ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=1

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T153143.129-1.wav?_=2

 

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం”

“ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ”

మంత్రి వాకటి శ్రీహరి.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం పశుసంవర్థక క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
“ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశాం. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్రం భద్రతా పరంగా పెద్ద తోడ్పాటు అందిస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…

 

“జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. మా నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T152314.808.wav?_=3

 

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ఇకనైన కవిత పునరాలోచించుకోవాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి

 

మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.
కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.నాడు ఉద్యమంలో,పాలనలో,నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదని అన్నారు.ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు.ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు.పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T151324.521.wav?_=4

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జాహిరాబాద్ పట్టణం పస్తాపూర్ గ్రామం కొత్త గురునాథ్ రెడ్డి గారిని ఈ రోజు వారీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం,ఈ కార్యక్రమంలో సి.యం విష్ణువర్ధన్ రెడ్డి,శికారి గోపాల్, యం.జైపాల్, తదితరులు ఉన్నారు

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T150357.474-2.wav?_=5

జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంపికైన గోలి రాధాకృష్ణ

సిరిసిల్ల టౌన్: ( నేదిధాత్రి)

 

సిరిసిల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా 2025- 26 సంవత్సరానికి గాను హిందీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మరియు ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయులు గోలి రాధాకృష్ణను అభినందించడం జరిగినది. గోలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంత మంచి అవార్డు ఎంపికైనందున ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాని మరియు ప్రభుత్వానికి గాని మరియు సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయులు,నాయకులు,అభినందించారు.

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T145638.080.wav?_=6

 

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143950.186.wav?_=7

 

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు

◆:- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సుధ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143411.649.wav?_=8

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి

నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

గుండాల(భద్రాద్రికొత్త

గూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుకొళ్ళూరి రామయ్య అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి మృత దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన గుండాల మండల పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా ఖదీర్ మాట్లాడుతు రామయ్య ని అందరూ తమ ఇంటి పేరుతో కాకుండా పట్వారి రామయ్య అని సంభోదించే వారు ఈ ప్రాంతానికి వారు ఎంత సేవ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పార్టీకి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య , మండల ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య , సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,ఎస్కె అబ్దుల్ నభి, పాయం గణేష్ , నునావత్ రవి,యువజన నాయకులు ఈసం భద్రయ్య,పల్లపు రాజేష్,బొంగు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించిన అబ్ధుల్ అజీజ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T142711.214-1.wav?_=9

 

మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించిన అబ్ధుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపుర్ పట్టణం లోని శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్న నవీన్ నిన్న సాయంత్రం వ్యక్తి గత కారణలవలన వారు నివసిస్తున్న ఇంటిలో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకోవడం జరిగింది. నవీన్ గత రెండు నెలల నుంచి తవక్కల్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… నవీన్ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని, తమ తవక్కల్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న నవీన్ కుమారుడు ప్రియాంష్ కు తమ పాఠశాలలో 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తానని, అవసరమైతే భవిష్యత్తులో ఉన్నత విద్యకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని నవీన్ కుటుంబానికి భరోసా కల్పించారు.

17వ బెటాలియన్ విద్యార్థులకు షూ, టై, బెల్ట్ పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141913.546-1.wav?_=10

 

17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141033.408.wav?_=11

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు

నేటిధాత్రి ఐనవోలు :-

ఎస్ఆర్ఎఫ్ (శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్) గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఏకశీల ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ యం.డి.బాబా ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ఎస్ఆర్ఎఫ్ గురుబ్రహ్మ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డా|| జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ప్రిన్సిపల్ యండి. బాబా గురుబ్రహ్మ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి బాబాను అభినందించారు.

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల సమీక్ష…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T140136.019.wav?_=12

 

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్..

గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూలైన్లు, విమాన గోపురం, అర్థమండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ..

ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానన్న ఎమ్మెల్యే..

కొడవటంచ ఆలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం..

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రేగొండ మండలంలోని
కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు, గుత్తేదార్లకు సూచించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయశాఖ, పీఆర్, ఆర్ అండ్ బీ, టూరిజం, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈలు, డీఈలు, ఏఈలు మరియు రేగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంనకు ముందు ఎమ్మెల్యే బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూలైన్లు, విమాన గోపురం, అర్థమండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ జరిపారు. అదేవిధంగా, మరో మూడు నాలుగు నెలల్లోపు అన్ని పనులు పూర్తయితే ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు వంద ఏళ్ల కిందట స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని, ఆలయాన్ని పట్టించుకునే నాథులు లేక ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.12.15 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ప్రధానంగా విమాన గోపురం అర్ధ మండపం, మహా మండపం పునర్నిర్మాణానికి రూ.3.77 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అద్దాల మండపం కోసం రూ.5 లక్షలు, అల్వార్ నిలయానికి రూ.1.10 లక్షలు, పాకశాల భవనానికి రూ.7.5 లక్షలు, క్యూలైన్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, అన్నదాన సంత్రానికి రూ.40 లక్షలు, ఆలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.15 లక్షలు, భక్తుల బస కోసం రూ.5.5 లక్షలు, రూ.50 లక్షలతో చుట్టూ కాంపౌండ్, తాగునీటి ట్యాంక్ కోసం రూ.30 లక్షలు, ఈవో, ఇతర అధికారుల ఆఫీస్ కోసం రూ.50 లక్షలు, అర్చకుల వసతి గృహాలకు రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గణపురం మండలం బుద్దారం గ్రామం నుండి కొడవటంచ గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. రేగొండ పోలీస్ స్టేషన్ వద్ద అసంపూర్తిగా ఉన్న ఆర్చి పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఆర్చిని ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంపత్ రావు నరసయ్య బిక్షపతి రాజు తదితరులు పాల్గొన్నారు

