ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు,…

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం…

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం
సుబేదారి, నేటిదాత్రి

 

 

 

జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హిందీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ హిందీ దివస్ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం పూర్వ ఆచార్యులు సంజీవ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ఆరువేల మిలియన్ ప్రజలు మాట్లాడుతున్నారని, ఇది ప్రపంచ భాషగా ఎక్కువగా గుర్తింపు పొందిందని, అంతేకాకుండా పరిపాలకులు ఎవరూ ఉంటే వారి అనుకూలమైన భాషను రాజభాషగా అమలు పరుస్తారని భారతదేశాన్ని ఆంగ్లేయులు, ముస్లింలు పరిపాలించినప్పుడు వారి వారి పరిపాలన కాలంలో పరిపాలనకు అనుకూలమైన భాషను అధికార భాషగా గుర్తించడం జరిగిందన్నారు. భాష ఒక ప్రాంతం, ఒక వ్యక్తి మధ్య అవినాభావ సంబంధాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. భాషను నేర్చుకోవడానికి నిరంతర అధ్యయనం అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ భారత దేశంలో 60 శాతం మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ అని కాబట్టి ఇది రాజభాషగా కొనసాగుతుందని ఆమె అన్నారు, హిందీ భాష కంటే సంస్కృతం పట్ల విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతున్నప్పటికీ అధికార భాషగా సంస్కృతాన్ని ఎక్కడ వాడడం లేదని కాబట్టి హిందీ భాష ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిందీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు హిందీ భాషను చదవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పరహా ఫాతిమా మాట్లాడుతూ హిందీ భాష జాతీయ సమైక్యతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఆంగ్లం కేవలం సాంకేతిక అభివృద్ధి కొరకే దూదపడుతుంది గాని హిందీ నిత్యజీవితంలో వాడుక భాషగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ నాగయ్య, మంజుల, శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version