లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన…

లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్య తిరేక విధానాలు మానుకో వాలి

శాయంపేట నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రం లో ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు మారేపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోరాటాలు నిర్వహిం చి త్యాగాలు చేసి సాధించు కున్న కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్పొరేట్లకు, భూస్వాములకు ఊడిగా ఊసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు పోతున్నదని విమర్శించారు. అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా, ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు దెబ్బతీసే నాలుగు లేబర్ చట్టాలను వెనక్కి తీసు కోవాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు కూడా కార్మికులకు నానా విధాలుగా కష్టాలు ఎదురవుతున్నాయి. వేత నాలు నిర్ణయించే అంశాన్ని యజమాన్యాలకు వదిలేయడం ఎంతవరకు సంబంధం సబమని ప్రశ్నించారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు వినాశనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపె నీలలో పనిచేస్తున్న, గతంలో 8గంటలు మాత్రమే పనిచేసేది. ఈ చట్టాల ద్వారా 12గంటలు చేయాలి. యాజమాన్యానికి నచ్చితే పని చేయించుకుంటా రు, నచ్చకపోతే వారిని తీసేస్తా రు. యాజమాన్యానికి స్వేచ్ఛ ను కలిగించిన నరేంద్రమోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కితీసుకోక పోతే కేంద్రప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

రేపటి నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం.

యాద నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

కాశిబుగ్గ నేటి ధాత్రి.

 

వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మెన్స్ & ఉమెన్స్ హాస్టల్ నందు పనిచేస్తున్న 86 మంది వర్కర్స్ కు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “నిరవధిక సమ్మె”ఈ రోజుకు 10వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా ఈరోజు కాకతీయ వైద్య కళాశాల ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాద నాయక్ మాట్లాడుతూ హాస్టల్ వర్కర్స్ కు చెల్లించాల్సిన 8 నెలల వేతనాలు పెండింగ్ లో ఉండటం వలన కుటుంబాలు గడవక,అప్పులు పుట్టక,స్థానిక అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందనీ అన్నారు. వేతనాలు చెల్లించనందునే గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని,ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వం,అధికారులు వహించవలసి వస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అన్నారు.లేనియెడల వీరి సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరి మద్దతును కూడగట్టి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జే సుధాకర్,అల్లం రమేష్,రాణి, రాజకుమారి,ఎండి అతిక్ హనుమకొండ రవి,బాబు,మంద కవిత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version