అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనీటి మాణిక్ రావు
అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శశి,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మోహీ ఉద్దీన్,తులసి దాస్,గణేష్ తదితరులు వారి నివాసానికి చేరుకుని పరామర్శించడం  జరిగింది.

గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన.!

*గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ..

*సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి పరామర్శించిన..

*ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్..

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 11:

 

తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతికి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం నాడు సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్ అనంతరం సప్తగిరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపిన ఎమ్మెల్యేలు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు..

సిరిసిల్ల పట్టణ ప్రజా వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ (ప్రజా వైద్యశాల) ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన సుదీర్గ కాలంగా సిరిసిల్ల ప్రజానీకానికి (ప్రజా వైద్యశాల నెలకొలిపి) వైద్య సేవలు అందించారు.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మునిసిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో శనివారం మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త మరణం పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్ బాబు అన్నారు. కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రజియా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, గడ్డం సంపత్, నాయకులు జక్కన బోయిన కుమార్, గడ్డం రాజు, చంద్రమౌళి, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version