బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రేణికుంట అజయ్ (సింగర్ & డాన్స్ మాస్టర్) తండ్రి రేణికుంట పోచయ్య గత కొన్ని రోజుల క్రితం మరణించగ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్.
ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు రేణికుంట హరీష్, దుర్గయ్య, నాయకులు పుడూరి మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, పురాణం రమేష్, దాసరి శంకరయ్య, దాసరి రమేష్, రేణికుంట శ్రావణ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ..

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19,20,21 హైదరాబాద్ లో “ఓం” కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ను మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆవిష్కరించారు కమిషనర్
మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మకత పూర్తిగా మారిందని ఇటువంటి ఎక్స్పోలకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ఫోటో గ్రాఫర్స్ కు దోహదపడుతాయని తెలిపారు
యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందగలరని సూచించారు. ఫోటోగ్రఫీ రంగం ఇప్పుడు రానున్న టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని ఎక్స్పోలో కెమెరాలు, లెన్స్లు,డ్రోన్లు ప్రింటింగ్ పరికరాలు లైటింగ్ సిస్టం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు స్టూడియో మోడల్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్ స్టూడియోలు ఆసక్తిగల యువత తప్పక పాల్గొని ప్రయోజనం పొందాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి , కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్ కోశాధికారి బద్రి సతీష్ గౌరవ సలహాదారులు నక్క తిరుపతి ఎం.వి సత్యనారాయణ జాడి ముకుందాం ఉపాధ్యక్షులు నక్క పవన్. ఆర్ సుజిత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్ ప్రచార కార్యదర్శి. కె హరి కృష్ణ
కార్యదర్శి. పసుల రవి. మంచిర్యాల జిల్లా మాజీ కోశాధికారి సిపతి రవి. మొగిలి సత్యనారాయణ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి..

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
లాభాలవాట 20 వేలు చెల్లించాలి
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల విజ్ఞప్తి.

సమస్యల పరిష్కారానికి మంత్రుల హామీ

ఈరోజు ప్రజాభవన్ లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలని, లాభాల వాటా 20, వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిని ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజాభవన్ కి వచ్చి ప్రజావాణి ఇంచార్జి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారితో కలిసి కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులను తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది.
సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు 1285 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూళ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఫలితంగా ఒక్కొక్క కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు 744/- రూపాయలు నెలకు 19 344 /-రూ పాయలవు నష్టపోతున్నారని మంత్రిగారికి తెలియజేశారు. ఇతర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టిపిసి, ఓఎన్జిసి , హెచ్ పి సి ఎల్ , ఐ ఒసిఎల్ , ఏపీఎండిసి స్టీల్ ఐటిసి సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జిఒ కు అదనంగా మూడు వేల నుండి 5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేసియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఒల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవో కు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, క్యాటగిరి ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.

వేతనాల పెంపుదల సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ:

కార్మికుల వినతి పై స్పందించిన ఉపముఖ్య మంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి యొక్క వేతనాలు పెంచేందుకు,లాభాల వాటా పెంచెందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికొసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

Singareni

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి జేఏసీ నాయకత్వం సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి ని కలిసి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు కనీస వేతనాలు జి.ఒల పై చర్చించడం జరిగింది.

త్వరలో జి.ఒ లు ఇస్తాం కార్మిక శాఖా మంత్రి హామి :
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచుతామని. రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన వేతనాలను పెంచిన అనంతరం సింగరేణిలో అదనంగా చెల్లించాల్సాన వేతనాల గురించి చర్చిస్తామని. మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అనుగుణంగా వేతనాలు అమలు చేస్తామని మిగతా సమస్యలైన ఈఎస్ఐ అమలు, పెయిడ్ హాలిడేస్ , 15 లక్షల నష్టపరిహారం కేటగిరి ఆదారంగా వేతనాలు చెల్లించడం తదితర అంశాలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
కనీస వేతనాలు సలహా మండల చైర్మన్ ఐన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ కార్మికులకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డులో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని జీవోలు వచ్చేంతవరకు ప్రభుత్వంపై జిఒశకుళ అదనంగా వేతనాలు పెట్టించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తానని, జేఏసీ పోరాటాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాల్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యంలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు.

Singareni

మంత్రులు, సి & ఎండి గార్లు కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై స్పందించిన హామీలు ఇచ్చినందుకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశరు. ఇచ్చిన హామీలను అమలు చేయని , పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు , యాకూబ్ షా వలి ,కరుణాకర్ ,యాకయ్య , బాబు ,మల్లెల రామనాథం ,రామ్ సింగ్, భూక్యా రమేష్ , వేల్పుల కుమారస్వామి, అరవింద్, మహేందర్, ఒదేలు, రాజశేఖర్ , అరవింద్ , స్వామి , క్రాంతి, శరత్, రఘు, సాజిద్, అనిల్ , విజయ్, మధుసూదన్ రెడ్డి , సమ్మన్న , తిరుపతమ్మ , లక్ష్మి సారయ్య, సక్రం , రాజేష్, క్రాంతి, రాజేందర్ , రవి , రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.

అభినందనలతో.

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండలం లోని చల్లగరిగ లో నిర్వహిస్తున్న సి సి పి ఎల్ 02 క్రీడాకారుల కు పవర్ స్టార్ టీం కి జెర్సీ మరియు లోయర్ స్పాన్సర్ చేసిన వాణివిద్యా నికేతన్ కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్,ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నిరంజన్ రెడ్డి.

మృతుడికుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

వనపర్తి నేటిధాత్రి .
పెద్ద గూడెం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి ఆకస్మికంగా మరణించారు ఈ విషయం తెలియడంతో మృతుని కుటుంబ సబ్యలను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు
మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాణిక్యం, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ కొండన్న, లక్ష్మీకాంతరెడ్డి, తిరుమలయ్య, శీను, చిరంజీవి, బి రాములు, బాలస్వామి, వంశీ, బాలకృష్ణ, వెంకటయ్య, ఏం రాములు, గ్రామ అధ్యక్షులు అశోక్, చోటు తదితరులు పాల్గొన్నారు

ఈ నెల 15న తహసీల్దార్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి.

ఈ నెల 15న తహసీల్దార్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి

రాం రాంచందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు

టేకుమట్ల మండలం కుందనపెల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ వి హెచ్ పి ఎస్ అనుబంధ సంఘాల సమావేశానికి ఎంఎస్పి టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ సమావేశ ముఖ్య అతిథులు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాం రాంచదర్ మాదిగ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ నెల 15వ తేదీన టేకుమట్ల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాలని డిమాండ్ చేశారు అదే విధంగా మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు, వృద్ధులు, వితంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దారులందరు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో మాడగుల వీరయ్య వృద్ధులు, వికలాంగులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు

వానతో ఇబ్బందులు అయినవోలు ఆసుపత్రిలో…

వానొస్తే ఐలోని ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేస్తుంది.
సరైన డ్రైనేజి వ్యవస్థ లేక గేట్ల వద్దే నిలిచి ఉంటున్న వర్షపు నీరు
ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు రోగుల పాట్లు
ఎక్కడా చోటు లేనట్టు ఆసుపత్రి ఆవరణంలోనే మిషన్ భగీరధ వాటర్ ట్యాంకు
ట్యాంకు నిర్వహణ లేక ఎక్కువైన నీరు ఆసుపత్రి స్లంపులోకి వెళ్తున్న వైనం
వర్షపు నీటి ప్రవాహనికి అడ్డంగా ఉన్న విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్
ప్రమాదం జరిగేలా ఉన్నా, పట్టించుకోని తహసీల్దార్ కార్యాలయం
ఆదాయం లేని చోటు అందుకేనా అటు వైపు చూడని రాజకీయ కనికట్టు

నేటిధాత్రి ఐనవోలు :-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రంగా ఉన్న అయినవోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినవోలులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. అప్పటినుండి పేద ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల దృష్టిలో పెట్టుకొని గ్రామీణ పేదలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. దాంతో అయినవోలు మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి మెరుగైన చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావు సారథ్యంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు దాదాపు 100 మంది ఓ.పి.రోగులకు సేవలు అందిస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. మరి ఇంతలా గ్రామీణ పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ఆవరణ చిన్న వర్షానికే చెరువును తలపిస్తుంది. ఆసుపత్రిలోకి వెళ్లే రెండు మార్గాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలే జ్వరాలతో నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులు అడ్డుగా వర్షపు నీరులో నుంచి తడుస్తూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిలో నుండే వెళ్లే క్రమంలో వృద్ధులు కిందపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశము ఉందని అంతేకాకుండా జరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు మరియు మలేరియా డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగులకు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ విభాగంలో ఉంచి డాక్టర్ శ్రీనివాసరావు నుంచి చికిత్స అందిస్తున్నారు.మరి అలాంటి రోగులు కూడా ఈ వర్షం నేను నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాపించి మరిన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకనే..

అని ఆసుపత్రి నిర్మాణ సమయంలో ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కానీ, వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దాంతో చిన్న వర్షానికి ఆవరణలో వర్షపు నీరు ఎక్కడివి అక్కడే నిలిచి బురదమయం అయ్యి దుర్గంధం వెదజల్లుతుంది. గతంలో వర్షం నీరు వెళ్లేందుకు ఆసుపత్రి తూర్పు భాగంలో ప్రహరీకి ఒక గండి పెట్టగా వరద నీరు ఆ మార్గం గుండా బయటికి వెళ్ళేది. అయితే ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం, పక్కనే ఉన్న నిర్మాణాలు మరియు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇటీవల వేసిన సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడం చేత ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వరద నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ మార్గం గుండా వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేశారని, దాంతో నీరు బయటికి పోకుండా అలాగే నిలిచి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాలకుల స్వార్థం రోగులకు ప్రాణ సంకటం

గతంలో ఉన్న పాలకులు మండల కేంద్రంలో ఎక్కడా చోటు లేదు అన్నట్లుగా ఆసుపత్రి ఆవరణలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.అయితే నిర్మాణం అయితే చేపట్టారు గాని దాని నిర్వహణ సరిగా లేనందున వాటర్ ట్యాంక్ నిండి పోగా ఎక్కువైన నీరు ఆసుపత్రి మెడికల్ వేస్టేజ్ కోసం నిర్మించిన స్లంపులోకి వెళ్తుంది. అది కూడా పూర్తిగా నిండిపోయిన తర్వాత నీరు బయటికి ప్రవహించి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయి అసౌకర్యానికి కారణమవుతున్నది.

ఆసుపత్రిపై అధికార పాలక వర్గాల శీత కన్ను

నిత్యం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు నిలువ ఉండకుండా ఆవరణ అంతా మెయిన్ రోడ్డు లెవల్ మట్టి పోయించాల్సిన అవసరం ఉంది. వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ మట్టి పోయించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిండిన తర్వాత వచ్చే నీరు బయటికి వెళ్లేలా సరైన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో మరిన్ని గదులు నిర్మాణం చేపట్టి 30 పడకల ఆసుపత్రిగా అప్డేట్ అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు…

జహీరాబాద్: 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్టిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లను సంప్రదించవచ్చు.

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-13T133623.743.wav?_=1

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్..? “సీఎం” ఆదేశాలు బేకతార్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించండి. వరంగల్ మేయర్ నిధుల దుర్వినియోగంపై ఆరా తీయండి అని వేడుకుంటున్న వరంగల్ ప్రజలు

వరంగల్ మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై పూర్తి కథనం త్వరలో.. మీ”నేటిధాత్రి”లో..

“నేటిధాత్రి”, వరంగల్.

రాష్ట్రంలోని అధికారులు, నాయకులు వర్షాలు, వరదల విషయంలో అందరూ అందుబాటులో ఉండాలి అని ఒకపక్క సీఎం చెబుతుంటే, వరంగల్ మేయర్ మాత్రం స్టడీ టూర్ పేరుతో నగరాన్ని పట్టించుకోకుండా తన సొంత లాభం కోసం కార్పోరేటర్లని పట్టుకొని విహారయాత్రలకు వెళ్తుండటం వివాదాస్పదంగా మారింది.

మళ్లీ గెలవాలనే తాపత్రయంతో కార్పోరేటర్ లను మచ్చిక చేసుకోవడానికి కోసం స్టడీ టూర్ పేరుతో, ప్రజల సొమ్ముతో విహారయాత్ర?

గ్రేటర్ వరంగల్ నగర సమస్యలు గాలికి వదిలేసి “ఇండోర్ స్టడీ టూర్ కు ఏర్పాట్లు”

గ్రేటర్ వరంగల్ నగరంలో రోడ్లు బాగాలేక, అనేక సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా, వరంగల్ మున్సిపల్ పాలకవర్గం ఇండోర్ స్టడీ టూర్ పై అడుగులు వేయడం నగరవాసులు, ప్రతిపక్షాల్లో చర్చనీయాంశమైంది.

సుమారు 55మంది కార్పొరేటర్లు, మేయర్‌తో పాటు అధికారులు 25మంది కలిసి స్టడీ టూర్ పేరుతో (విహారయాత్ర) వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతుండటంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

టూర్ ఖర్చు దాదాపు 50లక్షల రూపాయల పైవరకు వెళ్తుందని వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజల సొమ్ముతో ఖర్చు చేయడం సమంజసమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకపక్క నగర ప్రజలు వరదల నుండి తేరుకోక ముందే విహార యాత్రలు ఎందుకు? మరోవైపు రాబోయే ఐదు రోజులు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు.

మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వర్షాల సమయంలో అప్రమత్తంగా నాయకులు నగరాల్లో అందుబాటులో ఉండాలని చెప్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉండాల్సిన నాయకులు స్టడీ టూర్ పేరు మీద విహారయాత్రలా అని ఆగ్రహిస్తున్న ప్రజలు

మునిసిపల్ శాఖలో నిధులు లేవంటూనే, స్టడీ టూర్లు పెట్టి, విహార యాత్రలు చేస్తూ, ప్రజలు కడుతున్న పన్నులను విహారయాత్రలకు వినియోగిస్తోంది నగర మేయర్ అంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు

నగర మేయర్ మీకిది తగునా? నగర సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నిస్తున్న సామాన్యులు..

