జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం…

జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సీతారం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఎ జిల్లా మాజీ కార్యదర్శి మాణిక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా విద్యను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేసిన పి.ఎ.సి.ఎస్ చైర్మన్…

పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసిన – పి.ఎ.సి.ఎస్ చైర్మన్

* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన – ప్రిన్సిపాల్

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనీ విద్యార్థులకు మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి పోటీ పరీక్షల పుస్తకాలని పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రధమ మరియు ద్వితీయ పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని ఉన్నత స్థానాలకు ఎదగాలని నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలలో పాల్గొనాలన్న సదుద్దేశంతో ఈ పుస్తకాలను పంపిణీ చేశామని, పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందించినందుకు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు అబ్దుల్ అలీ, రమేష్, సదానందం, సంధ్యారాణి తోపాటు అధ్యాపకెతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version