పరిసరాలును పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇస్సిపేట,పోతుగల్లు ,పర్ల పల్లి గ్రామాలలో అదేవిధంగా కొరికి శాల కస్తూర్బా పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇస్సి పేట లో డాక్టర్ నాగరాణి , పోతుగల్లో డాక్టర్ సరళ, పర్లపల్లిలో డాక్టర్ స్వప్న , వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది .అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో 8 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి నలుగురు జ్వర పీడితులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేసిన వారందరూ కూడా క్షేమం. నలుగురికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్టు డాక్టర్ తెలియజేసినారు . మండలంలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ మేడంకు తెలియజేసినారు. వంటశాలను తనిఖీ చేసి, వారికి కూడా తగు సూచనలు ఇచ్చినారు .అదేవిధంగా వివిధ క్యాంపులో కస్తూర్బా పాఠశాలలో 8 మందికి వైద్య పరీక్షలు చేసి నలుగురికి రక్త నమూనాలు తీసుకున్నారు.
పోతుగల్లులో 45 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుని గుర్తించి రక్తనమును తీసినారు, పర్లపళ్లి లోమందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితులను గుర్తించి రక్త నమోనాలు తీశారు .ఇసి పేట లో 55 మందికి వైద్య పరీక్షలు చేసి ఒక జ్వర పీడితుల్ని గుర్తించి రక్త నమోనాలు తీసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడడం వల్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని ,కాచి చల్లార్చిన తాగాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ,డాక్టర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు . ఈయొక్క వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి గారు కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించినారు
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. కె రాజేంద్రప్రసాద్ ,హెల్త్ సూపర్వైజర్ సునీత ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత , భారతి, రజిత, షబిద ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.