బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు….

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.

మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…

బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,

ఆర్టీసీ డ్రైవర్ మొగిలికి దొమ్మటి సాంబయ్య నివాళులు

మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి

 

పరకాల,నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి…

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి .

 

తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంలతో కలిసి హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేవిధంగా మరణించిన ఓటర్ల జాబితాను విచారణ చేసి తొలగిం చాలని కోరారు ఎపిక్ కార్డ్స్, బీఎల్ వో ఐడి కార్డ్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి…

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి

అఖిలపక్ష ఐక్యవేదిక. మద్దతు

వనపర్తి నేటిదాత్రి .

 

బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతు వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్య వేదిక మద్దతు ఇస్తామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా “సతీష్ యాదవ్.
బి సి బందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతతో తెలుపుతూ వారిని ఆహ్వానిస్తూ వారితో బంద్ లో పాల్గొoటా మని తెలిపారు చేయాలో తెలుసుకుంటూ వారిని ముందు పెట్టి మేము బందును ప్రశాంతంగా విజయవంతం చేయాలని.పిలుపునిచ్చారు,
ఈసమావేశంలో సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా యాదయ్య , టిడిపి నాయకులు కొత్తగొళ్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్….

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో తాము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లలో కట్టిన ఇండ్లను గత వారం రోజుల నుండి కొంతమంది వ్యక్తులు బుల్డోజర్ల తో కూల్చి వేస్తున్నారని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై వినయ్ కుమార్ ఫిర్యాదు చేసిన ఐడిఎస్ఎంటి బాధితులు..ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న జహీరాబాద్ శాసనసభ్యులు…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న జహీరాబాద్ శాసనసభ్యులు

◆: – కొన్నిటి మాణిక్ రావు

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ప్రచారరం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు..

గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు…

*గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు.

*మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్16

 

గూగుల్ రాకతో ఎఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతొందని దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు చేకూరనున్నాయని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని వివరిస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిశాఖపట్నంలో ఒక గిగావాట్ (
జి డెబ్యూ) హైపర్స్కల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు,
కూటమి ప్రభుత్వం చొరవతో, వైజాగ్లో ఏర్పడుతున్న ఏఐ సిటీకి దాదాపు 10 బిలియన్ లు పెట్టుబడి పెట్టనుందన్నారు,
ఆసియాలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా విశాఖపట్నంలో ఈ సెంటర్ నిలవనుందన్నారు,
రాష్ట్రం ఒక స్వర్గధామంగా మారుతోంది. వైజాగ్ లో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని డిజిటల్ పవర్ హౌస్ మార్చే దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం,ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టించనుందని వివరించారు,
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు,
మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందనిసీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖకు వచ్చేసిందన్నారు,
దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం కానుందన్నారు

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి…

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి

బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ…

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ

చిట్యాల,నేటి ధాత్రి :

 

సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుతూ తన యొక్క వ్యక్తిగత జీవన విధానమును మార్చుకోవాలని మానవ వనరుల కేంద్రం చిట్యాల నందు వాలంటరీ టీచర్స్ నకు ఉల్లాస్ పుస్తకాల పంపిణీ మండల విద్యాశాఖాధికారి కోడెపాక రఘుపతి పంపిణీ చేసినారు.
మండల విద్యాశాఖాధికారి రఘుపతి మాట్లాడుతూ చదువు అనేది సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని ముఖ్యంగా మహిళల అక్షరాస్యతను పెంచవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని చదువుకున్న మహిళ తన ఇంటిని పిల్లలను సక్రమమైన మార్గంలో పయనింప చేయడానికి కృషి చేస్తుందని అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని అదేవిధంగా అందరూ చదువుతూ అందరూ ఎదగాలని వారు కోరారు .చిట్యాల మండలంలో వాలంటరీ టీచర్స్ 279. లర్నర్స్ 2790 మందిని గుర్తించామని వాలంటరీ టీచర్స్ అందరూ కూడా లర్నర్స్ ను చదువు వైపునకు మళ్ళించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉల్లాస్ కార్యక్రమమును దిగ్వి జయం చేయుటకు ప్రతి ఒక్కరు దీనినీ యజ్ఞములా భావించి పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయం గుర్రపు రాజేందర్ ఉల్లాస్ కార్యక్రమ ఇన్చార్జ్ బోనగిరి తిరుపతి వాలంటరీ టీచర్స్  పాల్గొన్నారు.

