నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం . రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండల కేంద్రంలో బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులుసీనియర్ నాయకులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య అనారోగ్య పరిస్థితులతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలకు హాజరై పాడే మోసినారు అనంతరం మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ముంజాల రవీందర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరి మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య మాజీ జెడ్పిటిసి పులి తిరపతి రెడ్డి అంబాల శీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు గుండెబోయిన కొమురయ్య కుమారులు శివకోటి,హరి ప్రసాద్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా కూర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సభ్యులు రాయుడి రవీందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, దేవుడు సదానందం, గంప రాజేశ్వర్, రావుల సతీష్, బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్,11వ వార్డు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణంలో ఒకటో వార్డులో బిజెపి నాయకులు మార్నింగ్ వాక్ లో అక్కడి ప్రజలను కలువగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు.హైదరాబాద్ రోడ్డు నుంచి బచ్పన్ స్కూల్ వెళ్లే దారిలో గంగాధర్ ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని 15 సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం అయినప్పటికీ మురికి కాలువల నిర్మాణం కాలేదు తక్షణమే పనులు నిర్మించాలని కోరారు.
ఒకటవ వార్డు బచ్పన్ స్కూల్ ముందు ఉన్న ఇండ్ల మధ్యలోకి వర్షపు నీరు మురికి నీరు నిలుచుచున్నవి అట్టి నీరుని బయటకు పోకుండా పక్క ల్యాండ్ వాళ్లు ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది అందువలన వర్షపు నీరు మురికి నీరు అక్కడికి చేరుకొని చెరువుల వలే తలపిస్తుంది ఇండ్లలోకి వర్షపు నీరు మురికి నీరు పాములు ఇతరతర జీవరాసులు ఇండ్లలోకి రావడం జరుగుతుంది తద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఒకటో వార్డు లో గల వాసవి రైస్ మిల్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు కలవు అట్టి పైపు లు వృధాగా ఉన్నందున తక్షణమే అక్కడ డ్రైనేజీ పనులు ప్రారంభించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు కల్వకుర్తి మున్సిపల్ ఏఈఈ షబ్బీర్ అహ్మద్ గారికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్, సీనియర్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి,నరెoడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ కాలనీ వాసులు పాల్గొన్నారు.
గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి
హర్షం ప్రకటించిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో పెద్దం చెరువు వద్ద శిథిలావస్థలోనున్న గురిజాల నుండి నర్సంపేట పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో లోలెవల్ వంతెన స్థానంలో 3.20 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.కాగా గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు,ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దం చెరువు లోలెవల్ వంతెన ప్రమాదకర పరిస్థితులలో నీటి ఉధృతితో రాక పోకలు నిలిచిపోయి ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యే దొంతి శంకుస్థాపనతో ఆ కష్టాలు తీరానున్నాయని తెలిపారు. గురిజాల నుండి కోనాపురం వెళ్ళుటకు గ్రామ ప్రజలు, రైతులు రోడ్డు లేక అవస్థలు పడేవారని దీంతో మహేశ్వరం క్రాస్ నుండి గురిజాల, ఎంపీటీసీ రోడ్ మీదుగా కోనాపురం వెళ్ళుటకు 3.10 కోట్లతో బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయడం వారు సంతోషం వెలిబుచ్చారు. గురిజాల గ్రామంలో సీసీ రోడ్లు కాక మిగిలిపోయిన వీధులన్నీ వర్షా కాలంలో బురదమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ అందుకు గాను సీసీ రోడ్లు వేయించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వేణు,రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు.
భారత సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ఆధ్వర్యం లో భారత ప్రభుత్వ సంస్థ అలింకో, చే చిత్తూరు పివి కె,ఎన్, గ్రౌండ్ నందు గురువారం విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు హాజరయ్యారు అనంతరం విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాల వారి చేతుల మీదుగాపంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు, ఈ కార్యక్రమము లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఒద్దుల రాంరెడ్డి ఇటివల కాలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించిగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకి మనోధైర్తం కల్పించిన బిఅర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యఅనుచరులు కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహార్ .ఈ కార్యక్రమంలో కెటిఆర్ సేన రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శిలం స్వామి, భూపాలపల్లి జిల్లా కెటిఆర్ సేన అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి ,వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ ,మహబుబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్ ,నియొజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు జిల్లా ప్రదాన కార్యదర్శి ఆశోక్ ,సొషల్ మిడియా ఇంచార్జ్ దేవేందర్ పటెల్ ,మండల అధ్యక్షులు తిరపతి,రాకేశ్ ,దిలీప్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ ల పంపిణీ.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండలో గురువారం మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్డం చేసేందుకై తన వంతు సహకారంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఉచిత ల్యాప్టాప్ ల పంపిణీ కార్యక్రమం..తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (Girls) పాఠశాలకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK) ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా(ఎనిమిది)ల్యాప్టాప్ ల అందజేసిన చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ…మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సన్నద్ధం కావాలని,వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి,వారిలోని ప్రతిభను ప్రోత్సహించి,వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాడానికి తన వంతు ప్రయత్నంగా ల్యాప్టాప్ లను అందజేస్తున్నాని,డిజిటల్ యుగంలో విద్యార్థులు మరింత సమగ్రమైన,మెరుగైన విద్యను పొందడానికి డిజిటల్& కంప్యూటర్ తరగతులు సహాయపడుతాయని,విద్యార్థులు కంప్యూటర్ కోడింగ్ లాంటి తదితర కొత్త విషయాలపై పాఠశాల దశలోనే అవగాహన కల్పించాలని,కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగాలని తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…మా పాఠశాలకు ఎలాంటి సహాయం అడిగిన వెంటనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి, సహాయ సహకారాలు అందిస్తున్నారని,గతంలో విద్యార్తులకు వాష్ రూమ్స్ విషయంపై స్పందించి వెంటనే ఒక లక్ష రూపాయలతో వాటికి మరమత్తులు చేయించారని,అలాగే ఈరోజు మా విద్యార్థులు అడిగిన వెంటనే ఉచితంగా ల్యాప్టాప్ లను అందించి అన్ని విధాలుగా మా పాఠశాలను సహాయ,సహకారాలు అందిస్తూ మా విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని,వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు…ఈ కార్యక్రమంలో…పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ రత్నం, ఉపాధ్యాయులు మురళితో, సీనియర్ నాయకులు దశరథ్ నాయక్,లాలూ నాయక్, నర్సింగ్,రమేష్,రఘు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కొండల్, యాదవ్,రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం రెండవ వార్డులోని రాజీవ్ గాంధీ కాలని, గొల్లవాని గుంట, లీలామహల్ సమీపంలోని మధురానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి.సి.రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, తవ్వి అలాగే వదిలేసిన రోడ్లు పూడ్చాలని కోరారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన పిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు సరైన సమయంలో సరఫరా చేయడం వంటివి అక్కడిక్కడే పరిష్కరించాలని అన్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తిరిగి పిర్యాదులు రాకుండా మరమ్మత్తులు చేయాలని అన్నారు. అలాగే ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,ఏసిపి బాలాజి , డి.ఈ.లు రమణ, శిల్పా, సర్వేయర్ కోటేశ్వర రావు,శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.
అంతిమ యాత్రలో పాల్గొన్న నాగుర్ల మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో గురువారం గుండెపోటుతో మరణించిన గండు శ్రీహరి గౌడ్ (85) అంతిమ యాత్రలో తెలంగాణ రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న ) పాల్గొన్నారు. మృతుని కుమారుడు గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు గండు శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. నాగుర్ల వెంట చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి తదితరులున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే సభను విజయవంతం చేయాలి.
గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .
జులై 4న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ దేశంలోనే తొలిసారిగా గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే నేరుగా ముఖాముఖి సమావేశం కానున్నారని మొగుళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సభను విజయవంతం చేయాలని తెలిపారు ఇదే మొదటి ప్రయత్నంగా ఈ ఈ వినూత కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రాన్నే తొలి గౌరవం దక్కినట్లు అని ఆయన తెలిపారు ఈ తరహా కార్యక్రమాలను అనంతరం దేశవ్యాప్తంగా విస్తారించనున్నట్లు వివరించారు ఇంతటి ముఖ్యమైన సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని తెలిపారు ముఖ్యంగా గ్రామ శాఖ అధ్యక్షులు మొగలపల్లి మండల పరిధిలోని గ్రామ శాఖ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు సమన్యాయంతో సభకు హాజరై విజయవంతం చేయాలని ఖర్గేతో ప్రత్యక్షంగా మాట్లాడే అరుదైన అవకాశం ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు
రైతుల రక్షణ కొరకు పంటల బీమా అమలు చేసి వారి భద్రతకు తోడ్పడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.గురువారం రోజున రైతులతో కలిసి పరకాల ఆర్డిఓ కే. నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమైన ఇంతవరకు పంటల బీమా అమలు లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులు అప్పులు తీర్చలేక,యజమానికి కౌలు చెల్లించలేక,తదుపరి పంటలకు పెట్టుబడి లేకుండా, కుటుంబ ఖర్చులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఒకసారి పంట నష్టపోయిన రైతు తిరిగి స్థిర పడటానికి మూడు నాలుగు వంటకాలాల సమయం పడుతుందని,అలాంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతుకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణమాఫీ,రైతు భరోసా పథకాలతో రైతులకు మంచి సంకేతాలు పంపిందని,అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరి పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు,రవీందర్,రఘు,కానూరు వీరస్వామి,రైతులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 3న జరుపుకుంటారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్, యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆయన మాట్లాడుతూ..ఈ రోజున, వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషిని, ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఆ మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత మెకానిక్ల పాత్రను గుర్తించడం. వాహనాలు,యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి,అభినందించడానికి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుందని మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమాజానికి సేవనందించే విధంగా మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయిని మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేముని ఈరోజు మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుదాంఆని మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యం పల్లి భాస్కర్, మర్రి రాము,మెరుగు కిషన్,కస్తూరి సత్యం, కుమార్,ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్,సురేష్, మున్నా,ఓదెలు,శ్రీను, జగదీష్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.
బిజెపి పార్టీ బీసీలను మోసం చేసిందని ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య ఆరోపణలు చేయడం బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయడమేనని అటువంటి వ్యాఖ్యలు చేయడం వెంటనే మానుకోవాలని బిజెపి మహాదేపూర్ సీనియర్ నాయకుడు కన్నెబోయిన ఐలయ్య యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
మహాదేవపూర్ మండల కేంద్రంలో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ…. ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య బిజెపి పార్టీ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిజెపి పార్టీ అన్ని కుల,మత, సంఘాలను కలుపుకుపోయే పార్టీగా రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల అవతరించిందని అన్నారు. బిజెపి పార్టీపై బూరదల్లే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీయే బిజెపి పార్టీ అని, ఒక బీసీ బిడ్డను దేశానికే ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత బిజెపి పార్టీ కే దక్కుతుందని గుర్తు చేశారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ కాదా….? అని ప్రశ్నించారు. పార్టీ ఎక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలను చేస్తామని హామీ ఇవ్వలేదని అన్నారు. సంఘాల పేరుతో పబ్బం గడుపుకునే కొంతమంది నాయకులు బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ఆలోచనలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. మీరు పని చేసే పార్టీలో ఎంత మంది బీసీ బిడ్డలు గ్రామస్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వారికి అవకాశం కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, కనీసం మండలి చైర్మన్ గానైనా బీసీలకు అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. బిజెపి పార్టీకి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్ర రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు మందమర్రి పట్టణంలో ని 24 వ వార్డు విలేజ్ మందమర్రి లోని ఆటో డ్రైవర్ బైర్నేని పొషం గారి తల్లి గారు చనిపోయి ఈ రోజు దశ దిన కర్మ లకు హాజరై 50 కిలోల బియ్యం 2016/- రెండు వేల పదహారు రూపాయలను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మొయ్య రాంబాబు ,ఆటో డ్రైవర్ల సమక్షంలో వారి కుటుంబనికి అందజేసిన ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గారు
ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఓ ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కందుకూరి తిరుపతి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి, తన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన నేత్రాలు దానం చేసిన కందుకూరి తిరుపతి.
*గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..
*అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ,
అగ్నిమాపక అధికారులు , సిబ్బందికి అభినందనలు.
నగర పాలక సంస్థ మేయర్ డా శిరీష..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:
తిరుపతి గోవిందరాజల దేవాలయ ప్రాంతంలోని సన్నిది వీధిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రమాదం చోటు చేసుకున్న సన్నిది ప్రాంతాన్ని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా శిరీష సందర్శించారునగర పాలక సంస్థ విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారి శ్రీనివాస రావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును మరియు సన్నిది వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు.షాపు నిర్వాహకులు అగ్నిప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలని విపత్తు నివారణ అగ్ని మాపక శాఖకు ఆదేశం.
రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ అగ్ని మాపక అధికారులను, సిబ్బందిని మేయర్ అభినందించారు.అదే సమయంలో గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తిరుపతి నగరం శ్రీవారి భక్తులు సందర్శించే ప్రాంతం కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. షాపు నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించాలని అదే సమయంలో నిబంధనలు పాటించే విషయంలో రాజీ ధోరణి ఉండకూడదన్నారు.అగ్ని ప్రమాదానికి గురి అయిన షాపుతో సహా మొత్తం పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని నగర పాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు.
విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్
కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి జిల్లా విపత్తును ఎదుర్కొనే చర్యలపై అధికారులతో సమీక్షించిన ఎన్డీఎంఏ అధికారుల బృందం
వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:*
విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ , అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్లు వసీం ఇక్బాల్, డాక్టర్ గౌతమ్ కృష్ణా, సంద్రా, అనుపమా, గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు.మాక్ డ్రిల్స్ నిర్వహణ సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలపై కూడా చర్చించారు. వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు.ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్ పై అధికారులతో పాటు ప్రజలకు ముఖ్యంగా గ్రామస్తులలో అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ ప్రణాళికలతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి మరియు జాతీయ విపత్తు తగ్గించే నిధిని కూడా అందిస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ
జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, విపత్తుల సమయంలో చేపట్టే . చర్యలు, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వరదల వల్ల ఆకేరు వాగు నీటి వరద వల్ల 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు నీటిలో దిగ్బంధం కాగా స్థానికుల సహకారంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బయటికి రావడం జరిగిందన్నారు. గోదావరి కృష్ణ నదుల మధ్యలో వరంగల్ జిల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున వరద ముప్పులేదని, అధిక వర్షాలు కురవడం వల్ల వరద సంభవించే అవకాశం ఉందని, అందుకు నగరంలోని ప్రధాన నాలాలను డీసిల్టేషన్ చేయడం జరిగిందన్నారు. గతంలో రాజులు నిర్మించిన గొలుసు చెట్టు చెరువులలో వర్షపు నీరు చేరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరం ముంపు గురి కాకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలగించడం జరుగుతున్నదని అన్నారు. వర్షపు నీరు చేరుకొనుటకు గాను చెరువులలో పూడికలు తీయడం జరిగిందన్నారు. ఇటీవల భూకంపం సంభవించినప్పుడు జిల్లాలో రిచేట్ స్కేల్ పై 3.5 నమోదైందని, ప్రభుత్వం ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న 10 వేల ఇందిరమ్మ గృహాలకు భూకంపం వల్ల నష్టం వాటిల్లకుండా సాంకేతికత అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు సహాయం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా ఆపద మిత్ర కింద 179 వాలంటీర్లను శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈసారి జిల్లాలో ముందస్తుగా జూన్ నుంచి వర్షాలు కురుస్తున్నందున అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని, విపత్తులు రాకముందే ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాస్థాయిలో అన్ని మండలాలు, గ్రామస్థాయిలో కమిటీలను తహసీల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేశామని, అదనపు కలెక్టర్ను విపత్తుల జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని గ్రా మాలపై ప్రత్యేక దృష్టి సారించామని. శిథిలావస్థలో ఉన్న గృహాలను, పాఠశాలలను ముందస్తుగానే గుర్తించి అవరమైతే వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని కలెక్టర్ అన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లో టామ్ టామ్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. పీహెచ్సీలలో తగినంత ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్ల భవనాల శాఖ ద్వారా బ్రిడ్జిలు, కల్వర్ట్ లు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Collector Dr. Satya
జిడబ్ల్యుఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ
బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తును తక్షణమే ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 27 మంది, సిబ్బంది వాహనాలు బోట్లు రోప్స్ తదితర అన్ని ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రేటర్ వరంగల్లో 170 చెరువులు ఉన్నాయని, 5 ప్రధాన నాలాలను డిసిల్టేషన్ చేయడం జరిగిందని, ప్రభుత్వ నిధులచే నాలాలను అభివృద్ధి, బలోపేతం చేయడం వల్ల నగరంలో ముంపు తగ్గిందన్నారు. తక్షణ సహాయార్ధం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రెస్పాన్స్ టీమ్లను చేయడం జరిగిందన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి, నోటీసులు అందించి, గృహాలను తొలగించడం జరుగుతుందన్నారు. 2023లో వరదలు సంభవించినప్పుడు 2200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఉచితంగా భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.అగ్నిమాపక, పంచాయతీ, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక శాఖ, పోలీస్, వ్యవసాయ శాఖల ద్వారా వరదలు సంభవించినప్పుడు చేపట్టే చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అందుగులపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు పంపిణీ చేసిన బిజెపి నాయకులు…… మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు బిజెపి రాష్ట్ర యువ నాయకులు దారా రవి సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు నోటుబుక్కులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేష్ .
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగానే బిజెపి నాయకులు రవి సాగర్ రావు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు నోటుబుక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ మండలాధ్యక్షుడు జనార్ధన్ ఇన్చార్జ్ సంజీవరావు కన్వీనర్ అక్కల రమేష్ పట్టణ అధ్యక్షుడు నరేష్ సంతు రామ్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
చిన్నారుల ఎదుగుదల, గర్భిణి,బాలింతల మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ గొల్లపల్లి రాణి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు, అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో పాటు విద్య ను బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు,బాలింతలు,పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని గర్భిణీలు బాలింతలకు తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ యం.యశోద, జి.లలిత ఆయా నాగమ్మ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.