జహీరాబాద్ నియోజకవర్గంలో, ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్ శుక్రవారం ఒక ప్రకటనలో భూమి కొనుగోలులో జరుగుతున్న మోసాలపై రైతులకు హెచ్చరిక జారీ చేశారు. కొంతమంది బ్రోకర్లు తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని నమ్మించి, అసలు భూమి కాకుండా వేరే భూముల పట్టా పాస్బుక్లు చూపించి మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులలో మునిగిపోయే భూములను కూడా రోడ్డు పక్కన ఉన్న భూములుగా చిత్రీకరించి అమ్ముతున్నారని, అగ్రిమెంట్ల పేరుతో రైతుల నుండి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వివరించారు.గతంలో ఎన్నో గ్రామాలలో ఇలాంటి మోసాలపై కేసులు నమోదయ్యాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివాహ వేడుకలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ బండ్లగూడ ఓ ఎస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాక్ పైసల్ కుమార్తె మరియు హెచ్ ఎఫ్ ఫంక్షన్ హాల్లో రియల్ ఎస్టేట్ ఆదిల్ కూతురి వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి వారితో పాటు కాంగ్రెస్ నాయకుడు అక్రమ్ హర్షద్ జమ తదితరులు ఉన్నారు,
మిలాద్-ఉన్-నబి ఊరేగింపునకు భద్రత ఏర్పాట్లు, సహకారం కోసం అభ్యర్థన
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మరియు దక్కన్ ఉలేమా మరియు మషాఖీన్ సూచనల మేరకు, హిందూ సోదర సోదరీమణుల గణేష్ మరియు సర్జన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం, సంప్రదాయం ప్రకారం, మిలాద్ ఉన్న్బ ఊరేగింపును పురాతన నగరమైన జహీరాబాద్ లోని ఈద్గా నుండి సెప్టెంబర్ 14. ఆదివారం ఉదయం 10.00 గంటలకు బయటకు తీసుకెళ్లా లని మిలాద్ ఉన్నబి ఊరేగింపును నిర్ణయించింది. మిలాదఉన్న్బ ఊరేగింపుకు మిలాద్ కమిటీ జహీరా బాద్ అధ్యక్షుడు సయ్యద్ షా మోహిబద్దిన్ ఖాద్రీ అలియాస్ బాబా సాహిబ్ అధ్యక్షత వహిస్తారు. అల్హాజీ హఫీజ్ సయ్యద్ షా అఫ్సర్ పాషా ఖాద్రీ ముహమ్మదీ ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈద్ మి లాద్ ఉన్ నబీ ఊరేగింపుకు మిలాద్ కమిటీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. కమిటీ అధికారులు ఈరోజు జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగంతో సమావేశమై వినతి పత్రం అందించారు. ర్యాలీకి అధి కారికంగా అనుమతిని పొంది, ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులను అభ్యర్థిం చారు. మెమోరాండం అందించిన వారిలో సయ్యద్ షా మొహిబుద్దీన్ ఖాద్రీ బాబా సాహెబ్, మిలాద్ కమిటీ అధ్యక్షుడు జహీరాబాద్, సయ్యద్ రిజ్వాన్ ఖాద్రీ సజ్జాదా నాషిన్, సయ్యద్ ఫర్హాన్ ఖాద్రీ బగ్దాదీ, హఫీజ్ హమీద్, హఫీజ్ ఇర్ఫాన్, అజీముద్దీన్ ఖాద్రీ, మహమ్మద్ ఇమీ, ఇతర కమిటీ అధికారులు ఉన్నారు.
◆:- ఒక్క ప్రత్యేక అధికారి కూడా గ్రామాలలో తిరగని వైనం
◆:- పంచాయతీ కార్యదర్శిలపై ఆర్థిక భారం
◆:- నిధులు, బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శిల పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల జగదేవపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి సొంత డబ్బులతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టిన గ్రామంలో విష జ్వరాలు విజృంభించడం ఇద్దరు అకాల మరణం చెందడం వల్ల పారిశుధ్య లోపం కారణమని చివరికి కార్యదర్శిని అధికారులు సస్పెన్షన్ చేశారు.
