ఘనంగా ప్రారంభమైన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

నేటి ధాత్రి అయినవోలు

 

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యా వచనము ధ్వజారోహణము మహాన్యాస పూక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహనివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థపర ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. తద్వారా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఎస్.ఐ శ్రీనివాస్,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్ అర్చక సిబ్బంది ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

మృతురాలి భౌతిక దేహానికి నివాళులు…

మృతురాలి భౌతిక దేహానికి నివాళులు
అనారోగ్యంతో దేవస్థాన డైరెక్టర్ ఆనందం సతీమణి సుగుణ మృతి
పరామర్శించి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

ఐనవోలు మండలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ బరిగల ఆనందం సతీమణి సుగుణ బుధవారం అనారోగ్యంతో మరణించారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు ఐనవోలు మండల కాంగ్రెస్ నాయకులు గురువారం ఆనందం నివాసానికి వెళ్లి సుగుణ భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కూరి స్వామి వాకిటి చందర్ రెడ్డి స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ ఐనవోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగల భాస్కర్,
ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు సంపత్ రెడ్డి, శ్రీ కట్కూరి విజయకుమార్ యూత్ ప్రెసిడెంట్ తాటికాయల ప్రశాంత్,బరిగల ఏలియా, అనుముల రవీందర్, శ్రీ రమేష్ గౌడ్,కోడి కుమార్ స్వామి, బరిగల ప్రభాకర్ అయినవోలు మండలం యూత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బరిగల చక్రి ,తదితరులు పాల్గొన్నారు.

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం
ఇన్నాళ్లు ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వరరావు

నేటి ధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా కే.సుధాకర్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇన్నాళ్లు అదనపు విధులు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావుని అదనపు బాధ్యతల నుండి తొలగించి, కె.సుధాకర్ కి గురువారం అదనపు బాధ్యతలు శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీచేయనైనది. గ్రేడ్ – I కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన కే సుధాకర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version