బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన దుర్గం చిన్నయ్య

బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్,మంచిర్యాల: నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షాద్ బాబా సతీమణి అకాల మరణం చెందారని,విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం వారి నివాసానికి వచ్చి కుటుంబానికి మనో ధైర్యాన్ని చేకూర్చి ప్రగడ సానుభూతి తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్…

స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్

విజయానికి అన్ని వర్గాల మద్దతు తనకే అని ధీమా వ్యక్తం

ఇంటింటికి బొట్టు పెట్టి ఓట్లు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారం

తాండూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చీరల రాజేష్ స్థానిక ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజేష్ తమ గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో బీసీ రిజర్వేషన్ రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది.చీర్ల రాజేష్ ఇదివరకే ఉపసర్పంచ్ పదవిలో కొనసాగి ప్రజా సమస్యలపై పట్టున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. తను గ్రామానికి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అంతేకాకుండా గ్రామస్తులతో తనకు తన కుటుంబానికి ఎనలేని ఆప్యాయత అనుబంధం ఉందని అన్నారు.తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని, తనే పోటీలో సర్పంచ్ అభ్యర్థి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు

*ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు*

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం,జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికి సంఘీభావం తెలిపేందుకు విచ్చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ,జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్,జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కోశాధికారి రాచర్ల సురేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్,సీనియర్ నాయకులు అజ్మీర శ్రీనివాస్,దుర్గ చరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version