Panchayat Funds
1. చెత్త సేకరణ ట్రాక్టర్లతో తిప్పలు…..
పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ చాలా ముఖ్యం. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ తో పాటు వాటి మరమ్మతులు చేపట్టడానికి కార్యదర్శులు సొంతంగా వారానికి రూ. వేయి రూపాయల నుంచి రెండు వేల వరకు వెచ్చిస్తున్నారు. వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ పనులు తాగునీటి వసతి బోర్ల మరమ్మతులు పైప్ లైన్ లీకేజీలు తదితర పనులకు నెలకు పదివేల పైగానే ఖర్చు అవుతున్నాయి. కార్యదర్శులు ఆర్థిక భారంతో సతమతమవు తున్నారు. మొన్న ముగిసిన వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు కూడా అదనంగా భారం పడిందని కార్యదర్శులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటును కూడా అంతంత మాత్రమే. చేపట్టారు.
2. నిధులు రాక… గ్రామాల అభివృద్ధి గాలికి…
గ్రామాల్లో ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 15 ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్ సి నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా, వాణిజ్య పనులను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన తర్వాత విడుదల చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిపిల విద్యుత్ బిల్లులు చెక్కులు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నప్పటికీ జమ కావడం లేదు. ఆర్థిక భారం భరించలేక పలువురు కార్యదర్శులు వసూలైన పన్నుల డబ్బులను ఖర్చులను నిమిత్తం వినియోగిస్తూ బిల్లులు పెట్టుకుంటున్నారు. అందుబాటులో
3. బతుకమ్మకు ఏర్పాట్లు ఏట్లా…
బతుకమ్మ దసరా పండుగకు ఇక మిగిలింది పది రోజులే గ్రామాల్లో బతుకమ్మ కుంటల మరమత్తు పనులు విద్యుత్ దీపాలు అలంకరణ వంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ లో డబ్బులు లేకపోవడం ఇప్పటికే అదనంగా కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకొని వివిధ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ బతుకమ్మ దసరా ఉత్సవాలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని కార్యదర్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతున్నారు.
4. గ్రామాల్లో తిరగలేక పోతున్నాం….
ప్రజల నుండి వచ్చే సమస్యలను తీర్చలేక సొంత డబ్బుల తో, మరియు అప్పులు తెచ్చి చేస్తున్నాం. అతివృష్టి వలన కలిగిన వానలతో డ్రైడే నిర్వహించి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూస్తున్నాం. టాక్టర్ల ద్వారా పిచ్చి మొక్కలను, నీటి నిల్వలను శు భ్రం చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఈ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించగలని కోరుతున్నారు.
`అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
`లోకల్ల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేని వారికి టెండర్లు అప్పగిస్తున్నారు
`స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు
`అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నాడు
`అంతా నా ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నాడు
`ఇప్పటికైనా ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
