలోని 33 వార్డుల ద్వారా 502 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రోస్డింగ్ పత్రాలు అందజేస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాని వారు ఉంటే వారికి కూడా త్వరలోనే అందేలా కృషి చేస్తామన్నారు కోరుట్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తుందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version