సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T144541.678.wav?_=1

 

సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండి.వేణుగోపాల్‌రావు, సెట్విన్ కార్పొరేషన్ అధికారులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కేటీపీపీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52.wav?_=2

కేటీపీపి లో జాతీయ జెండాను ఎగరవేసిన చీఫ్ ఇంజనీర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులు అందరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సుపరింటెండింగ్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కెటిపిపి ముఖద్వారం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఎస్సీ & ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కూడా చీఫ్ ఇంజనీర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్న 20 మంది సెక్యూరిటీ సిబ్బందికి కెటిపిపి ఉత్తమ ఉద్యోగి అవార్డు సర్టిఫికెట్ ను అందించారు

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=3

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T143014.351-1.wav?_=4

 

ఘనంగా ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జాతీయ జెండా ఎగురవేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ,పాల్గొన్న నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
నియోజకవర్గ ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం వచ్చి భారతీయులపై పెత్తనం చెలాయించారు.దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజల మాన ప్రాణాలను బలి తీసుకోవడంతో ఎందరో వీరులు తమ ప్రాణలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించారన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది దేశ నాయకులు తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు.గాంధీ,సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సీతారామరాజు వంటి వీరుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశం కోసం సేవ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు , తంజిమ్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్ ,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు , అధ్యక్షులు , మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు ,ఉద్యమకారులు ,బి ఆర్ ఎస్వీ నాయకులు ,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…

వీణవంకలో 79వ స్వాతంత్ర దినోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50.wav?_=5

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

వీణవంక మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అంబాటి రజిత జాతీయ జెండా ఆవిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T142142.125.wav?_=6

 

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

 

ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి 79వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రానికై సమరయోధులై పోరాటం కొనసాగించారని స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ లు స్వాతంత్రోద్యం కోసం దేశభక్తి కోసం మాట్లాడడం హాస్యాస్పదమని నిజమైన దేశభక్తి అంటే పేదల నిర్మూలన ఆదివాసీలు గిరిజనుల హక్కుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అని గిరిజన హక్కుల కోసం పోరాడే నక్సలైట్లను హతమార్చడం కాదని సమస్యల పరిష్కరించినప్పుడే ఉద్యమాలకు తావుండదని సమస్యలు ఉన్నంతకాలం ఎర్ర జెండా పోరాటాలు ఉంటాయని వారన్నారు, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ 79వ గణతంత్ర స్వాతంత్ర వేడుకలను పట్టణ కార్యాలయంలో నిర్వహించడం సంతోషదాయకమని ఓటు హక్కులను దుర్వినియోగపరుస్తూ కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఇలాంటి చర్యలు మానుకోవాలని వారన్నారు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాయడంలో బిజెపి ని ఎవరు బీట్ చేయలేరని కార్మికులంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు, ఈ కార్యక్రమంలో
బి కే ఎం యు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, మండల కార్యదర్శి బొంతుల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, ఎస్ సి డబ్ల్యూ యు బ్రాంచ్ సహాయ కార్యదర్శి డి తిరుపతి గౌడ్, పట్టణ కోశాధికారి మంతెన రమేష్, కో ఆప్షన్ సభ్యులు మూల శంకర్ గౌడ్, పట్టణ కార్యవర్గ సభ్యులు, రత్నం రాజo, బియ్యాల ఉపేందర్, బొంకూర్ రామచందర్, బండారి శంకర్, నాయకులు గుండ ప్రశాంత్, బియ్యాల భవాని, బూర్ల సమ్మయ్య, ఉప్పుల శంకర్, కట్ల పోచం పాల్గొన్నారు.

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49.wav?_=7

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వర్దన్నపేట (నేటిధాత్రి):
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గ
మొదటగా వారి నివాస గ్రామమైన కట్ర్యాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తదనంతరం ఇల్లంద గ్రామంలోని వారి అధికారిక కార్యాలయమైన వద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు నిర్వహించబడిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగురవేసి మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమములో PACS చైర్మన్ కన్నయ్య,వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు ,ఎండి ఖాజామియా,ఎండి మహమూద్, బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,అంగోత్ నాను నాయక్,మల్యాల దేవేందర్,కాటబోయిన సంపత్,బండి సంపత్ గౌడ్,అల్ల కొమురయ్య,పబ్బతి సంపత్,పుల్లూరి దామోదర్,కర్ర మాలతి రెడ్డి,మార్కెట్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు,సూపర్ వైజర్ బి వెంకన్న ,మార్కెట్ సిబంది లు పాల్గొన్నారు.

