8 వసంతాలు’ ఎలా ఉందంటే.

8 Vasantalu Review: ‘8 వసంతాలు’ ఎలా ఉందంటే

 

 

 

 

 

 

 

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ: 8 వసంతాలు (8 Vasantalu Movie Review)
విడుదల తేది: 20–6–2025

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

అనంతిక సనీల్‌కుమార్‌(ananthika sanilkumar), రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది.

 

ఫస్ట్‌ లుక్‌ నుంచి ప్రచార చిత్రాలు  ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకొన్నాయి.

 

నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్‌తో సినిమాకు బజ్‌ పెరిగింది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

కథ : (8 Vasantalu Story)
శుద్థి అయోధ్య (అనంతిక సనీల్‌ కుమార్‌) స్ట్రాంగ్‌ లేడీ.

 

చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితను ఓ పుస్తకంగా రాస్తుంది.

అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు..

 

తల్లి ప్రేమ, బాధ్యత, మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ ఉంచే స్వభావం కలది.

 

మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న అమ్మాయి శుద్ధి.

ఓ రోజు మార్షల్‌ డోజోలో వరుణ్‌ (హను రెడ్డి) పరిచయం అవుతాడు.

చూసిందే తడవు..

ఆమె ప్రేమకోసం తపిస్తూ వెంటపడతాడు.

కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకుని చెప్పేలోపు వరుణ్‌ బర్క్‌లీలో తన గోల్‌ సాధించడం కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు.

 

పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది.

తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్‌ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు.

అతనిని శుద్ధి ప్రేమిస్తుంది.

తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్‌ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది.

 

తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది.

సంజయ్‌ ఆమె ప్రేమను గెలిచాడా?

8 వసంతాలకు, సంజయ్‌కు సంబంధం ఏంటి?

అన్నది కథ.

  

‘మను’, మధురం వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమకథ ఇది.

గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్‌ బాధ పెట్టి ఉండొచ్చు.

ఆ కసితోనే 8 వసంతాలు చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది.

2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ ఇది.

 

స్ట్రాంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు.

 

సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకూ ఫ్లో బావుంది.

అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా..

శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు.

దర్శకుడు పూర్తిగా కవితాత్మక కథ తెరపై చూపించాలనుకున్నాడు.

ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్‌ చేసిన భావన కలుగుతుంది.

మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది.

ప్రాసల కోసం తపన కనిపించింది.

కొన్ని సందర్భాల్లో డైలాగ్‌ నలిగిపోయింది.

దాని వల్ల క్యారెక్టర్స్‌ మీద ఉన్న ఎఫెక్ట్‌ తగ్గిందనిపిస్తుంది.

తండ్రి మరణం, ఆ తర్వాతి సంఘటనలు శుద్ధికు రైటర్‌గా జన్మ ఇచ్చింది.

వరుణ్‌తో లవ్‌ ట్రాక్‌ బావుంది.

ఆమె ప్రేమను చెప్పాలనుకునే లోపు అతను విడిచివెళ్లిపోయాడు.

వరుణ్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ, అతని రన్‌ చూస్తే నెగటివ్‌ అని గెస్‌ చేసేలా ఉంది.

ఇంటర్వెల్‌ వరకూ సినిమా ఒకలా ఉంటే..

అక్కడి మరోలా ఉంది.

తనని వదిలించుకుని వెళ్లున్న వరుణ్‌కి వర్షంలో నిలబడి చెప్పే డైలాగ్‌లో ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి.

‘మనిషికి మనిషి దూరంగా ఉన్నా..

దగ్గరగా ఉన్నా డిగ్నిటీ మాత్రం మారకూడదు’ అంటూ తల్లి గురించి చెప్పే డైలాగ్‌లు,


‘నేను వద్దు అనుకున్నానంటే నేను వేసుకున్న దుస్తులు  పొరపాటున గాలి వల్ల కూడా నీ వైపు రావు. అంత స్ట్రాంగ్‌ నేను’

 

అంటూ మహిళల్ని మహారాణిలా పోలుస్తూ రాసిన డైలాగులు పేలాయి. ఆ డైలాగ్‌లు చప్పట్లు కొట్టించాయి.

తర్వాత ఇంటర్వెల్‌..

మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు మరణం, అస్తికలు కలపడానికి కాశీకి వెళ్తే అక్కడ చేదు అనుభవం, సంజయ్‌ ఎంట్రీ, తల్లి అనారోగ్యం ఇవన్నీ పార్టుపార్టులుగా కథను, రన్నింగ్‌ ఫ్లోన్‌ డల్‌ చేసేశాయి. కాశీలో శుద్ధి తీసిన యాక్షన్‌ సీన్‌ బావుంది.

