విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ డిమాండ్లు….

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ షరీఫ్ లు అన్నారు. జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో రాష్ట్ర స్థాయిలో 1446 ర్యాంక్ సాధించిన బానోత్ సోమన్న, డైట్ సెట్ లో ప్రతిభ కనబరిచిన పరమేశ్వరి ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీను, కవిరాజు, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, యాకన్న, సతీష్, అనిల్ కుమార్, సుభాష్ అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version