వరదలు వచ్చి, ఇప్పటికీ తేరుకొని నగరవాసులు. మరోసారి మేయర్ పదవి కోసమేనా ఈ టూర్? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటున్న ప్రతిపక్షాలు..

నగరంలో సమస్యలు అనేకం ఉన్నాయి.. ఇప్పుడు ఇంత భారీ బృందం, టూర్ పేరుతో ఇండోర్ వెళ్ళడం, వరంగల్ ప్రజల డబ్బు వృథా చేయడమేనంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

“నగరంలోనే పరిష్కరించాల్సిన అంశాలు పరిష్కరించలేకపోతూ, ఇండోర్ స్టడీ టూర్ అవసరమా?” అనే ప్రశ్న ముందుకు వచ్చింది.

పోయిన సారి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. 10 వేల ఫోనుకు 30,000 బిల్లు పెట్టింది అని విమర్శలు వచ్చాయి? ప్రజల సొమ్ముతో సెల్ ఫోన్లు కొనివ్వడం ఏంటి అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ సెల్ ఫోన్ల వెనుక పెద్ద ఎత్తున దండుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి

టూర్ ఖర్చులు, సెల్ ఫోన్ల ఖర్చులు.. నగర “మేయర్” ఈ ఖర్చులపై ప్రజలకు మీడియా ద్వారా సమాధానం ఇవ్వాలంటూ సామాన్యుల నుండి స్వరాలు వినిపిస్తున్నాయి.

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన…

బాల్యానికి… బంధ(న)o

పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన

* అధికారుల దృష్టికి వస్తున్నవి కొన్నే..

* చిన్న వయసులో పెళ్లి వల్ల సమస్యలు

* గ్రామీణ ప్రాంతంలో ఆగని దురాచారం

* ఆడపిల్లలపై తల్లిదండ్రుల వత్తిళ్లు

* కంప్యూటర్ యుగంలోనూ సమాజం వెనక్కి

* చట్టాలు ఉన్నా మారని తల్లిదండ్రుల ఆలోచనలు

సంసారం సాగరం అన్నారు. సంద్రంలో ఈదాలంటే గజ ఈతగాళ్లకే తరం కాదు… మరి అప్పుడే ఈత నేర్చుకున్న వారిని ఆ సంద్రంలో పడేస్తే ఒడ్డుకు చేరగలరా..? బాలల పరిస్థితి అలాగే ఉంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి పేరుతో సంసారమనే సాగరంలో పడేస్తున్న తల్లిదండ్రుల తీరు ఎందరి జీవితాలకో బంధనంగా మారుతోంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కూతురుకు మూడుముళ్లు వేయిస్తే భారం తగ్గిపోతుందని కొందరు.. ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా అని పెళ్లీడు రాకున్నా పనైపోతుందని మరికొందరు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. సమాజం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా చదువును ఆపేసి బాల్య వివాహాలకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. బాల్య వివాహమంటే ముక్కుపచ్చలారని చిన్నారుల భవితకు సంకెళ్లు వేయడమే. ఇలాంటివి సమాచారం వస్తే తప్ప అధికారులు స్పందించి ఆపగలుగుతున్నారే తప్ప ఎవరికి వారు చైతన్యవంతులై వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ దిశగా అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.

మారుమూల పల్లెల్లో అధికం

జిల్లాలోని మారు మూల పల్లెల్లో బాల్య వివాహాలకు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముక్యంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నారాయణ్ ఖేడ్, జహిరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలలో అధికారులకు, స్థానికులకు తెలియకుండా గూట్టు చప్పుడు కాకుండా ఇరు వైపులా పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని పక్కింటి వారికి కూడ తెలియకుండా వేరే ప్రాంతాలలో బాల్య వివాహాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఐసిడిఎస్ అధికారులకు సమాచారం తెలిసి పై అధికారులకు తెలిపితే పెళ్లి జరిపించిన ఇరు వర్గాల వారు సదరు వ్యక్తిపై పోట్లాటకు దిగుతున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు.

rising child marriages.

బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు..

బాల్య వివాహాల వల్ల చాలా అనర్దాలు కలుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు తరువాతే శరీర అవయవాలు పూర్తిస్థాయిలో ఎదుగుతాయి. ఈ వయసుకన్నా ముందు వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు బలహీనంగా వుంటారు. వివాహితులైన బాలికలు బీపీ, రక్తహీనతకు గురవుతారు. పిండం ఎదుగుదల సరిగా ఉండదు నెలలు నిండకముందే ప్రవించే అవకాశం వుంది. కొన్నిసార్లు గర్భస్రావం. జరిగే ప్రమాదం కూడా వుంది. శరీర ఎదుగుదల సంపూర్ణంగా లేకపోవడం వల్ల సాధారణ ప్రసవం జరగడం కష్టమవుతుంది. పురిటిలోనే బిడ్డ చనిపోవడానికి అవకాశాలున్నాయి.