`అవినీతిలో మునిగితేలుతున్న పిఏను పక్కన పెట్టకపోతే నష్టం జరిగిపోతుందంటున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి: ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యేలు చెబితే పనులౌతాయి. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు దగ్గర పనిచేసే పిఏ చెప్పిన పనులే అవుతాయి. పిఏ చెప్పినట్లే జరుగుతాయి. ఇక్కడ పిఏ చెప్పిందే ఫైనల్..అలా అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు ఆదేశాలతో జరిగిపోతున్నాయా? అంటే అదీ లేదు. అసలు ఎమ్మెల్యేకు ఈ విషయాలే తెలియవు. అంతగా పిఏ. ఏదిచెబితే ఎమ్మెల్యే అది చెప్పినట్లే అన్నట్లుగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలోనే కాదు, నియోకవర్గంలోఎంతో పేరున్న ఎమ్మెల్యే పేరు చెడిపోవడానికి ఇలాంటి పిఏ ఒక్కరుంటే చాలు అని పార్టీ నాయకులు , ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నమ్మారు. పిఏ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే మంచిర్యాలలో అందరూ అనుకుంటున్న మాట. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకుఎంతో మంచి పేరుంది. కాని ఏం లాభం. ఆయన పెట్టుకున్న పిఏ వల్ల తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. నాయకులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తన వద్ద పని చేసే పిఏను అంతగా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గ నాయకులు కూడా ఎవరూ పిఏ మీద పిర్యాధు చేయడానికి సాహసించడం లేదు. పైగా పిఏతో సఖ్యతగా వుంటే చాలనుకుంటున్నారు. కాని ప్రజలకు మేలు చేయాలన్నా,సేవ చేయాలన్నా, అభివృద్ది పనుల చేపట్టాలన్నా తామే ముఖ్యమన్న సంగతి నాయకులు కూడా మర్చిపోతున్నారు. పిఏ చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఒక రకంగా వారికి కూడా తప్పడం లేదు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది నాయకులైన వాళ్లు కూడా పిఏ. మన్ననలు పొందాలనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పార్టీ నాయకులకు దౌర్భాగ్యమైన పరిస్తితే. కాని ఏం లాభం? నోరు తెరిచి ప్రశ్నించలేరు. తమ ముందు పిఏ ఎంత అని అనుకోలేరు. ఎమ్మెల్యేకు చెప్పిన ఆయన పట్టించుకుంటాడో లేదో అన్న అనుమానం. ఎమ్మెల్యేకు ఎప్పుడూ సమాచారమందించే పిఏతో పెట్టుకొని పేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేకు దూరం కావడమెందుకు? అనే ధోరణిలోనే నాయకులు సాగుతున్నారు. దాంతో ఆ పిఏ ఆడిరది ఆట.. పాడిరది పాటగా మారిపోయింది. ఎలాంటి విషయాల్లోనైనా సరే పిఏ. ఎస్ అంటే ఎస్. నో.అంటే నో..అంతే! అంతకు మించి దారి లేదు. పరిష్కారం అంతకాన్న లేదు. అంతగా పిఏ ఏలుబడి సాగుతోంది. నిజమే పిఏ పలుకుబడి మంచి పనుల విషయంలోనో, ప్రజలకు మేలు జరిగే విషయంలో సాగితే బాగుంటుంది. కాని తన ఇష్టానుసారం పిఏ సాగిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. నాయకులే ఎమ్మెల్యే పిఏ ముందు పెద్దగా నోరు విప్పకపోవడంతో అధికారులు కూడా పిఏకు వంత పాడుతున్నారు. పిఏ చెప్పిందే చేస్తున్నారు. పిఏ ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇలా అధికారులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు? ఆఖరుకు కోర్టు తీర్పులను కూడా పక్కన పెడుతున్నారు. అభివృద్ది పనులను చేపట్టే కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా అదికార గణం నుంచి మొదలు, నియోకవర్గ, ముస్సిపల్ అదికారులంతా పిఏ చెప్పినట్లు వినాలి. పిఏ చెప్పిన వారికే కాంట్రాక్టులివ్వాలి. అర్హత లేని వాళ్లైనా సరే పిఏ చెప్పి వారికే టెండర్లు అప్పగించారు. ఇలాంటి ఏ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం వుండడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. తమను ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా చేస్తున్నాడని వాపోతున్నారు. నియజక వర్గ పెత్తనమంతా తన గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీస్తున్నాడు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అనార్యో కారణంగా నియోజకవర్గానికి రావడం లేదు. అది అలుసుగా తీసుకొని పిఏ రెచ్చిపోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎమ్మెల్యేను కలవాలని ఎంత ప్రయత్నించినా పిఏ. ఆ అవకాశం కల్పించడం లేదు. