నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు

ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి.

◆ జాడలేని వానలు…

◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు…

◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు కష్టమవుతోంది మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సాగక రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు.

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి.

20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది.

దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతోఈసారి ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు.

ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు.

వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి.

కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక సంగారెడ్డి పట్టణంలోని కూలీల అడ్డమీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారజిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పత్తి పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగ పత్తి మినుములు, పెసర్లు, కందులు, పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయ బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు.

ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్క ఎండిపోయింది సారూ.

రెండెకరాల పొలం ఉంది అందులో రూ. 20వేల అప్పు చేసి పత్తి కందులు పంట వేశాను.

తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది.

దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా ఇక్కడ కూడా పనిదొరకడం లేదు ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు బొరేగౌ మొహమ్మద్ నవాబ్

రెండెకరాల పత్తి పోయినట్టే

నాకు రెండెకరాల పొలం ఉంది అందులో రెండు బోర్లున్నాయి వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి పత్తి పంట సాగుచేశాను.

వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి పంట ఎండిపోతోంది అడ్డమీద పనికొచ్చినా పనిచెప్పేవారే లేరురైతు మాచునూర్ ఖలీల్.

పనులు చూపించాలి

మళ్లీ కరువు మొదలైంది పంటలుఎండిపోయాయి ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి.

బుక్కెడు కూడు కోసం అడ్డమీద పడిగాపులే వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి.  మేదపల్లి పరమేశ్వర్ పటేల్

పోషణ భారమైంది.

నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పత్తి పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి.

బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు.

కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు ప్రభుత్వమే పనులు చూపించి తుమ్మనపల్లి మొహమ్మద్ రోషన్.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హుగ్గేలి చౌరస్తా వద్దా NIMZ రోడ్డు విస్తరణ లో మిషన్ భగీరథ పైపు లైన్ రోడ్డు కిందకి పోతున్నందున కొత్త పైప్‌లైన్ వేయడం జరుగుతుంది.ఇందుచేత 2 రోజుల పాటు జహీరాబాద్ మున్సిపాలిటీ, జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్ మండలంలో మరియు ఝరాసంగం లో 10 గ్రామాలు మిషన్ భగీరథ నీరు నిపివేయడం జరుగుతుంది.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు టి ఎస్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్ కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ,ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ పి ఆర్ టి యు ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్ రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్ రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు  పాల్గొన్నారు

ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ అన్నారు.గురువారం చండూరు మండల కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరసనగా సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ ఆదానీ , అంబానీలకు మేలు చేసే విధంగా ఉందని, ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ శక్తులు దేశ ప్రయోజనాలను, బడ్జెట్ ను తమకు అనుకూలంగా నిర్ణయించే స్థాయికి మోడీ ప్రభుత్వం దిగజారిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్లోవిద్య, వైద్యంపై బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, అత్యధికంగాపేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో మట్టి కొట్టిందనివారు ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకుకేటాయించలేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన 63 వేల కోట్లు మాత్రమే ఉన్నదని, ఇంకా అదనంగా పెంచలేదని సంవత్సరానికి 200 పనిదినాలు పెంచుతూ రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపైన కనీస మద్దతు ధర పైన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందన్నారు.ఒక దేశ ప్రధానిఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్ర అని అర్థమైతుందన్నారు. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగు ఐదు గంటల సమయం పడుతుందని అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలి తెలుగు ప్రజలు కొట్లాడుతున్న ఆ ఉసే బడ్జెట్లో ఎత్తలేదని, మరి బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలనిఆయన అన్నారు.కేంద్ర మంత్రినిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకారిల్లె బడ్జెట్ లా ఉందని, విద్య వైద్యాన్ని విస్మరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం నాయకులుఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బల్లెం స్వామి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులుకత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బి పంగి నాగరాజు, రమేష్, అలివేలు, చంద్రమ్మ,కలమ్మ, ముత్తమ్మ,పెద్ద వెంకన్న,దానయ్య,కృష్ణయ్య,జంగమ్మ, బక్కమ్మ, లక్ష్మమ్మ, రేణుక,రజిత,ఎల్లమ్మ,యాదయ్య, రామచంద్రం, నరసింహ, రాము,హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నగేష్, నరేష్, సుమన్, శేఖర్, నరసింహ, జానీ, బిక్షం, చిరంజీవి, సత్యనారాయణ, సత్తయ్య, శ్రీను, అంజి, రమేష్, కుమార్, సురేష్ దితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version