కానీ అంత యాక్షన్‌ పార్ట్‌ అవసరం లేదేమో అనిపిస్తుంది.

అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌ అయినా లోపల సున్నితత్వం అనేది ఒకటి ఉంటుంది.

అలాంటి అమ్మాయి గుండెకు ప్రేమ పేరుతో బలమైన గాయమైనప్పుడు మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంత ఆలోచించాలి?

ఎంత బలమైన సిచ్చువేషన్‌ క్రియేట్‌ చేయాలి.

కానీ ఇక్కడ దర్శకుడు దానిని మిస్‌ చేశాడు.

 ఓ వేశ్య కథకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు పాఠకులలో ఆశ నింపాలని చూసిన ఓ రచయితను చూడగానే మనసిచ్చేస్తుంది శుద్ధి.

రెండో విజిట్‌కే ప్రేమమైకంలో పడుతుంది. అది సహజంగా లేదు.

నమ్మసఖ్యంగా లేదు.

రచయిత రాసిన మాటలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్‌ అయ్యేలా రాయాలి, కానీ రిజిస్టర్‌ అవ్వడం కోసమే మాటలు రాయకూడదు.

కానీ దర్శకుడు ఇక్కడ అదే చేశాడు.

ఓ బుక్‌ స్టోర్‌లో మా రోజుల్లో చలంకు అమ్మాయిల్లో ఇంత క్రేజ్‌ ఉండేది..

ఇప్పుడు ఈ అబ్బాయికి’ అని ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం, ఓ సందర్భంలో  ప్రేమికుడిని చెరకు తోటలో పడిన ఏనుగుతో పోల్చారు’ అని జనాలు యాక్సెప్ట్‌ చేసేలా లేవు.

 

కొన్ని సందర్భాల్లో పాత్రలు తమ వయసుకు మించి మాట్లాడుతున్న భావన కలుగుతుంది.

 

నటీనటులు పనితీరు..

 శుద్థి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్‌ కుమార్‌ అద్భుతంగా నటించింది.

హవభావాలు అద్భుతం. ప్రేక్షకుడి కన్ను తిప్పుకోనివ్వకుండా ఆమె నటన ఉంది.

ప్రతి సీన్‌లోను మెప్పించింది. ఒకటి రెండు సన్నివేశాల్లో ఎమోషన్‌ క్యారీ చేయలేకపోయిందనిపించింది.

పాత్ర పరంగా ఆమె ఈ సినిమాకు బిగ్‌ ఎసెట్‌. హను రెడ్డి వరుణ్‌ పాత్రకు న్యాయం చేశాడు.

అనంతిక, హనురెడ్డి పెయిర్‌ తెరపై బావుంది.

ఇద్దరి మధ్య యాక్టింగ్‌ కెమిస్ట్రీ బావుంది.

సెకెండాఫ్‌లో వచ్చిన రవి దుగ్గిరాల నటనలో ఇంకా బాలుడే.

ఇంప్రూవ్‌ కావాలి.

శుద్ధి స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్‌ పాత్రకు న్యాయం చేశాడు.

మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేదు.

తమ పరిధి మేరకు యాక్ట్‌ చేశారు.  

దర్శకుడికి మంచి టీమ్‌ కుదిరింది.

సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాధ్‌రెడ్డి విజువల్‌ పరంగా ఎక్కడా పేరు పెట్టకుండా ప్రతీ సీన్‌ను అందంగా క్యాప్చర్‌ చేశారు.

అలాగే సినిమాకు మ్యూజిక్‌ ఎసెట్‌.

హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ చక్కని పాటలు, ఆర్‌ఆర్‌ అందించారు.

సాహిత్యం బావుంది.

ఎడిటర్‌ శశాంక్ మాలి సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది.

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమాను బాగానే గ్రాండ్‌గా తీశారు.

నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది.

రచనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమా మధ్యలో డ్రాప్‌ అయింది.

ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అద్భుతం అనేలా తీశారు.

ఆ రెండు సీన్స్‌ చాలు సినిమాకు హిట్టుకు అనుకున్నారో ఏమో?

ఎక్కువ దృష్టి అక్కడే పెట్టి మిగిలినది సోసోగా కానిచ్చారు.

కానీ ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేవు.

