ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం
ఇన్నాళ్లు ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వరరావు
నేటి ధాత్రి ఐనవోలు :-
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా కే.సుధాకర్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇన్నాళ్లు అదనపు విధులు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావుని అదనపు బాధ్యతల నుండి తొలగించి, కె.సుధాకర్ కి గురువారం అదనపు బాధ్యతలు శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీచేయనైనది. గ్రేడ్ – I కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన కే సుధాకర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.