మందమర్రిలో జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు…

మందమర్రిలో జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి

 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకున్న మందమర్రి యువత

నవీన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ

ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పదవిలో లేకున్నా దాదాపు పదేళ్లుగా వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక–విద్యా సహాయం అందిస్తూ ప్రజలతో మమేకమై సేవలు చేయడం యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన సేవా భావాన్ని ముందుంచుకున్న మందమర్రి యువత ఆయన పుట్టినరోజును అర్థవంతంగా సేవామయ కార్యక్రమాలుగా నిర్వహించింది. సోమవారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లోని మనోవికాస్ పాఠశాలలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, దివ్యాంగ విద్యార్థులకు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. విద్యార్థుల ముఖాల్లో మెరిసిన ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నవీన్ యాదవ్ ప్రజలతో కలిసిపోతూ చేసే సేవలు మాకు దిశానిర్దేశం. అలాంటి నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరపడం మా అదృష్టం. ఇకపై కూడా మా ప్రాంతంలో ఇలాంటి సేవలను కొనసాగిస్తాం” అని గుంట శ్రీశైలం తెలిపారు. వరుస పరాజయాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే పనిచేస్తూ, చివరికి విశ్వసనీయతతో భారీ మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్ నిజమైన కష్టపడి ఎదిగిన నాయకుడని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి తోడ్పడిన మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్రను గుర్తుచేసి ఆయన్ను కృతజ్ఞతలతో స్మరించారు. నవీన్ యాదవ్ ఆయురారోగ్యాలతో ముందుకు సాగి తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని యువత ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో మంద తిరుమల్ రెడ్డి, ఆకారం రమేష్, అంకం రాజ్‌కుమార్, కత్తి రమేష్, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు….

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.

మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…

బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి…

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి

నేటి ధాత్రి కథలాపూర్

 

 

కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండల అధ్యక్షులు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మండల సేవాపక్షం ఇంచార్జి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ….. బిజెపి జాతీయ పార్టీ . పిలుపుమేరకు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. 19 గ్రామాల్లో రక్తదానం,స్వచ్ఛభారత్, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి జన్మదినవేడుకలు, తెలంగాణ విమోచన దినోత్సనం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్ లు గెలవాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మారుతి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గంగారాం,ప్రమోద్,శ్రీకర్, మహేష్,వినోద్,నారాయణ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version