పొయిటిక్‌ లవ్‌స్టోరీగా తీసే ప్రయత్నం చేశారు కాబట్టి కామెడీకి ఎక్కడా చోటు ఇవ్వలేదు.

8 ఏళ్ల ప్రేమకథను దర్శకుడు సున్నితంగా చూపించారు కానీ..

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.

సింపుల్‌, కూల్‌ లవ్‌స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

కమర్షియల్‌ యాక్షన్‌ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్.

 మలయాళ డైరెక్టర్ తో అల్లు అర్జున్…

 

అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్( Allu Arjun), పుష్ప(Pushpa) తరువాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ..  దీని తరువాత అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram) సినిమాను పక్కన పెట్టి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్ తో అట్లీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్  అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత అయినా బన్నీ.. త్రివిక్రమ్ తో  సినిమా చేస్తాడు అనుకుంటే పొరపాటే. ఎవరు ఊహించని డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే బన్నీ వాస్ .. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా  క్లారిటీ ఇచ్చాడు.  అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కాంబో  ఏంటి.. ? బన్నీ ఏ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడా.. ? అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఆ డైరెక్టర్ ఎవరో కనిపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ తో పనిచేసి విజయాలను అందుకునం బన్నీ.. ఇప్పుడు మలయాళ హిట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ మలయాళ డైరెక్టర్ ఎవరో కాదు.. బాసిల్ జోసెఫ్(Basil Joseph). మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ తోనే అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ జయ జయ జయహే సినిమాతో బాసిల్ తెలుగువారికి దగ్గరయ్యాడు. ఆ తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగువారిని ఫిదా చేసింది. సూక్ష్మ దర్శిని, పోన్ మాన్, మరణ మాస్ లాంటి  సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిన్నల్ మురళీ 2021 లో రిలీజ్ అయ్యి  భారీ విజయాన్ని అందుకుంది. 

దాదాపు నాలుగేళ్ళ తరువాత బాసిల్.. అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి..  కేరళలో ఎలాంటి ఫ్యన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ అయితే.. అక్కడ వారికి మల్లు అర్జున్. ఎవరి సినిమాలైనా మలయాళంలో ఆడతాయో లేదో తెలియదు కానీ, బన్నీ సినిమా మాత్రం కచ్చితంగా మలయాళంలో ఆడితీరుతుంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ తోనే బన్నీ సినిమా చేస్తున్నాడు అంటే వారికి పండగే అని చెప్పాలి. ప్రస్తుతం  స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మరో నాలుగు నెలలో అధికారికంగా మేకర్స్  ఈ సినిమాను ప్రకటించనున్నారట. ఏదిఏమైనా బన్నీ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా

కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

 

తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం..

విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ..

కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్..

రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు..

ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి..

నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం..

నూగుర్ వెంకటాపురం
(నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల

వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆరోపించారు. సోమవారం వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, పూనెం సాయి వెంకటాపురం మండల కేంద్రం లోని వ్యవసాయ కార్యాలయం లో కలిశారు. మొక్కజొన్న కంపెనీల పేరుతో ఆర్గనైజర్లు రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని రైతులను కోట్ల రూపాయలకు ముంచేసారని అవినాష్ వర్మ కి తెలిపారు. బాండ్ మొక్కజొన్న వ్యవసాయం అని చెప్పి రైతులకు కంపెనీ అగ్రిమెంట్స్ ఏమి ఇవ్వలేదనని అన్నారు. ఎకరానికి మూడు నుండి ఐదు టన్నులు దిగుబడి వస్తుందని నమ్మబలికి నట్లు వివరించారు. పంట దిగుబడి రాకపోతే కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులకు తెలిపినట్టు వ్యవసాయ అధికారికి తెలియజేసారు. గత పదిహేను రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. సింజెంట, హైటేక్, మోన్సెంట, సీపీ వంటి విదేశీ విత్తన కంపెనీల ఆర్గనైజర్ల పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వ్యవసాయ సహాయ సంచాలకులు అవినాష్ వర్మ ని నాయకులు నిలదీశారు. ఆర్గనైజర్ల ఎరువుల దుకాణాలను తక్షణమే మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష యాభై వేలు, ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు కంపెనీ నుండి అందేలా చూడాలని వినతిపత్రం లో పేర్కొన్నట్టు తెలిపారు. రైతులు కంపెనీ మేనేజర్ల తో కలిపి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలని కోరినారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల పైన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే ఆర్గనైజర్లను పార్టీల నుండి బహిస్కరించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version