ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్ లుబీసీలకు కల్పించాలి
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి డిమాండ్
వనపర్తి నేటిదాత్రి .
బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వ ని కి చిత శుద్ది ఉంటే నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపిటిసి జెడ్పిటిసి లోగా పోటీ చేయుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఊరూరా సంబరాలు జరుపుకోవడం విడ్డూరమని వారు విమర్శించారు.
ఎంపీటీసీలు జెడ్పిటిసిలకు ఒక కార్యాలయం గానీ కూర్చోవడానికి కుర్చీ గాని ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదని వారు విమర్శించారు కనీసం ఎంపీటీసీలకు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు వాటి వివరాలు వారికి తెలియడం లేదని వారికి ప్రభుత్వం నుండి మర్యాదలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పిటిసిల ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రూపొందించిందని వారు ఘాటుగా విమర్శించారు . కాంగ్రెస్ పార్టీ వారి ప్లాన్లు ప్రజలు నమ్మేస్థితి లో లేరని వారు ఇచ్చిన హామీలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెండం కురుమూర్తి యాదవ్ బొల్లెద్దుల బాలరాజ్ పృధ్వి నాథ్ పెబ్బేరు కర్రే స్వామి వడ్డే ఈశ్వర్ కడుకుంట్ల శ్రీను జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము టి సురేష్ గుండె కృష్ణ మెంటపల్లి రామకృష్ణ భగవంతు యాదవ్ రహీం బండారు కృష్ణ సవాయిగూడెం రాము కృష్ణ తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు