తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రం-చాడ…

తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రం-చాడ

కరీంనగర్, నేటిధాత్రి:

 

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా తన జీవితాంతం తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రమని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సిపిఐ మానకొండూర్ మండల మాజీ కార్యదర్శి శ్రీరాముల రామచంద్రం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పరామర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు శ్రీరాముల రామచంద్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి ఆయన కుటుంబానికి తీరని లోటని, గత నలభై సంవత్సరాలకు పైగా సిపిఐ పార్టీలో గ్రామ స్థాయి కార్యదర్శిగా, మండల కార్యదర్శిగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారని, మండలంలో అనేక గ్రామాల్లో పార్టీ విస్తరణ కోసం పనిచేశారని, ప్రజా సంఘాలను ఏర్పాటు చేశారని, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కూడా కొంత కాలం పనిచేశాడని, ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారని, అనేక ప్రజా, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేశాడని, కొండపల్కల గ్రామంలో పార్టీ కార్యాలయం నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని కొనియాడారు. డెబ్బై ఐదు ఏళ్ల వయస్సులో కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాడని, నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉండేవాడని, సీనియర్ నాయకులుగా మండలంలో ఆయన పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారని, తన తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన క్రమ శిక్షణ కలిగిన నాయకుడని అలాంటి నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన మృతి పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటని పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, గ్రామ శాఖ కార్యదర్శి ఎరబోయిన సదయ్య, వార్డు సభ్యులు శాతరాజు సంపత్, నాయకులు భద్రయ్య, పొచమల్లు, రమేష్, నాంపల్లి, కొమురయ్య, రాజు, తదితరులున్నారు.

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో జాతను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.
సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ కారల్ మార్క్స్ కాలనీలో జిల్లా జాతను సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాలు 302 కిలోమీటర్ల వరకు ఈ జాత తిరుగుతుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంటులో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను ఆదరించి జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా చేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఈ చట్టం తెచ్చి అమలుపరచటం అన్యాయం. దీని ఫలితంగా హైలాండ్ ఫైర్ సిస్టం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కార్మికుల కనీస వేతనాలు పడిపోవడం, 12 గంటల పని విధానం అమలు చేయటం, లేబర్ అధికారులకు అధికారాలు లేకుండా చేయటం, యజమానులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వటం, కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి.
2005లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ మార్చి బీబీ రాంజీ చట్టం తెచ్చారు. దీనితో వ్యవసాయ కూలీలకు నష్టం. గతంలో 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇస్తే, రాష్ట్రాలు పది శాతం నిధులు చెల్లించేది, కానీ మారిన చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని చట్టంలో ఉంది. ఇప్పటికే జీఎస్టీ, శేషు ల పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులను వసూలు చేసుకుని పనులన్నీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు ఇవ్వకుండా బలహీన పరుస్తుంది. 40 శాతం నిధులు ఉపాధి హామీకి పెట్టాలంటే రాష్ట్రాలు పెట్టలేని పరిస్థితి దీనితో ఉపాధి హామీ పథకం నిర్విర్యమై నీరు గారి పోతుంది. యధావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈనెల 19 తారీఖున జిల్లా కేంద్రంలో మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.
ఈ జీబు జాతకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు శ్రీకాంత్, నాయకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బి క్రాంతి, ఎం రాజేందర్, సిహెచ్ రవికుమార్, మహేందర్, కే రవికుమార్, జాడి కిష్టయ్య, పగిడి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ వ్యతిరేక ఆందోళన…..

జహీరాబాద్ లో ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version