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T135338.011.wav?_=13

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

 

ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T134321.387.wav?_=14

వనపర్తి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా లో రైతులకు యూరీయా కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అన్నారు రైతులు రెండవ సారి వేయాలిసిన పంటలకు యూరియాను రైతులు ముందుగా కొనుగోలుక చేయడం సరి కాద ని కలెక్టర్ అన్నారు గురువారం వనపర్తి మండలం పెద్ద గూడెం లో వ్యవసాయ సహకార సంఘం గోదాములో కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం యూరియా నిల్వలను పరిశీలించారు పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడరైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారుజిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, పి. ఎ సి.ఎస్ సిబ్బంది, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు గత సంవత్సరం కంటే సంవత్సరం యూరియా నిల్వలు అధికంగా ఉన్నాయని రైతులు ఆందోళనచెందవద్దని కలెక్టర్ కోరారు

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T125952.524.wav?_=15

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి
చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు

రోడ్డు టాక్సులపై యువకుడి నిరసన..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1.wav?_=16

ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!
బైక్పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు.
కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=17

 

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=18

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

◆:- ఆశ్చర్యపోతున్న ఓటర్లు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

Local Election Buzz

కూడగట్టుకుంటున్న మద్దతు

సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో
కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు

నేతల చుట్టూ చెక్కర్లు.

సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.

Local Election Buzz

ఓటరు జాబితా ప్రచురణ

ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T124355.369.wav?_=19

 

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

రామాయంపేట, సెప్టెంబర్ 4 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు విశేష సన్మానం లభించింది. గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్‌ను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్, సభ్యులు వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ – “పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల కృషి అత్యంత కీలకం. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ప్రోత్సాహం కలిగిస్తాయని తెలిపారు.
కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “మేము ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తాం.
ఇలాంటి గుర్తింపు మా కష్టానికి నిజమైన గౌరవం” అన్నారు.

పోచమ్మ శంకర్ మాట్లాడుతూ “ఇంతవరకు ఎవరు మాపై ఇంత శ్రద్ధ చూపలేదు. లైన్స్ క్లబ్ చేసిన సత్కారం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది”.

లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి మాట్లాడుతూ – “సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ – “ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి. లక్ష్మణ్ యాదవ్. వంగరి కైలాస్. దోమకొండ శ్రీనివాస్. శ్రీధర్ రెడ్డి. చల్ మెడ ప్రసాద్ పోచమ్మ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల అసమర్థత గురించి ఘాటుగా విమర్శించిన…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T122807.244.wav?_=20

కాంగ్రెస్ నాయకుల అసమర్థత గురించి ఘాటుగా విమర్శించిన

◆: – బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు ఎంత అసమర్థులో మనందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు, 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులు గాని చాలా ఆకలి మీద ఉన్నారు, ఇప్పుడు అధికారంలో వచ్చాము కదా అని అహంకారపూరిత ధోరణితో ప్రవర్తిస్తూ ఆసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న నా స్టేట్మెంట్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉండే అనుచరులు బిర్యాని ప్యాకెట్ల కోసమో బీరు కోసమో వాళ్ళ నాయకుల మీద ఉన్న ప్రేమని ఇతర మహిళల పైన నీచంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయాలని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్లు 70 MM సినిమా చూస్తూ ఉంటారు తప్పితే వాళ్లు వాళ్ళ అనుచరులకి ఒక మాట కూడా ఏమనరు. పైగా వాళ్లకి చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కాపాడుతూ వస్తున్నారు మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అసమర్థత కాంగ్రెస్ నాయకులు. విషయం ఏమిటంటే ఈరోజు 9వ రోజు నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాళ్ళు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులని పిలిచి వారిని సన్మానించడం జరుగుతుంది. కానీ సార్వజనిక్ కమిటీలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ నాయకులు వారి అనుచరులు కావున మహిళలందరూ కూడా సాయంత్రం ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో ఉన్నారు ప్రస్తుతం, వాళ్లు మీ చీరలైనా లాగవచ్చు, మీ పైన చేతులైన వేయొచ్చు, మీ పైన నీచంగానైనా మాట్లాడవచ్చు, మీ గురించి ఇతరుల ముందు నీచంగా మాట్లాడవచ్చు, మీ ముందే నీచంగా మాట్లాడొచ్చు ఏదైనా జరగొచ్చు. కావున మహిళలందరూ కూడా జాగ్రత్త వహించాలి ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో మన రాష్ట్రంలో అమ్మాయిల పైన జరుగుతున్న అరాచకాలని చూస్తూ ఉన్నాం చూస్తూ వస్తున్నాం కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులని పట్టుకుంటే లాభం లేదు ఎందుకంటే మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంత అసమర్థులు కాబట్టి. పైన చెప్తున్న విషయాలకి ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి వాస్తవాలను మాట్లాడుతున్నాను, కావున మహిళలు కూడా ఈ విషయాన్ని గమనించాలి జాగ్రత్త వహించాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మహిళలకు భద్రత ఉండదని చాలా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నష్టం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు కాబట్టి, కావున మహిళలు ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులతో గాని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈరోజు సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాలు కూడా మహిళల భద్రత కోసం షీ టీం మరియు మహిళా కానిస్టేబుల్స్ ని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మన జహీరాబాద్ టౌన్ పోలీస్ శాఖ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏ ఒక్క మహిళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము అసలు ఊరుకునే పరిస్థితి ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version