గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు…

*గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు.

*మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్16

 

గూగుల్ రాకతో ఎఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతొందని దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు చేకూరనున్నాయని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని వివరిస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిశాఖపట్నంలో ఒక గిగావాట్ (
జి డెబ్యూ) హైపర్స్కల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు,
కూటమి ప్రభుత్వం చొరవతో, వైజాగ్లో ఏర్పడుతున్న ఏఐ సిటీకి దాదాపు 10 బిలియన్ లు పెట్టుబడి పెట్టనుందన్నారు,
ఆసియాలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా విశాఖపట్నంలో ఈ సెంటర్ నిలవనుందన్నారు,
రాష్ట్రం ఒక స్వర్గధామంగా మారుతోంది. వైజాగ్ లో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని డిజిటల్ పవర్ హౌస్ మార్చే దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం,ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టించనుందని వివరించారు,
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు,
మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందనిసీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖకు వచ్చేసిందన్నారు,
దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం కానుందన్నారు

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్…

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్

పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం

గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .

తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ బాకీలు:

పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి

శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి..

ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి

అవినీతిపరులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటే ఏసీబీ శాఖను అవమానపరిచినట్లే

ఎన్ హెచ్ ఆర్ సి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బూర్ల వంశీ

పెద్దపల్లి టౌన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కు పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏసీబీ నిర్వహించే దాడులలో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు ఎలా సుద్ధపూసలు అవుతారని, అసలు వారు నిర్దోషులు ఎలా అవుతారని ఆయన అన్నారు. కోర్టులలో నిర్దోషులమని క్లీన్ చీట్ తెచ్చుకొని మళ్లీ వారు ఉద్యోగంలోకి వస్తే ఇంకా వారి ఆగడాలకు హద్దు, అదుపు ఉండదని ఆయన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ను అవమానపరిచినట్లేనని ఆయన అన్నారు. ఏసీబీకి చిక్కిన కూడా కోర్టుల ద్వారా మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చుననే అభిప్రాయం ఇప్పటికే ఉందని కాబట్టి పూర్తి ఆధారాలతో పట్టుబడ్డ వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనట్లయితే ఏసీబీ పట్ల ఎవరికి భయం, భక్తి ఉండవని ఆ శాఖను ఎవరూ పట్టించుకోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వారు తీసుకునే నిర్ణయాన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. ఏసీబీకి చిక్కిన అవినీతి అక్రమార్కుల విషయంలో చట్టాలను కఠినతరం చేయాలని, దోషులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా గౌరవ కోర్టులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఎసిబి కోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రజాధనం కాపాడడానికి ఏసీబీకి సమాచారం అందించిన వారిని దేశభక్తులుగా పరిగణించాలని, వారికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కమలాకర్, నాయకులు రాజ్యలక్ష్మి, నంబయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి.

ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి.

ఏసీబీకి సమాచారం ఇచ్చి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలి. వారిని దేశభక్తులుగా ప్రకటించాలి.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

నేటిధాత్రి”,

 

 

 

 

దిల్ సుఖ్ నగర్ (గ్రేటర్ హైదరాబాద్): అ

వినీతి అక్రమాలతో ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని, వారి స్థానంలో ఏసీబీకి పట్టించి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులను దేశభక్తులుగా ప్రకటించి, వారి అర్హతను బట్టి వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.

దేశంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అక్రమ సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి, అధికారుల అండతోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

ఈ విషయంలో త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో కార్యచరణను చేబట్టబోతున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏసీబీ చురుకుగా పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు.

ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా తప్పు చేసి పట్టుబడ్డవారికి క్లీన్ చిట్ ఇవ్వడం తగదని ఆయన అన్నారు.

అలాంటి వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని న్యాయస్థానాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి చేతిలో ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లెం భరత్ రాజ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు రాగం శ్రీశైలం యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ లావణ్య, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల శ్రీనివాస్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు బాతరాజు సిద్దు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం.

ఉద్యోగాల పేరుతో మోసం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version