
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో(గర్ల్స్) సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తో తరగతి గదిలో ఆకలి నివారించడం,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం,విద్యార్థుల ఆరోగ్యం & పెరుగుదలను మెరుగుపరచడం,విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడం, సాంఘీకరణను మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 10వ…