గుండెపోటుతో యువకుడు మృతి.

గుండెపోటుతో యువకుడు మృతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ.

” తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు శుభసందర్భంగా పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి తెలంగాణ గుండె తన్నీరు హరీష్ అన్న అనే పాటను సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టి ఎన్ జి ఓ ఎస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, & జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యేలు మాణిక్ రావు గారు, చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన హృదయ నేత నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేసే నాయకుడు అని, సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజలకు తన సేవలను అందించాలని కోరుకుంటున్నాం అన్నారు.అనంతరం ఇట్టి కార్యక్రమానికి ముఖ్యలు పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి గారిని మరియు వారి తనయుడు సాయి ప్రణీత్ రెడ్డి గార్లను అభినందించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్, కలిమ్ , మ్యతరి ఆనంద్ , యువ నాయకులు మిథున్ రాజ్,దీపక్,సందీప్ , దినకర్, తదితరులు.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి

మరిపెడ:నేటిధాత్రి.

మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కొన్ని రోజులుగా తల్లి గుడిసె భారతమ్మ అనారోగ్యం తో గురువారం ఉదయం మృతి చెందింది.బంధువులందరూ వచ్చారు ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి సాయంత్రం ఆమె దహన సంస్కారాలు పూర్తియైనతరువాత ఇంటికి వస్తున్నా క్రమంలో కొడుకు గుడిసె శీను (45)గుండెపోటుతో బంధువులు, గ్రామస్తులు, సన్నిహితులు అందరూ చూస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను మరణించాడని తెలిసి కన్నీటి పార్వంతామయ్యరు .తల్లి చితి అరక ముందే కొడుకు మరణించడం తో ఎల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికి భార్య ఒక కూతురు, కుమారుడు ఉన్నారని అతను సుతారి మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందనిఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version