చిట్యాలలో బిజెపి నాయకుల పరామర్శ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-62-1.wav?_=1

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో ఇటీవల కాలంలో మరణించిన బుర్ర రాజయ్య గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రవి కిరణ్ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య రేగొండ మండలం ఉపాధ్యక్షులు శివ కృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-60.wav?_=2

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ముర్తుజ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.

BRS Leaders

జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ ,నాయకులు చిన్న రెడ్డి,దీపక్ ,అలి,సలీం, అర్షద్,ఆసిఫ్ తదితరులు .

మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-59-1.wav?_=3

మండిబజార్లో ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని 25వ డివిజన్ మండిబజార్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, పండ్ల పంపిణీ చేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖకు భద్రకాళి అమ్మవారి దీవెనలతో నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొందిన నాయకురాలు, మా తూర్పు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో మేమంతా కలిసి సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ తోట వేణు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజు సాంబయ్య, కొల్లూరి మల్లేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ వసీం, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

“ప్రజావాణికి 92 ఫిర్యాదులు.

“ప్రజావాణికి 92 ఫిర్యాదులు.*

33 దరఖాస్తులు భూ సమస్యలపైనే..

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 33 దరఖాస్తులు భూ సమస్యలపైనే రావడం విశేషం. ఈ నేపద్యంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. 92 దరఖాస్తులలో రాగా అత్యధికంగా భూ సమస్యల పట్ల 33 వినతులు రాగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జిడబ్ల్యూఎంసీ)
18 దరఖాస్తులు,గృహ నిర్మాణ శాఖకు 9, వైద్య ఆరోగ్య,విద్య శాఖకు 4 చొప్పున వినతులు,ఇతర శాఖలకు సంబంధించినవి 24 ఫిర్యాదులు కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు ప్రజావాణిలో
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

అర్జీలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ వాతావరణ శాఖ జిల్లాకు ఆరేంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రోడ్లు,రవాణా,వైద్య ఆరోగ్య శాఖల జిల్లా అధికారులు శాఖల వారిగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకొని పరిస్థితుల కనుగుణంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి,డిఎఓ అనురాధ,డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,డిడబ్ల్యూఓ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఉమారాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.

వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ

జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు

 

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.

మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.

సామాజిక స్పృహకు అద్దం
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు.
తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

తొర్రూరులో ఝాన్సి రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31-6.wav?_=4

తొర్రూరులో ఘనంగా జరిగిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు – హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని తొర్రూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

పార్టీ కార్యాలయం శుభాకాంక్షల బ్యానర్లు, పూలదండలతో కళకళలాడింది. పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై, పూలమాలలు వేసి, ఝాన్సి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు ప్రజల కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె చూపుతున్న పట్టుదల అందరికీ ఆదర్శం. ఇలాంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు..

అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నన్ను మరింత కర్తవ్యబద్ధురాలిని చేస్తున్నాయి. ఈ ఆశీస్సులు, శ్రద్ధే నాకు బలమై, ప్రజాసేవలో మరింత కృషి చేయడానికి ప్రేరణనిస్తాయి” అని తెలిపారు..

కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని, అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమ రాజశేఖర్ బ్లాక్ అధ్యక్షులు ఆమ్య నాయక్ , మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు..

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి…..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-5.wav?_=5

ప్రజావాణి ఫిర్యాదుల పై పెండింగ్ లేకుండా చూసుకోవాలి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లాలో ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచ కు oడ పరిష్కరించాలని
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను కోరారు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ధర అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు ప్రతి సోమవారం ప్రజావాణికి మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయి ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు
ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-5.wav?_=6

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల,నడికూడ,దామెర,ఆత్మకూరు మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని,గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని, మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నారు.స్థానిక సంస్థలు ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందిఅని,సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు.విలేజ్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి ప్రజా సమస్యలకు ప్రియార్టీ ఇస్తామని,వచ్చే ఆదివారం సమావేశాల్లో ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని 60 ఓట్లకు ఒక బాధ్యున్ని నియమించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలోని సమస్యలను చర్చించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు.గ్రామాల వారిగా జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపట్ల ప్రజలలో నమ్మకం కలిగిందని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

జాండీస్ వ్యాధిపై అధికారుల పర్యవేక్షణ.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-5.wav?_=7

జాండీస్ వ్యాధిపై అధికారుల పర్యవేక్షణ

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాధి వ్యాప్తి చెందడం పై అధికారులు గ్రామం లో పర్యటించారు వరంగల్ రిజీనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీ అధికారి కృష్ణారావు గ్రామంలో మంచి నీటి నమూనాలను తీసుకొన్నారు ల్యాబ్ లో పరిశోధన జరుపుతామని అన్నారు అదేవిదంగా జిల్లా వైద్యాధికారి వెంకట రమణ పర్యటించి బాధితుల వివరాలు సేకరించారు. వారం పాటు గ్రామం లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అరా తీశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గుర్తూరు గ్రామంలో అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుక….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-7.wav?_=8

గుర్తూరు గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక సోమవారం రోజు గుర్తూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు

గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల రంగయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మోత్కూరి రవీంద్ర చారి, వీసంపల్లి బాలకృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చాతకొండ శిరీష, తొర్రూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసర్ల రవికుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-8.wav?_=9