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు వెళ్లినా అప్పాయింటు మెంటు దొరక్కుండా పిఏ చూసుకుంటున్నాడు. దాంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లలేక, పిఏ చేస్తున్న పనులు భరించలేక కాంట్రాక్టర్లు సతమతమౌతున్నారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అదికారులను గుప్పిట్లో పెట్టుకొని స్ధానిక కాంట్రాక్టర్లను పిఏ వేధిస్తున్నాడని తెలుస్తోంది. అర్హులైన , లోకల్ కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. నియోజకవర్గ పరిదిలో ఏ పనులు చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ వుండాలి. అది స్దానికంగా వుండాలి. కనీసం నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వుండాలి. ఇది నిబంధనలు చెబుతున్నాయి. స్ధానికంగా వున్న కాంట్రాక్టర్లందరికీ మంచిర్యాలలోనే క్యాలిటీ కంట్రోల్ ల్యాబులున్నాయి. కాని వారికి మాత్రం కాంట్రాక్టులు అందడం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ధర్డ్ పార్టీలకే టెండర్లు, కాంట్రాక్టులు వెళ్తున్నాయి. అలా అదికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పిఏ తన ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. స్ధానికంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు నాణ్యతను కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. స్ధానికంగానే క్వాలిటీ కంట్రోల్ ల్యాబులున్న కాంట్రాక్టర్లు పనికిరాకుండాపోతున్నారు. కాంట్రాక్టులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టులపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయినా అదికారులు ఆ తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేసి మరీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పిఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పిఏ తన స్వార్ధం కోసం అదికారులను గుప్పిట్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకున్న పేరును చెడగొడుతున్నారు. అంతా నా ఇష్టమన్న రీతిలో పిఏ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. పిఏ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుకు తెలిసే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే మద్దతు లేకుండానే పిఏ ఇంత ఇష్టాను సారం వ్యవహరిస్తారా? అని అనుమానపడే పరిస్ధితి వస్తుంది. ఇంకా మూడేళ్ల కాలం వుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు సేవ చేయాల్సి వుంది. ఇలాంటి సమయంలో పిఏ ఆగడాలను ఎమ్మెల్యే ఉపేక్షిస్తూపోతే ప్రజల్లో నమ్మకం పోయే పరిసి ్దతి రావొచ్చు. ప్రేమ్సాగర్రావు మంచితనం చాలా మందికి తెలిసినా, కొంత మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల నాటికి పరిస్ధితి చేయిదాటి పోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా, రాకపోయినా ఇప్పటికైనా మేలుకుంటే ఎంతోమంచిదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత ఇప్పటి వరకు లేదు. కాని పిఏ వల్ల ఆ వ్యతిరేకత మొదలౌతే చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లౌవుతుంది. పిఏల వ్యవహార శైలి వల్ల గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అలాంటి పరిస్దితి రాకుండా వుండాలంటే వెంటనే ఎమ్మెల్యే పరిస్ధితులను చక్కదిద్దుకుంటేనే రాజకీయ భవిష్యత్తు వుంటుందని ప్రేమ్సాగర్రావు శ్రేయోభిలాషులు చెబుతున్నారు.
మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి
మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు
బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే
ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి
మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి
జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం. అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..
రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్…
కేసముద్రం/ నేటి ధాత్రి
గురువారం యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు.., కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు…!వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి, తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ ను చేర్చాడు. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు. సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన, కష్టం .. తనను కదిలించిందని, తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ..పని చేసానని కానిస్టేబుల్ అలీమ్ తెలిపారు. ఈ..రోజు ఉదయం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి, అతనిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు.. జిల్లా పోలీస్ బాస్ గా అనేక రకాల పనుల వత్తిడిలో ఉన్నప్పటికీ…, తన సిబ్బంది పనితీరును గుర్తించడం, వారిని ప్రశంసించి, ప్రోత్సహించడమే కాక, స్వయంగా తానే కానిస్టేబుల్ ను సత్కరించి అభినందించడం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పెద్దమనుసు కు ఒక ఉదాహరణ అని అక్కడ ఉన్న రైతులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రశంసించారు. ఉన్నతాధికారులు తీసకునే ఇలాంటి నిర్ణయాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనను కలిగిస్తాయని పలువురు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
సర్వే నంబర్ 26లో అక్రమ కట్టడాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని సీతారాంపూర్ పరిదిలోని సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ పరంపోగు భూమిలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగలపారక సంస్థ పరిధిలో ఉన్న సీతారాంపూర్ లోని సర్వే నెంబర్ 26లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పరంపోగు భూమిలో భవనాలు నిర్మించారని వీటికి ఇంటి నెంబర్లు మున్సిపల్ అధికారులు ఎలా ఇచ్చారన్నారు. పరం పోగు స్థలములో బహుళ అంతస్తులు, లగ్జరీ డూప్లెక్స్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించి అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలను ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను బై నెంబర్లు వేసి ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేసి అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరంపోగు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ స్థలంలో ఇంటి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను, కరెంటు మీటర్ ఇచ్చిన విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మౌనం చూస్తుంటే ఇందులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు నిర్మించి అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంటనే అరెస్టు చెయ్యాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సర్వేనెంబర్ 26లో ఉన్న భవనాలన్నింటినీ స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదల తోటి ఇండ్లను ఆక్రమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ ఈభూమిని పరిశీలించిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం. మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండల అధ్యక్షులు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మండల సేవాపక్షం ఇంచార్జి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ….. బిజెపి జాతీయ పార్టీ . పిలుపుమేరకు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. 19 గ్రామాల్లో రక్తదానం,స్వచ్ఛభారత్, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి జన్మదినవేడుకలు, తెలంగాణ విమోచన దినోత్సనం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్ లు గెలవాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మారుతి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గంగారాం,ప్రమోద్,శ్రీకర్, మహేష్,వినోద్,నారాయణ పాల్గొన్నారు.
సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సీతారం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఎ జిల్లా మాజీ కార్యదర్శి మాణిక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా విద్యను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జె ఎన్ యు విద్యార్థి ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది.. అనంతరం ఎన్ ఈపి పై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెమినార్ కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్ అనంతరం వారు సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే లాగా ఉందని వారు అన్నారు.. అనంతరం ఈ యొక్క విధానాన్ని ఈ నిర్ణయాని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా అన్నారు ఈ యొక్క విద్యా విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.. ఏదైతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో దానిని నెరవేర్చాలని అన్నారు.. అనంతరం సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అని వారు అన్నారు మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం పైన నిధులు కేటాయిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. ఒక దిక్కు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు అని వారు అన్నారు ఈ సమస్యలను ఇలా ఉన్న ప్రభుత్వానికి పట్టడం లేదా అని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ 8వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని అని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో అత్య భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలని వారు అన్నారు దాంతోపాటు ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకునే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు పక్క భవనాలు నిర్మించాలని అని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అందులో చదువుకునే పేద విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అని వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల విద్యార్థులు అందరికీ ఏకం చేసి భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఎస్ఎఫ్ఐ కాలేజీ కమిటీ సభ్యులు వంశీ రాజేష్ రవితేజ శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..
మొగుళ్లపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఏ.ఎన్.ఎం .ఆశా వర్కర్లు చేయడం జరిగినది. అదేవిధంగా ఇసి పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో 55 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ రక్త నమూనాలు తీసి ల్యాబ్ కు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ మండలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల ,సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో డ్రైడే కార్యక్రమాన్ని అనగా ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొని వాటిని డ్రై చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా, పుట్టకుండా జాగ్రత్తలు వహించాలని ,జ్వరం వచ్చినట్లయితే మా వైద సిబ్బందికి తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సి .హెచ్ .ఓ. రాజేంద్రప్రసాద్ ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,అన్ని గ్రామాల ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు ఐదు తరగతులకు ఒకే టీచర్ ఉన్నారని తిరిమాల్ తెలిపారు 5 తరగతులకు ఓకే గది ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు పాఠశాలలో మరుగుదొడ్లు వసతులు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వన్ని కోరారు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా వందే భారత్ రైలు ప్రారంభించడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ 20101 నాగ్ పూర్ – సికింద్రాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని,అధికారులు, ప్రజలు హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.