పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

మొగుళ్లపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఏ.ఎన్.ఎం .ఆశా వర్కర్లు చేయడం జరిగినది. అదేవిధంగా ఇసి పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో 55 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ రక్త నమూనాలు తీసి ల్యాబ్ కు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ మండలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల ,సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో డ్రైడే కార్యక్రమాన్ని అనగా ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొని వాటిని డ్రై చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా, పుట్టకుండా జాగ్రత్తలు వహించాలని ,జ్వరం వచ్చినట్లయితే మా వైద సిబ్బందికి తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సి .హెచ్ .ఓ. రాజేంద్రప్రసాద్ ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,అన్ని గ్రామాల ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సీజన్ వ్యాధుల పట్ల అవగాహన. ‌

-సీజన్ వ్యాధుల పట్ల అవగాహన. ‌

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మేదరమట్ల గ్రామంలో మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో డాక్టర్ వాణి (MLHP)ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , లేనిచోఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వర్షంలో ఎక్కువగా తిరగకూడదని ,అదేవిధంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనిచో సీజన్ వ్యాధులు మలేరియా డెంగ్యూ ,చికెన్ గున్యా, డయేరియా లాంటి వ్యాధులు ప్రజలు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ యొక్క మేదరమట్లవైద్య శిబిరంలో 66 మంది కి వైద్య పరీక్షలు చేసి రెండు జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాను తీసి ల్యాబ్ పంపినారు. అలాగే గ్రామంలో దోమలు లార్వా రాకుండా తిమోఫాస్ దోమల మందను పిచ్చికారి చేయడం అయినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంషబీద, పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్న .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version