వీరంతా నేరస్తులే..

బాల్య వివాహాల నిషేద చట్టం- 2006 ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు, మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరం బాల్య వివాహాన్ని జరిపించేందుకు ప్రయ త్నిస్తే ఇరుపక్షాలకు చెందిన తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లి సంఘాలు వ్యక్తులు, నాయకులను నేరస్తులుగా పరిగణిస్తారు. వీరందరికీ రెండేళ్ల జైలు శిక్షగాని, లక్ష రూపాయల జరిమానాగాని విధించే అవకాశముంది. బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ క్రైమ్ గా పరిగణి స్తారు.

బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తున్నాం

అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికల కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందుల గురించి వివరిస్తున్నాం. శరీరం ఎదగకుండా వివాహం చేసుకుంటే తరువాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్యలు ఎచురవుతాయో తెలుపుతునన్నాం. జీవన నైపుణ్యాలు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అంశాలపైనా చైతన్య పరుస్తున్నాం.

rising child marriages.

ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

బాల్య వివాహలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. చట్టం ప్రకారమే వివాహం చేయాలి. బాల్య వివాహాలు చేసుకున్న వారిలో రక్తహీనత లోపం, శిశుమరణాలు వంటి సమస్యలను చూస్తున్నాం. మరి కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కుంటుంబ నిర్వహణపై కౌమరదశలో పూర్తిగా అవగాహన ఉండదు. దీని కారణంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో తల్లి దండ్రులు బాధ్యతగా వ్యవరించడం మంచిది. బాల్య వివాహాలను అధికారులే కాదు.. స్థానిక ప్రజలు, బంధువులు అడ్డుకోవాలి.

◆:- ఝరసంగం మండల వైద్యాధికారి రమ్య

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా ‘మీ సేవ’ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎస్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు.

ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమ తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో (ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.

సేవను ఎలా పొందాలంటే…

◆:- పాత సర్టిఫికెట్ నంబర్ తెలిస్తే: మీ సేవ కౌంటర్లో ఆ నంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్ పొందవచ్చు.

◆:- నంబర్ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్సైట్ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.

భూమి కొనుగోలులో మోసాలపై ఎస్సై హెచ్చరిక…

భూమి కొనుగోలులో మోసాలపై ఎస్సై హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో, ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్ శుక్రవారం ఒక ప్రకటనలో భూమి కొనుగోలులో జరుగుతున్న మోసాలపై రైతులకు హెచ్చరిక జారీ చేశారు. కొంతమంది బ్రోకర్లు తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని నమ్మించి, అసలు భూమి కాకుండా వేరే భూముల పట్టా పాస్బుక్లు చూపించి మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులలో మునిగిపోయే భూములను కూడా రోడ్డు పక్కన ఉన్న భూములుగా చిత్రీకరించి అమ్ముతున్నారని, అగ్రిమెంట్ల పేరుతో రైతుల నుండి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వివరించారు.గతంలో ఎన్నో గ్రామాలలో ఇలాంటి మోసాలపై కేసులు నమోదయ్యాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివాహ వేడుకలో పాల్గొన్న టిజిఐడిసి…

వివాహ వేడుకలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ బండ్లగూడ ఓ ఎస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాక్ పైసల్ కుమార్తె మరియు హెచ్ ఎఫ్ ఫంక్షన్ హాల్లో రియల్ ఎస్టేట్ ఆదిల్ కూతురి వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి వారితో పాటు కాంగ్రెస్ నాయకుడు అక్రమ్ హర్షద్ జమ తదితరులు ఉన్నారు,

