జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక
పర్వ తా రోహణ శిక్షణ శిబిరానికి – మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఈనెల 25 నుంచి అక్టోబర్ 1 వ తేదీ వరకు 
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో జరుగు పర్వతాహరణ శిక్షణ శిబిరానికి మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాల ఎన్.సి. సి విద్యార్థులు నలుగురు , ఎం .అర్జిత్ కుమార్ (10వ); బి అరవింద్ (10వ); జే .అరవింద్ (10వ) , పి. వీరమల్లు( 9వ) లు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పింగిలి విజయపాల్ రెడ్డి ; ఎన్.సి సి అధికారి గుండెల్లి రాజయ్యలు తెలిపారు
ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా శిబిరానికి ఎంపిక అవ్వడం పాఠశాలకు గర్వకారణం అని ఈ శిక్షణ జాతీయ సమైక్యత భావం పెంపొందించుకోవచ్చు, సాహసోపేతమైన కఠినమైన దారుల వెంట నడవడం , క్యాడర్స్ లోపల ఆత్మవిశ్వాసం ధైర్యం సోదర భావాన్ని నెలకొల్పడం కొరకు ఈ శిక్షణను ఇస్తారు అందువల్ల శిక్షణలో
మెలుకువలు తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకొని పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారిని అభినందించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు,…

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

హనుమాన్ మందిరాలయంలో.!

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

తొర్రూరు( డివిజన్) నేటి ధాత్రి

 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం గర్వకారణం అని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ పేర్కొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…..
సామాజిక ఉద్యమాల్లో అద్దంకి దయాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దళితుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశాడని తెలిపారు.
మాలలు, దళిత వర్గాల అభివృద్ధికి అద్దంకి దయాకర్ పాటుపడ్డాడని తెలిపారు.
అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే విషయ పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన దయాకర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు యనమల రాకేష్, డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు గారలాజర్, నెల్లికుదురు అధ్యక్షులు కారం ప్రశాంత్, నాయకులు చిట్టి మల్ల కిరణ్ ఎనమాల లక్ష్మి, ప్రసన్న కుమార్, చిట్టి మల్ల గోపి, బన్నీ మనో, శివకుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version