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండా పండుగ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-1.wav?_=8

ప్రభుత్వం జూనియర్ కళాశాల లో ఘనంగా జెండా పండుగ

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15నాడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ జెండావిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం మనము 1857 నుంచి 1947 వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని తద్వారా మనకు స్వతంత్రం సిద్ధించింది కావున ప్రతి విద్యార్థి తప్పకుండా స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈరోజు మనము కళాశాలలో ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్స్ గురుకులాలు స్కాలర్షిప్ సౌకర్యము పొందుతున్నాము విద్యార్థులందరూ దేశ రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు కళశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T130100.266.wav?_=9

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,నేటి ధాత్రి :

 

 

 

 

79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.అధ్యక్షులు చెల్ల విక్రమ్ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు స్వీట్స్ పంచిపెట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల బ్రతుకులు మారలేదని అన్నారు.ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోలేటి శివ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

పరకాల ఫర్టిలైజర్ డీలర్స్ ఘనంగా స్వాతంత్ర వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-47.wav?_=10

ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జెండా ఎగరావేసిన అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ నందు అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ కోశాధికారి ఎర్రం లక్ష్మణ్ ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఫర్టిలైజర్ అధ్యక్షులు అరుణ ఫర్టిలైజర్ యజమాని గందె వెంకటేశ్వర్లు జెండా ఎగరావేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరకాల ప్రజలకు తెలియపరుస్తూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్రం భారతదేశంలోని ప్రతి పౌరుడు ఐక్యమత్యంతో భారత దేశ ఔనిత్యాన్ని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులు,ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్,సీడ్స్ కంపెనీ ఎంప్లాయిస్,పట్టణ షాపు గుమాస్తా సంఘం మరియు ఎంప్లాయిస్,హమాలీ సభ్యులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నేరరహిత సిరిసిల్ల లక్ష్యం – ఎస్పీ మహేష్ గితే..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-1.wav?_=11

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పరంగా మరియు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు.

SP Mahesh Githe Independence Day

అంతేకాకుండా సిరిసిల్ల జిల్లాను శాంతి భద్రతలలో, మన వంతు కృషి ముందుండాలని, అంతేకాకుండా జిల్లాను నేరాలు లేని జిల్లాగా రూపుదిద్దడానికి మనమంతా కృషి చేయాలని పోలీసుల అధికారులకు మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగినది.

SP Mahesh Githe Independence Day

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా – ఎస్సై క్రాంతికుమార్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-45.wav?_=12

స్వాతంత్ర్య దినోత్సవం: శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా – ఎస్సై క్రాంతికుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతికుమార్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పరకాలలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ స్వాతంత్ర్య వేడుకలు…

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T120904.193.wav?_=13

 

ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జెండావిష్కరణ చేసిన అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

 

ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ నందు అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ కోశాధికారి ఎర్రం లక్ష్మణ్ ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఫర్టిలైజర్ అధ్యక్షులు అరుణ ఫర్టిలైజర్ యజమాని గందె వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరకాల ప్రజలకు తెలియపరుస్తూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్రం భారతదేశంలోని ప్రతి పౌరుడు ఐక్యమత్యంతో భారత దేశ ఔనిత్యాన్ని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులు,ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్,సీడ్స్ కంపెనీ ఎంప్లాయిస్,పట్టణ షాపు గుమాస్తా సంఘం మరియు ఎంప్లాయిస్,హమాలీ సభ్యులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T135807.613.wav?_=14

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

*మహదేవపూర్ఆగస్టు9(నేటి ధాత్రి) *

మహాదేవపూర్ మండలంలోని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్శవేణి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులతో సంబరాలు చేశారు
ఈ కార్యక్రమములో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సింగల్ విండో చెర్మన్ చల్ల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కట్కాo అశోక్,మాజీ కాళేశ్వరం దేవస్థానం చెర్మన్ వామన్ రావు,మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాబు,మాజీ ఎంపీటీసీ గంగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోత రామకృష్ణ యూత్ నాయకులు రాజేష్, కడార్ల నాగరాజు,శంకర్,రవిచందర్, సంతోష్,శివరాజు,మనోజ్ రెడ్డి,స్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3.wav?_=15

ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.

భూపాలపల్లి నేటిధాత్రి

2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన శైలి ఇతర సమాజాలకు భిన్నంగా ఉంటుందనీ, ఆదివాసులు విగ్రహ ఆరాధకులు కాదని, పకృతి ఆరాధకులని వీరి పూజా వ్యవహారాలు వేరుగా ఉంటాయని అన్నారు, వీరిని జనగణలలో ఏదో ఒక మతం కింద నమోదు చేయడం వలన వీరి అభివృద్ధి కి అస్తిత్వానికి ముప్పు

 

వాటిల్లుతుందని అందుకే 2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని అదేవిధంగా ఆదివాసి దినోత్సవం ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలోని ఉద్యోగులు మేధావులు సంస్కృతి మీద సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనడం వలన ఆదివాసులకు ఉపయోగం జరుగుతుందని కావున అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 ని ప్రభుత్వ సెల్లు దినంగా కేటాయించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఆదివాసి గ్రామాలలో సమస్యలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ,అదేవిధంగా ఆదివాసి జెండా పండుగలు వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా పండుగలు చేసుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలు కలలు పునర్జీవింప పడేవిధంగా ఆదివాసి సమాజం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఆదివాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోలం సతీష్ బదిరాజయ్య రామినేని రాజు నాగరాజు తోట లక్ష్మయ్య గుంటి అంజలి తోట శ్రీ చందన గుండప్పు తేజస్విని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version