మిలాద్-ఉన్-నబి ఊరేగింపునకు భద్రత ఏర్పాట్లు…

మిలాద్-ఉన్-నబి ఊరేగింపునకు భద్రత ఏర్పాట్లు, సహకారం కోసం అభ్యర్థన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మరియు దక్కన్ ఉలేమా మరియు మషాఖీన్ సూచనల మేరకు, హిందూ సోదర సోదరీమణుల గణేష్ మరియు సర్జన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం, సంప్రదాయం ప్రకారం, మిలాద్ ఉన్న్బ ఊరేగింపును పురాతన నగరమైన జహీరాబాద్ లోని ఈద్గా నుండి సెప్టెంబర్ 14. ఆదివారం ఉదయం 10.00 గంటలకు బయటకు తీసుకెళ్లా లని మిలాద్ ఉన్నబి ఊరేగింపును నిర్ణయించింది. మిలాదఉన్న్బ ఊరేగింపుకు మిలాద్ కమిటీ జహీరా బాద్ అధ్యక్షుడు సయ్యద్ షా మోహిబద్దిన్ ఖాద్రీ అలియాస్ బాబా సాహిబ్ అధ్యక్షత వహిస్తారు. అల్హాజీ హఫీజ్ సయ్యద్ షా అఫ్సర్ పాషా ఖాద్రీ ముహమ్మదీ ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈద్ మి లాద్ ఉన్ నబీ ఊరేగింపుకు మిలాద్ కమిటీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. కమిటీ అధికారులు ఈరోజు జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగంతో సమావేశమై వినతి పత్రం అందించారు. ర్యాలీకి అధి కారికంగా అనుమతిని పొంది, ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులను అభ్యర్థిం చారు. మెమోరాండం అందించిన వారిలో సయ్యద్ షా మొహిబుద్దీన్ ఖాద్రీ బాబా సాహెబ్, మిలాద్ కమిటీ అధ్యక్షుడు జహీరాబాద్, సయ్యద్ రిజ్వాన్ ఖాద్రీ సజ్జాదా నాషిన్, సయ్యద్ ఫర్హాన్ ఖాద్రీ బగ్దాదీ, హఫీజ్ హమీద్, హఫీజ్ ఇర్ఫాన్, అజీముద్దీన్ ఖాద్రీ, మహమ్మద్ ఇమీ, ఇతర కమిటీ అధికారులు ఉన్నారు.

పైసలు ఇయ్యకుంటే పనులు ఎట్లా చెయ్యాలే…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-13T121203.529.wav?_=2

పైసలు ఇయ్యకుంటే

పనులు ఎట్లా చెయ్యాలే…

◆:- ఏం చేయమంటారు…? ఎలా చేయమంటారు….!

◆:- ముందుకు సాగని ప్రత్యేక అధికారుల పాలన

◆:- ఒక్క ప్రత్యేక అధికారి కూడా గ్రామాలలో తిరగని వైనం

◆:- పంచాయతీ కార్యదర్శిలపై ఆర్థిక భారం

◆:- నిధులు, బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శిల పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల జగదేవపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి సొంత డబ్బులతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టిన గ్రామంలో విష జ్వరాలు విజృంభించడం ఇద్దరు అకాల మరణం చెందడం వల్ల పారిశుధ్య లోపం కారణమని చివరికి కార్యదర్శిని అధికారులు సస్పెన్షన్ చేశారు.

Panchayat Funds

 

1. చెత్త సేకరణ ట్రాక్టర్లతో తిప్పలు…..

పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ చాలా ముఖ్యం. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ తో పాటు వాటి మరమ్మతులు చేపట్టడానికి కార్యదర్శులు సొంతంగా వారానికి రూ. వేయి రూపాయల నుంచి రెండు వేల వరకు వెచ్చిస్తున్నారు. వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ పనులు తాగునీటి వసతి బోర్ల మరమ్మతులు పైప్ లైన్ లీకేజీలు తదితర పనులకు నెలకు పదివేల పైగానే ఖర్చు అవుతున్నాయి. కార్యదర్శులు ఆర్థిక భారంతో సతమతమవు తున్నారు. మొన్న ముగిసిన వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు కూడా అదనంగా భారం పడిందని కార్యదర్శులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటును కూడా అంతంత మాత్రమే. చేపట్టారు.

2. నిధులు రాక… గ్రామాల అభివృద్ధి గాలికి…

గ్రామాల్లో ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 15 ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్ సి నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా, వాణిజ్య పనులను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన తర్వాత విడుదల చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిపిల విద్యుత్ బిల్లులు చెక్కులు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నప్పటికీ జమ కావడం లేదు. ఆర్థిక భారం భరించలేక పలువురు కార్యదర్శులు వసూలైన పన్నుల డబ్బులను ఖర్చులను నిమిత్తం వినియోగిస్తూ బిల్లులు పెట్టుకుంటున్నారు. అందుబాటులో

3. బతుకమ్మకు ఏర్పాట్లు ఏట్లా…

బతుకమ్మ దసరా పండుగకు ఇక మిగిలింది పది రోజులే గ్రామాల్లో బతుకమ్మ కుంటల మరమత్తు పనులు విద్యుత్ దీపాలు అలంకరణ వంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ లో డబ్బులు లేకపోవడం ఇప్పటికే అదనంగా కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకొని వివిధ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ బతుకమ్మ దసరా ఉత్సవాలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని కార్యదర్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతున్నారు.

4. గ్రామాల్లో తిరగలేక పోతున్నాం….