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం శకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహారెడ్డి పాల్గొన్నారు.అట్టి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి లోబడి నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. బలహీన వర్గాలకు ఏ స్కీమ్ వచ్చిన దానికి బేస్ రేషన్ కార్డు అవసరం ఉంటుందని ఇందిరమ్మ ఇండ్లు గాని గృహానికి ఉచిత కరెంటు గాని రాజీవ్ యువ శక్తి గాని సబ్సిడీ గ్యాస్ గాని ప్రతి ఒక్క దానికి అర్హులు తెల్ల రేషన్ కార్డు దారులే అని అన్నారు. గత ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీదలకు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందిస్తుందన్నారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చిన దొడ్డు బియ్యం తినేవారు కాదని అమ్ముకునేవారని అలా రీసైకిల్ అయి అదే బియ్యం మళ్లీమళ్లీ వచ్చి పోయేదని కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారుడు దాన్ని తింటున్నారని అన్నారు.
ప్రజలకు అవసరమయ్యే బియ్యాన్ని పండించేందుకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నందున రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం 200 యూనిట్ల వరకు పేదలకు కరెంట్ రైతులకు రుణమాఫీ అదేవిధంగా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటును ఇచ్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు బీదవాళ్ల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తుందన్నారు.ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్టి కాలంలో పూర్తి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ సి డి సి డైరెక్టర్ జి మల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ఇమాం పటేల్ మాజీ ఎంపిటిసి ఎస్ నరసింహులు మాజీ సర్పంచ్ ప్రతినిధి చెన్నారెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ నాయకులు చేస్మోదిన్
ఆరిఫుద్దీన్ షేక్ అలీ కుర్షిడ్ బయ్ నారాయణ గౌడ్ సైఫుద్దీన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-9.wav?_=10

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

హైదరాబాద్‌ ఉప్పల్‌ రామంతపూర్‌ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-5.wav?_=11

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్

ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిన్న పంచాయతీల పరిస్థితి దారుణం..

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా

◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా

◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు

◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు

◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు

◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం

స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.

రూ. 3,600 .. కోట్లు పెండింగ్

రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.

రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు
తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55.wav?_=12

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T113539.188.wav?_=13

 

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వేషన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి జెడ్పీటీసీ పండరినాథ్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ప్రభు పటేల్ డాక్టర్ నాగరాజ్ నర్సింలు
తదితరులు.

రాహుల్ గాంధీ ‘వోటర్ అధికారం యాత్ర’ ప్రారంభం.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సాసారాం నుండి ప్రారంభించిన ‘వోటర్ అధికారం యాత్ర’ లో భాగంగా 16 రోజులు, 1,300 కిలోమీటర్ల పయనం చేపట్టారు. రాహుల్ గాంధీ అన్నారు, “బిహార్‌లో ఎన్నికను ఎవరు చోరీ చేయనీయకుండా జాగ్రత్త పడతాం.” ఈ యాత్రలో RJD నేత తేజస్వి యాదవ్ మరియు INDIA బ్లాక్ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. యాత్రలో 20 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేసి సెప్టెంబర్ 1న పట్నాలో పెద్ద ర్యాలీతో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ప్రకారం, ఈ యాత్ర ప్రతి వ్యక్తికి ఒక్క ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామిక హక్కును రక్షించడానికి నిర్వహించబడుతోంది.

బీహార్‌లో రాహుల్ గాంధీ ‘వోటర్ అధికార్ యాత్ర’ ప్రారంభం..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లోని ససారం నుండి తన 16 రోజుల ‘వోటర్ అధికార్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం 1,300 కిలోమీటర్లు, 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇది ప్రతీ వ్యక్తి ఓటు హక్కును కాపాడే, భారత రాజ్యాంగాన్ని రక్షించే సమరం అని పేర్కొన్నారు.
రాజసత జనం దళం (RJD) నేత తేజశ్వి యాదవ్ మరియు ఇతర INDIA బ్లాక్ పార్టీలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర సెప్టెంబర్ 1న పట్నాలోని మెగా ర్యాలీతో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకారం, రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా భారతీయ ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని సమాచారం కోసం మన నేటిధాత్రి ఛానెల్‌ను ఫాలో చేయండి.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31-5.wav?_=14

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం….
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత దుగ్యాల శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తొరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని స్థానిక దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్తూరి మల్లేశం, మిట్ట కోల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలకోట్ల రూపాయలు తెచ్చి తొరూర్ మరియు పాత చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తొర్రూర్ మండలంలో కోర్టు మరియు డిగ్రీ కాలేజ్ సెంట్రల్ లైటింగ్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రైతుల కోసం సబ్ స్టేషన్ల నిర్మాణానికి కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమాండ్ల.నరేందర్ రెడ్డి , మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, దేవరకొండ శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు…

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-3.wav?_=15

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

*ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

తిరుప‌తి(నేటిధాత్రి(ఆగస్టు 16:

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ‌ స‌మేత అష్ట‌స‌తులను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం దర్శించుకున్నారు.ఆల‌య ప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గోకులాష్ట‌మి సంద‌ర్భంగా శ్రీకృష్ణ ప‌ర‌మాత్మున్ని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య ప్ర‌తినిధుల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు.తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రిపై శ్రీకృష్ణుని కృపాక‌టాక్షాలు మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర‌ణి జ‌గ‌న్, రాజా రెడ్డి, జీవ‌కోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మున‌స్వామి, పురుషోత్తం, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-7.wav?_=16

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పై
ది కొండా రమేష్ కు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐకి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును
అందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version