తుఫాన్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి…

తుఫాన్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*

తుఫాన్ కారణంతో వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతులను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మిపురం,నాచినపల్లి,చాపలబండ గ్రామాలలో పర్యటించారు.అలాగే పంటలను పరిశీలించారు.కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంటలు చేతికందే దశలో తుఫాన్ తీవ్రత వలన నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ నేపథ్యంలో వరి,అరటి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితులలో ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకొని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చల్ల నరసింహారెడ్డికొంగర నరసింహస్వామి, అక్కపెళ్లి సుధాకర్, కోడెం రమేష్, గొర్రె సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూరియ కోసం… రైతుల తిప్పలు…

– యూరియ కోసం…
రైతుల తిప్పలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

యూరియా కోసం రైతులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో శనివారం రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 400 బ్యాగులో యూరియా గ్రామానికి సరఫరా చేసింది. విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగినంత యూరియా రైతులకు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహులు, ఏఈఓ శ్రీలత, గ్రామస్తులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version