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు…

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊరా నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసరం జయశంకర్ జిల్లా లోని ఇసుక క్వారీ ల వద్ద ఇసుక లోడింగ్ కీ వెళ్లిన లారీలా దగ్గర అదనముగా డబ్బులు వసూలు చేస్తున్నారు టి ఎం ఎస్ డిసి వారు 14 టైర్ల లారీ కీ 32 టన్నులకు డబ్బులు తీసుకోని లోడింగ్ దగ్గర మాత్రం 30 టన్నులు మాత్రమే ఇసుక నింపుతున్నారు దీని వలన నేరుగా వినియోగ దారుని మీద సుమారుగా ఒక్క లారీ కీ పది వేళ రూపాయలు అధిక భారం పడుతుంది అలాగే గత ప్రభుత్వం జయశంకర్ జిల్లా ను స్థానిక జిల్లాగా గుర్తించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్పెషల్ అలాట్మెంట్ చేసేది కానీ ఇప్పటి ప్రభుత్వం స్థానికతను తుంగలో తొక్కి స్థానిక వినియోగదారుల మీద స్థానిక లారీ ఓనర్ల మీద ఉక్కు పాదం మోపుతుంది కావున పై అంశాలపై టీజీఎండిసి ఎండీ తో చర్చించి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలి అని స్థానిక జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి ఎర్రబెల్ల

ప్రాణదాత సలాం నీకు…..

ప్రాణదాత సలాం నీకు…..!

శ్రీకాంత్ అవయవదానం మహోన్నతమైనది. కుమారుడి అవయవాలు దానం చేసిన. భార్య సారిక. తల్లిదండ్రులు. నాగమణి శివరాజ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాయికోడ్ మండలం, కుసునూర్ గ్రామ వాస్తవ్యులు మద్నూర్ రాచప్ప గారి మనుమడు తనయుడు శివరాజ్ నాగమణి గార్ల దంపతుల పెద్ద కొడుకు కీ.శే.శ్రీ. శ్రీకాంత్ హైద్రాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగం చేసేవాడు. దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల గ్రామ జన్మస్థలంకు వచ్చారు. దసరా పండుగ ముంగించుకొని, అతడు ఈనేల 5న 38A హైద్రాబాద్ వెళ్ళుతుండగా శివంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తు తాను నడుపుతున్న ద్విచక్ర వాహనానికి వెనకాల నుంచి వస్తున్న
ద్విచక్ర వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టడంతో, ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయలు కావడంతో, హుటాహుటిన హైద్రాబాద్ ప్రైవేట్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో, జాయిన్ చేశారు.

 

తొమ్మిది రోజులు ఐసీయులో అబ్జర్వేషన్ ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. తొమ్మిది రోజులు కూడా డాక్టర్లు ఎంతో శ్రమించి ట్రీట్మెంట్ చేసిన శరీరంలో ఎలాంటి చలనం మార్పు రాకపోవడంతో, సోమవారం కిమ్స్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు అందించిన ప్రయోజనం ఉండదని వైద్యులు. భార్య సారికకు మరియు
తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి గార్లకు తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు, శ్రీకాంత్ అవయవాలు అన్ని పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు మరియు భార్య అంగీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతో మందికి పునర్జన్మనిస్తోంది. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం గ్రీన్ చానెల్ మార్గంలో తరలించి ఆరుగురుకి అమర్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇలా అరుగురు జీవితాల్లో వెలుగు నింపిన. భార్య సారిక, తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి ఆదర్శంగా నిలిచారు. మా కుమారుడి ప్రాణాన్ని కోల్పోయిన ఆరుగురికి ఊపిరి పోశాడని, భార్య సారిక, మరియు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు తమకు దూరమవడంతో, వారు గుండెలవిసేలా రోదించారు. కుసునూర్ గ్రామం, చేవెళ్ల గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీకాంత్ మరణ వార్తతో గ్రామంలో. విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్…

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం…

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో వచ్చేనెల నవంబర్ తేదీలో 13 14 15 16 జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవం ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాబోయే కార్తీక మాసంలో జరగనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన కొరకు తమ వంతుగా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు సురేష్ దంపతులు 5000 రూ ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి రూ నగదుగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ భటిక స్వామి బూర రాజగోపాల్ గౌడ్ మాదాసు మొగిలి గౌడ్ మాదాసు అర్జున గౌడు ఉయ్యాల బిక్షపతి గౌడ్ దయ్యాలభద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ గోరంటల రాజన్న గుప్త పాల్గొన్నారు

మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా…

మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా

నడికూడ,నేటిధాత్రి:

 

స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు.తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క సతీష్ తండ్రి సల్మాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1996-1997 సెవెంత్ పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతనికి రూ.10 వేలు అందజేశారు.భవిష్యత్ లోనూ తోటి స్నేహితుల ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.సతీష్ స్నేహితులను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు కౌకొండ గ్రామస్తులు అభినందించారు.సహాయం అందజేసిన వారిలో ముక్కెర రాజు,ముక్కెర చిరంజీవి, ఎండి సాధిక్ పాషా,మేకల సతీష్,పేర్వాల బాలకృష్ణ, మేకల రాజేందర్,బొల్లె ఓంకార్,పసుల నర్సింగం, ఎండి గిడ్డు,జన్నారపు వేణు, మేకల కుమారస్వామి,మేకల ఓంకార్,జన్నారపు చంద్రమౌళి,సుమలత, శారద,జ్యోతి,తదితరులు ఉన్నారు.

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం…

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం

◆- ఐడీఎస్ఎంటీ బాధితుల నిరసన

◆- మాజీ వైస్ చైర్మన్, మహిళకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్:ఐడీఎస్ఎంటీ కాలనీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ల బాధితులు ఇవాళ జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు ఎండీ తంజిం, నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి బైటాయించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. గేటు ముందు నుం చి పక్కకు తప్పుకుని నిరసన తెలపాలని సీఐ సూచించినప్పటికీ వారు అంగీకరించకపోవ డంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా చోటు చేసుకు న్న తోపులాటలో మాజీ వైస్ చైర్మన్ తంజిం, ఓ మహిళ సహా స్పృహ తప్పి పడిపోయింది. తమ ఇళ్లు, స్థలాల ప్రైవేటు వ్యక్తులు లాగేసుకున్న వి షయాన్ని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..

పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..!

◆ – కేసు నమోదు చేసిన హద్మూర్ ఎస్సై సుజిత్..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి….

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి

సిపిఐఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

మరిపెడ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, పత్తికి కనీస మద్దతు ధర 10075 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, ప్రభుత్వాలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అది మాటల్లోనే ఉందని, ప్రతి సంవత్సరానికి పెట్టు పడే రెండింతలు అవుతుందని దానికి తగిన ప్రతిఫలం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, పత్తి దిగుమతి పై ఉన్న 11% సుంకాన్ని కొనసాగించాలి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, పత్తి కొనుగోలు కేంద్రాల బాధ్యతనుండి తట్టుకోవాలనుకుంటున్న ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలి, అనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ విధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే,పక్షంలో రైతుల్ని అందర్నీ కలుపుకొని ఉద్యమం చేపట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఆర్గనైజర్ బాణాల రాజన్న, దొంతు మమత, కందాల రమేష్, కొండ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. నిన్ననే ప్రారంభోత్సవం చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలను.మహిళా సంఘాల ఆధ్వర్యంలో. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. అలాగే ప్రభుత్వం గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు చేయాలని మహిళల అభివృద్ధి ధ్యేయంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఐకెపి సెంటర్లద్వారా వడ్ల కొనుగోలు చేయడంతో పాటు మహిళలకు ఐకెపి సెంటర్ల ద్వారా. ఉపాధి కల్పిస్తున్నట్టు తెలియజేస్తూ మహిళా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అలాంటిది రైతులు పండించిన ధాన్యాన్ని. రైస్ మిల్లులో గాని. దళారుల గాని అమ్మి మోసపోవద్దని. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు రైతులు ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని. ప్రజలను. ఆర్థికంగా. నిండా ముంచి వెళ్ళాయని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా. రాష్ట్రాన్ని. అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్. వెలుపుల. స్వరూప తిరుపతి రెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ఏపీఎం.. డైరెక్టర్లు తిరుపతి రెడ్డి. నక్క నరసయ్య. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మునిగిల రాజు. శ్రీనివాస్ రైతులు మహిళా సంఘ సభ్యులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బెల్లంపల్లిలో బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ మద్దతు…

బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని
హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి.
బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.
పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్.
తదితరులు పాల్గొన్నారు ,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version