వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ..!

వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ
సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు.

బెల్లంపల్లి నేటిధాత్రి

బెల్లంపల్లి పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి టేకులబస్తీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు. ముందుగా సబ్ కలెక్టర్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు మాట్లాడుతూ పట్టణంలో చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే, కోశాధికారి కత్తుల నవీన్, కార్యవర్గ సభ్యులు ఎం భాస్కర్,కే రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55-5.wav?_=1

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు వేడుకలు
* పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్దన్నపేట (నేటిధాత్రి)
వర్ధన్నపేట మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వందమంది పేషెంట్స్ కి పండ్లుపంపిణీ చేయడం జరిగింది. జాతీయ యువజన అవార్డు గ్రహీత వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ఆపద కాలంలో పార్టీని కాపాడి ప్రజా సేవే ఏకైక లక్ష్యంగా జీవిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు గార్ల నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అర్హత నైపుణ్యం కలిగిన యువ నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలిచారు..

 

ఈ కార్యక్రమంలో , తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య,వర్ధన్నపేట పట్టణ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుబ్బ యాకయ్య, ఎండీ షాబీర్, పోలుసనీ దేవేందర్ రావు,దుబ్బ ఎల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ జంగిలి భాస్కర్, వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు నందిపక భాస్కర్, చేరిపల్లి బాబు, సమ్మెట రాంబాబు, యువ నాయకులు మంద రవీందర్, కుమారస్వామి, రాములు, రమేష్, శ్రీనివాస్ , రాజు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్ మోసపూరిత చర్యలు ప్రజల్లో ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘంలో పనిచేస్తున్న ఏపీవో రాజ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, తన పదవిని దుర్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజలతో నమ్మకం కల్పించి, తరువాత మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన గ్రామస్థులు దీనిపై అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు బాధితులు అతని వ్యవహారాలపై సాక్ష్యాధారాలు సమర్పించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్థులు ఏకమై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. సంబంధిత విభాగం అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. “రాజ్ కుమార్ లాంటి అధికారులు ఉండటం వల్లే సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని గ్రామ పెద్దలు వ్యాఖ్యానించారు. మాసునూరు సర్పంచ్ మాజీ స్వామి దాస్ మూడు సంవత్సరాలుగా నష్టపోతున్నానని అన్నారు.

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు.

కాశీబుగ్గ నేటిధాత్రి

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు మండలంలోని ఆగ్రాంపాడ్,లింగమడుగుపల్లె గ్రామాల్లో గ్రామకమిటీ అధ్యక్షులు శీలం సాంబయ్య, డుకిరే నాగేశ్వరరావు అధ్యక్షతన,మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనులు,సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో మట్టి అమ్ముకుంటున్నారని,దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మాజీ ఏ ఏం సి చైర్మన్లు బొళ్లబోయిన రవియాదవ్,కాంతాల కేశవరెడ్డి,సర్పంచ్ ల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షుడు సావురే రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని వంశీగౌడ్, రెండు గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=2

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలును పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిసరాలును పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇస్సిపేట,పోతుగల్లు ,పర్ల పల్లి గ్రామాలలో అదేవిధంగా కొరికి శాల కస్తూర్బా పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇస్సి పేట లో డాక్టర్ నాగరాణి , పోతుగల్లో డాక్టర్ సరళ, పర్లపల్లిలో డాక్టర్ స్వప్న , వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది .అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో 8 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి నలుగురు జ్వర పీడితులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేసిన వారందరూ కూడా క్షేమం. నలుగురికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్టు డాక్టర్ తెలియజేసినారు . మండలంలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ మేడంకు తెలియజేసినారు. వంటశాలను తనిఖీ చేసి, వారికి కూడా తగు సూచనలు ఇచ్చినారు .అదేవిధంగా వివిధ క్యాంపులో కస్తూర్బా పాఠశాలలో 8 మందికి వైద్య పరీక్షలు చేసి నలుగురికి రక్త నమూనాలు తీసుకున్నారు.
పోతుగల్లులో 45 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుని గుర్తించి రక్తనమును తీసినారు, పర్లపళ్లి లోమందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితులను గుర్తించి రక్త నమోనాలు తీశారు .ఇసి పేట లో 55 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుల్ని గుర్తించి రక్త నమోనాలు తీసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడడం వల్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని ,కాచి చల్లార్చిన తాగాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ,డాక్టర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు . ఈయొక్క వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి గారు కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించినారు
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. కె రాజేంద్రప్రసాద్ ,హెల్త్ సూపర్వైజర్ సునీత ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత , భారతి, రజిత, షబిద ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-5.wav?_=3

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల పాపిరెడ్డి తల్లి చల్ల లక్ష్మి గత కొద్ది రోజుల క్రితం మరణించగా గురువారం చల్ల లక్ష్మి దశదినకర్మలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తిరుమల్ నాయక్, చల్ల శ్రీపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, రావుల తిరుపతిరెడ్డి, మెరుగు విజయ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారావు శిరీష, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను ప్రసాద్, చిన్నూరి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు

*ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు*

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం,జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికి సంఘీభావం తెలిపేందుకు విచ్చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ,జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్,జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కోశాధికారి రాచర్ల సురేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్,సీనియర్ నాయకులు అజ్మీర శ్రీనివాస్,దుర్గ చరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ చేసిన కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52-4.wav?_=4

రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలి…

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.

అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.

డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.

ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేటటువంటి నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ. మండలంలోని వివిధ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు మావద్ద ముందస్తుగా సమాచారం తీసుకుంటే మానిటరింగ్ చేయడం చాలా సులభం అవుతుందని ఇందుకోసం ప్రత్యేకంగా http://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు కచ్చితంగా ఆన్లైన్లో ఉండాలని అన్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో డీజే లకు ఇలాంటి అనుమతి లేదని అందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని మండపాల వద్ద విద్యుత్ వినియోగం కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద మైక్ సౌండ్ సిస్టమ్ ఉపయోగించ కూడదని మండపాల వద్ద మద్యం సేవించిన అసభ్యకరమైన నృత్యాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. మండపాల వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి సందేహం వచ్చిన పోలీస్ శాఖను సంప్రదించాలని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు.

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=5

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం
ఇన్నాళ్లు ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వరరావు

నేటి ధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా కే.సుధాకర్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇన్నాళ్లు అదనపు విధులు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావుని అదనపు బాధ్యతల నుండి తొలగించి, కె.సుధాకర్ కి గురువారం అదనపు బాధ్యతలు శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీచేయనైనది. గ్రేడ్ – I కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన కే సుధాకర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

రేపటి నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం.

యాద నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

కాశిబుగ్గ నేటి ధాత్రి.

 

వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మెన్స్ & ఉమెన్స్ హాస్టల్ నందు పనిచేస్తున్న 86 మంది వర్కర్స్ కు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “నిరవధిక సమ్మె”ఈ రోజుకు 10వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా ఈరోజు కాకతీయ వైద్య కళాశాల ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాద నాయక్ మాట్లాడుతూ హాస్టల్ వర్కర్స్ కు చెల్లించాల్సిన 8 నెలల వేతనాలు పెండింగ్ లో ఉండటం వలన కుటుంబాలు గడవక,అప్పులు పుట్టక,స్థానిక అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందనీ అన్నారు. వేతనాలు చెల్లించనందునే గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని,ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వం,అధికారులు వహించవలసి వస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అన్నారు.లేనియెడల వీరి సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరి మద్దతును కూడగట్టి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జే సుధాకర్,అల్లం రమేష్,రాణి, రాజకుమారి,ఎండి అతిక్ హనుమకొండ రవి,బాబు,మంద కవిత తదితరులు పాల్గొన్నారు.

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్

ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని

యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ లేదా తస్తమాన విద్యను పూర్తిచేసి పాసైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి బీఏ,బీకం,బీఎస్సీ కోర్సులలో చేరేందుకుగాను 30న చివరితేది అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రిన్సిపాల్ అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్ మాట్లాడుతూ ఇంటి దగ్గర లేదా ఉపాధి చేసుకుంటూ విద్యను అభ్యసించాలనుకుంటే విద్యార్థులకు బిఆర్ఏఓయూ దూరవిద్య మంచి అవకాశాన్ని కల్పిస్తుందని టిప్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ పొందిన వారు కూడా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎలిశాల అశోక్, డాక్టర్.దుప్పటి సంజయ్,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50-4.wav?_=6

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

* రైతుల గొస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-73-2.wav?_=7

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

హామీల అమలుకై సమరశీల పోరాటాలు

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

వేతనాలు నెలవారి సక్రమంగా చెల్లించాలి సిఐటియు డిమాండ్

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి…

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని హామీల అమలుకై పంచాయతీ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గుమ్మడవెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు క్రమం తప్పకుండా బ్యాంకు ద్వారా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు వారికి పిఆర్సి అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ,రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా గుమ్మడవెల్లి కృష్ణ, అధ్యక్షులుగా గాంధర్ల ధనంజయ్, ప్రధాన కార్యదర్శిగా చర్ప సాంబశివరావు ట్రెజరర్ గా ఉప్పలి సాంబశివరావు లతోపాటు పదిమంది ని కమిటీ సభ్యులుగా కంగాల సురేష్, వడ్లకొండ శ్రీను, కొమరం ప్రశాంత్, మెంతిని శంకర్, కల్లూరి రమేష్ నిట్టా ప్రసంగిలను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పాల్గొన్నారు

గణేష్ ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు – ఎస్పీ ఆదేశాలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49-3.wav?_=8

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి

జిల్లా ఎస్పీ మహేష్.బీ.గీతే ఐ.పీ.యస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్.ఐ లు,ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని,

SP Mahesh.B.Geethe IPS

ఈవిషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్టపన నుండి నిమార్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు.మండలాల వారిగా నిమార్జనం జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు..గణేష్ మండపాల వద్ద,శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని,నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.అవసరం మేరకు చిన్న స్పీకర్లు పోలీస్ వారి అనుమతితో ఏర్పాటు చేసుకోలన్నారు.. ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు,ఎస్.ఐ కు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-72.wav?_=9

సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ కి చెందిన సంధవేణి నాగమణి కి ఒక్కసారిగా హై బిపి వచ్చి, మెదడులో నరం తెగి రక్తం గడ్డ కట్టడంతో వారు, కరీంనగర్ లోని కెల్విన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వారు సిరి ఫౌండేషన్ ను సంప్రదించగా వారు దాతల ద్వారా సేకరించిన 12,150 రూపాయలను సిరి ఫౌండేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి నాగమణి కుమారుడు సంతోష్ కు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురు చూసే, ప్రతి ఒక్కరికి సిరి ఫౌండేషన్ అండగా నిలుస్తుంది అని అన్నారు, నేటి యువత సేవా కార్యక్రమలలో ముందుడాలని నాగమణి గారి చికిత్స కోసం విరాళాలు అంధిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరి ఫౌండేషన్ కార్య వర్గ సభ్యులు ఉప్పు శేఖర్, సంతోష్ కుమార్,స్థానిక నాయకులు అర్నె సతీష్, జీలకర మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version