ప్రజల నుండి వచ్చే సమస్యలను తీర్చలేక సొంత డబ్బుల తో, మరియు అప్పులు తెచ్చి చేస్తున్నాం. అతివృష్టి వలన కలిగిన వానలతో డ్రైడే నిర్వహించి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూస్తున్నాం. టాక్టర్ల ద్వారా పిచ్చి మొక్కలను, నీటి నిల్వలను శు భ్రం చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఈ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించగలని కోరుతున్నారు.

పీఏ చెప్పిందే ఫైనల్‌!?

`పీఏ చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లే!(నా)!?

`మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పీఏ ఇష్టారాజ్యం

`మంచిర్యాల ఎమ్మెల్యే పేరు చెడగొడుతున్న పీఏ

`ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే పనులు కానిస్తున్న పీఏ

`మంచిర్యాల నియోజకవర్గంలో పెత్తనమంతా పీఏదే!

`నియోజకవర్గ పనులన్నీ పీఏ కనుసన్నల్లోనే..

`పీఎ ఎస్‌ అంటే ఎస్‌..నో అంటే నో..

`పీఏ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.

`వద్దంటే కాంట్రాక్టులు వదులుకోవాల్సిందే.

`ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గానికి రావడం లేదు.

`ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావును కలిసేందుకు పీఏ ఎవరికీ అవకాశమివ్వడం లేదు.

`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు

`అర్హులైన కాంట్రాక్టర్లను పక్కన పెడుతున్నాడు

`అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

`లోకల్‌ల్లో క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేని వారికి టెండర్లు అప్పగిస్తున్నారు

