టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

 

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

ఎన్నికలలో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్నారని, ఏమైందని సింగరేణి కార్మిక సంఘాల ( జేఏసీ) నాయకులు ప్రశ్నించారు.బుధవారం నాయకులు గట్టు మహేందర్, ఎస్సీ కేఎస్ (సిఐటియు) డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ..సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22న జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ప్రజాభవన్ కు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలనే పిలుపులో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు కార్మికుల అడ్డలో జెఎసి నాయకులు ప్రచారం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారుల అనుకూల విధానాలతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు.చేసే పనులకు అనుగుణంగా కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకో లేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 5 జీవోలను (,21,22,23,24,25) గెజిట్ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తే, నేడు మమ్మల్ని గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చి,సంవత్సర కాలం గడిచిపోయిన నేటికీ కనీస వేతనాల జీవోల గెజిట్ ప్రస్తావన తీయకుండా కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22 న ఛలో ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version