— యురియా కోసం క్యూ కట్టిన రైతులు…

 

— యురియా కోసం క్యూ కట్టిన రైతులు
• అందుబాటులో యూరియా..
అధైర్యపడొద్దు..
తహసిల్దార్ శ్రీనివాస్..

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈనెల యూరియా ఆ నెలలోనే వస్తుందని సెప్టెంబర్ నెల యూరియా ఆగస్టులో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నస్కల్ గ్రామానికి 20 మెట్రిక్ టన్నుల యూరియాను చల్మెడ, రాంపూర్, నస్కల్, నగరం గ్రామాలకు సంబంధించిన రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యూరియాను అధిక మొత్తంలో చల్లకుండా 3 దాఫాలుగా చల్లడం వల్ల కర్ర ఎదుగుదల పెరుగుతుందన్నారు.

 బాధిత కుటుంబానికి భరోసా.

 బాధిత కుటుంబానికి భరోసా

నిజాంపేట నేటి ధాత్రి:

గత 15 రోజుల క్రితం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లీలా గ్రూప్స్ చైర్మన్ మోహన్ నాయక్ బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో టెలికామ్ బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్, బాలరాజ్, సురేష్ నాయక్ లు ఉన్నారు.

అకాల వర్షానికి కూలిన ఇండ్లు బాధితులకు భరోసా కల్పించిన.

అకాల వర్షానికి కూలిన ఇండ్లు
బాధితులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామ పంచాయతీలోని గోపాల్ పూర్,శివ్వారం గ్రామాలలో గురువారం రాత్రి వీచిన గాలివానకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిని,పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయి పలు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version