`స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు

`అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నాడు

`అంతా నా ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నాడు

`ఇప్పటికైనా ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

`అవినీతిలో మునిగితేలుతున్న పిఏను పక్కన పెట్టకపోతే నష్టం జరిగిపోతుందంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యేలు చెబితే పనులౌతాయి. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దగ్గర పనిచేసే పిఏ చెప్పిన పనులే అవుతాయి. పిఏ చెప్పినట్లే జరుగుతాయి. ఇక్కడ పిఏ చెప్పిందే ఫైనల్‌..అలా అని ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు ఆదేశాలతో జరిగిపోతున్నాయా? అంటే అదీ లేదు. అసలు ఎమ్మెల్యేకు ఈ విషయాలే తెలియవు. అంతగా పిఏ. ఏదిచెబితే ఎమ్మెల్యే అది చెప్పినట్లే అన్నట్లుగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలోనే కాదు, నియోకవర్గంలోఎంతో పేరున్న ఎమ్మెల్యే పేరు చెడిపోవడానికి ఇలాంటి పిఏ ఒక్కరుంటే చాలు అని పార్టీ నాయకులు , ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నమ్మారు. పిఏ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే మంచిర్యాలలో అందరూ అనుకుంటున్న మాట. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకుఎంతో మంచి పేరుంది. కాని ఏం లాభం. ఆయన పెట్టుకున్న పిఏ వల్ల తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. నాయకులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తన వద్ద పని చేసే పిఏను అంతగా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గ నాయకులు కూడా ఎవరూ పిఏ మీద పిర్యాధు చేయడానికి సాహసించడం లేదు. పైగా పిఏతో సఖ్యతగా వుంటే చాలనుకుంటున్నారు. కాని ప్రజలకు మేలు చేయాలన్నా,సేవ చేయాలన్నా, అభివృద్ది పనుల చేపట్టాలన్నా తామే ముఖ్యమన్న సంగతి నాయకులు కూడా మర్చిపోతున్నారు. పిఏ చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఒక రకంగా వారికి కూడా తప్పడం లేదు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది నాయకులైన వాళ్లు కూడా పిఏ. మన్ననలు పొందాలనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పార్టీ నాయకులకు దౌర్భాగ్యమైన పరిస్తితే. కాని ఏం లాభం? నోరు తెరిచి ప్రశ్నించలేరు. తమ ముందు పిఏ ఎంత అని అనుకోలేరు. ఎమ్మెల్యేకు చెప్పిన ఆయన పట్టించుకుంటాడో లేదో అన్న అనుమానం. ఎమ్మెల్యేకు ఎప్పుడూ సమాచారమందించే పిఏతో పెట్టుకొని పేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేకు దూరం కావడమెందుకు? అనే ధోరణిలోనే నాయకులు సాగుతున్నారు. దాంతో ఆ పిఏ ఆడిరది ఆట.. పాడిరది పాటగా మారిపోయింది. ఎలాంటి విషయాల్లోనైనా సరే పిఏ. ఎస్‌ అంటే ఎస్‌. నో.అంటే నో..అంతే! అంతకు మించి దారి లేదు. పరిష్కారం అంతకాన్న లేదు. అంతగా పిఏ ఏలుబడి సాగుతోంది. నిజమే పిఏ పలుకుబడి మంచి పనుల విషయంలోనో, ప్రజలకు మేలు జరిగే విషయంలో సాగితే బాగుంటుంది. కాని తన ఇష్టానుసారం పిఏ సాగిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. నాయకులే ఎమ్మెల్యే పిఏ ముందు పెద్దగా నోరు విప్పకపోవడంతో అధికారులు కూడా పిఏకు వంత పాడుతున్నారు. పిఏ చెప్పిందే చేస్తున్నారు. పిఏ ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇలా అధికారులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు? ఆఖరుకు కోర్టు తీర్పులను కూడా పక్కన పెడుతున్నారు. అభివృద్ది పనులను చేపట్టే కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా అదికార గణం నుంచి మొదలు, నియోకవర్గ, ముస్సిపల్‌ అదికారులంతా పిఏ చెప్పినట్లు వినాలి. పిఏ చెప్పిన వారికే కాంట్రాక్టులివ్వాలి. అర్హత లేని వాళ్లైనా సరే పిఏ చెప్పి వారికే టెండర్లు అప్పగించారు. ఇలాంటి ఏ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం వుండడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. తమను ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా చేస్తున్నాడని వాపోతున్నారు. నియజక వర్గ పెత్తనమంతా తన గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీస్తున్నాడు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు అనార్యో కారణంగా నియోజకవర్గానికి రావడం లేదు. అది అలుసుగా తీసుకొని పిఏ రెచ్చిపోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎమ్మెల్యేను కలవాలని ఎంత ప్రయత్నించినా పిఏ. ఆ అవకాశం కల్పించడం లేదు. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు వెళ్లినా అప్పాయింటు మెంటు దొరక్కుండా పిఏ చూసుకుంటున్నాడు. దాంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లలేక, పిఏ చేస్తున్న పనులు భరించలేక కాంట్రాక్టర్లు సతమతమౌతున్నారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అదికారులను గుప్పిట్లో పెట్టుకొని స్ధానిక కాంట్రాక్టర్లను పిఏ వేధిస్తున్నాడని తెలుస్తోంది. అర్హులైన , లోకల్‌ కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. నియోజకవర్గ పరిదిలో ఏ పనులు చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ వుండాలి. అది స్దానికంగా వుండాలి. కనీసం నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వుండాలి. ఇది నిబంధనలు చెబుతున్నాయి. స్ధానికంగా వున్న కాంట్రాక్టర్లందరికీ మంచిర్యాలలోనే క్యాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్నాయి. కాని వారికి మాత్రం కాంట్రాక్టులు అందడం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ధర్డ్‌ పార్టీలకే టెండర్లు, కాంట్రాక్టులు వెళ్తున్నాయి. అలా అదికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పిఏ తన ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. స్ధానికంగా క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు నాణ్యతను కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. స్ధానికంగానే క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్న కాంట్రాక్టర్లు పనికిరాకుండాపోతున్నారు. కాంట్రాక్టులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టులపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయినా అదికారులు ఆ తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేసి మరీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పిఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పిఏ తన స్వార్ధం కోసం అదికారులను గుప్పిట్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావుకున్న పేరును చెడగొడుతున్నారు. అంతా నా ఇష్టమన్న రీతిలో పిఏ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. పిఏ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావుకు తెలిసే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే మద్దతు లేకుండానే పిఏ ఇంత ఇష్టాను సారం వ్యవహరిస్తారా? అని అనుమానపడే పరిస్ధితి వస్తుంది. ఇంకా మూడేళ్ల కాలం వుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు సేవ చేయాల్సి వుంది. ఇలాంటి సమయంలో పిఏ ఆగడాలను ఎమ్మెల్యే ఉపేక్షిస్తూపోతే ప్రజల్లో నమ్మకం పోయే పరిసి ్దతి రావొచ్చు. ప్రేమ్‌సాగర్‌రావు మంచితనం చాలా మందికి తెలిసినా, కొంత మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల నాటికి పరిస్ధితి చేయిదాటి పోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా, రాకపోయినా ఇప్పటికైనా మేలుకుంటే ఎంతోమంచిదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత ఇప్పటి వరకు లేదు. కాని పిఏ వల్ల ఆ వ్యతిరేకత మొదలౌతే చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లౌవుతుంది. పిఏల వ్యవహార శైలి వల్ల గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అలాంటి పరిస్దితి రాకుండా వుండాలంటే వెంటనే ఎమ్మెల్యే పరిస్ధితులను చక్కదిద్దుకుంటేనే రాజకీయ భవిష్యత్తు వుంటుందని ప్రేమ్‌సాగర్‌రావు శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ డిమాండ్లు….

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే…

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే
ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే

ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి
జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version